- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Arvind Kejriwal: సిసోదియా పేరు నేను చెప్పలేదు.. కోర్టులో వాదనలు వినిపించిన కేజ్రీవాల్
Arvind Kejriwal: మద్యం కుంభకోణం కేసులో దిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోదియాను ఇరికించేందుకు తాను ప్రయత్నించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని దిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఈ మేరకు ఆయన కోర్టులో స్వయంగా వాదనలు వినిపించారు.
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణం (Delhi Excise Scam Case) వ్యవహారంలో బుధవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈడీ కేసులో బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను నేడు సీబీఐ అరెస్టు చేసింది. ఆయనను కోర్టులో హాజరుపర్చగా.. కేసుకు సంబంధించిన సీఎం తన వాదనలను స్వయంగా వినిపించారు. ఈ కేసులో మనీశ్ సిసోదియా పేరు తానే చెప్పినట్లు వస్తున్న వార్తలను ఖండించారు.
‘‘లిక్కర్ పాలసీ కుంభకోణంలో మొత్తం పాత్ర మనీశ్ సిసోదియా (Manish Sisodia)దే అంటూ వాంగ్మూలం ఇచ్చానని సీబీఐ (CBI) వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. దీనిపై మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం. సిసోదియాపై గానీ, ఇతర వ్యక్తులపై గానీ నేను ఎలాంటి నిందలు వేయలేదు. నేను, సిసోదియా, ఆమ్ ఆద్మీ పార్టీ అంతా అమాయకులం. మీడియాలో మాపై దుష్ప్రచారం చేయాలని సీబీఐ ప్లాన్ చేస్తోంది. అందుకే విశ్వసనీయ వర్గాల పేరుతో నకిలీ సమాచారాన్ని వ్యాప్తి చేసి సంచలనం సృష్టించాలని చూస్తోంది. దీనిపై స్పష్టత రావాలి’’ అని కేజ్రీవాల్ వాదించారు.
దిల్లీ మద్యం కుంభకోణం.. సీబీఐ అదుపులో సీఎం కేజ్రీవాల్
కేజ్రీవాల్ను కోర్టులో హాజరుపర్చిన తర్వాత సీబీఐ తమ వాదనలు వినిపిస్తూ.. మద్యం దుకాణాలను ప్రైవేటీకరించాలని కేబినెట్ సహచరుడు (సిసోదియాను ఉద్దేశిస్తూ) సిఫార్సు చేశారని కేజ్రీవాల్ చెప్పినట్లు కోర్టుకు వెల్లడించింది. దీన్నే సీఎం ఖండించారు. ఈ కేసులో తనను సీబీఐ గతేడాది సాక్షిగా విచారించిన విషయాన్ని కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఈ సందర్భంగా గుర్తుచేశారు. మద్యం విధానానికి సంబంధించి తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అప్పుడే దర్యాప్తు సంస్థకు వెల్లడించినట్లు చెప్పారు.
ఈ వాదనల అనంతరం కేజ్రీవాల్ను కస్టడీకి అప్పగించాలని సీబీఐ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. దీనిపై కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మరోవైపు ఈడీ కేసులో కేజ్రీవాల్కు లభించిన బెయిల్పై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతానికి ఆయన తిహాడ్ జైల్లోనే ఉండాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభలో గరం గరం.. ఖర్గే, ధన్ఖడ్ మధ్య మాటల యుద్ధం
నీట్ పేపర్ లీక్పై చర్చ జరపాలంటూ రాజ్యసభలో విపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మధ్య మాటల యుద్ధం జరిగింది. -
నీట్పై చర్చకు ఇండియా కూటమి సిద్ధం: రాహుల్
నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపడానికి ప్రతిపక్ష ఇండియా కూటమి సిద్ధంగా ఉందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. -
పీజీ చేసిన ఉద్యోగికి.. లీవ్లెటర్ రాయడం రాకుంటే ఎలా? - సుప్రీం కోర్టు
దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని.. అటువంటి వారు నైపుణ్యాలను మెరగుపరచుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
5-స్టార్ హోటల్ బాల్కనీలో దుస్తులు ఆరేసిన మహిళ.. వీడియో వైరల్
దుబాయ్లోని 5-స్టార్ హోటల్ బాల్కనీలో ఓ మహిళ దుస్తులు ఆరబెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
ప్రధాని మోదీని కలిసిన రాధిక-శరత్ కుమార్.. ఎందుకంటే..?
రాధిక- శరత్ కుమార్ (Radhika SarathKumar) దంపతులు నేడు ప్రధాని మోదీని కలిశారు. ఈ క్రమంలో వారిమధ్య తమిళనాడు రాజకీయాలపై చర్చ జరిగింది. -
భూ కుంభకోణం కేసులో బెయిల్.. హేమంత్ సోరెన్ విడుదల
Hemant Soren: ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదలయ్యారు. -
దిల్లీ ఎయిర్పోర్టు ఘటన.. నాటి పౌర విమానయానశాఖ మంత్రి ఏమన్నారంటే
దిల్లీ విమానాశ్రయ ఘటనపై విపక్షాలు శవరాజకీయాలు చేస్తున్నాయని ఎన్సీపీ నేత, పౌరవిమానయానశాఖ మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్ మండిపడ్డారు. -
జలమయంగా దిల్లీ: ఎంపీని ఎత్తుకొని వచ్చి.. కారులో కూర్చోబెట్టి..!
దేశ రాజధాని దిల్లీలో కురుస్తోన్న భారీ వర్షాలకు (Delhi rainfall) పలు ప్రాంతాల్లోకి పెద్ద మొత్తంలో వరదనీరు వచ్చి చేరింది. -
నాపై ఉన్న పోక్సో కేసును కొట్టేయండి: యడియూరప్ప
పోక్సో చట్టం కింద తనపై నమోదైన కేసును రద్దు చేయాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశారు. -
‘నీట్’పై లోక్సభలో గందరగోళం.. తమిళనాడు కీలక తీర్మానం
దేశ వ్యాప్తంగా వైద్యసీట్ల భర్తీ కోసం నిర్వహించే నీట్ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం చేసింది. -
సభలో రాహుల్ గాంధీ మైక్ మ్యూట్ చేశారు.. కాంగ్రెస్ ఆరోపణలు
లోక్సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీక్ అంశాన్ని లేవనెత్తారు. ఆ సందర్భంలో ఆయన మైక్ ఆఫ్ అయిందని కాంగ్రెస్ ఆరోపించింది. -
పరీక్షల విధానంలో సంస్కరణలు.. సలహాల కోసం వెబ్సైట్ ప్రారంభం
పరీక్షల నిర్వహణ విభాగం ఎన్టీఏలో సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ కసరత్తు ప్రారంభించింది. -
కంపెనీలో వాటా ఇస్తే ఉద్యోగం మానేస్తా: భర్తకు కండీషన్ పెట్టిన భార్య
ఇటీవల ఓ మహిళ సామాజిక మాధ్యమం రెడిట్ వేదికగా చేసిన పోస్ట్ వైరల్గా మారింది. -
‘నీట్’పై చర్చకు విపక్షాల పట్టు.. లోక్సభ సోమవారానికి వాయిదా
Lok Sabha: నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టడంతో పార్లమెంట్లో గందరగోళం నెలకొంది. లోక్సభ సోమవారానికి వాయిదా పడింది. -
దిల్లీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాలు జల దిగ్బంధం..!
దిల్లీలో భారీ వర్షాలు (Delhi rainfall) కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. -
భూ కుంభకోణం కేసు.. మాజీ సీఎం హేమంత్ సోరెన్కు బెయిల్
Hemant Soren: భూ కుంభకోణం కేసులో ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్కు ఆ రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
స్త్రీ, పురుషులిద్దరూ సమానమే కానీ.. : లింగ సమానత్వంపై సుధామూర్తి ఏమన్నారంటే..?
రాజ్యసభ ఎంపీ సుధామూర్తి (Sudha Murty) లింగ సమానత్వం గురించి తనదైన వివరణ ఇచ్చారు. -
కూలిన టెర్మినల్ పైకప్పు.. అది మోదీ ప్రారంభించినది కాదు: రామ్మోహన్ నాయుడు
దిల్లీలోని విమానాశ్రయంలో జరిగిన ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu) స్పందించారు. విపక్షాలు చేస్తోన్న విమర్శలకు బదులిచ్చారు. -
ఎమర్జెన్సీ ప్రజాస్వామ్య వ్యతిరేకమే కానీ..: శశిథరూర్ కీలక వ్యాఖ్యలు
Shashi Tharoor: దేశంలో అత్యయిక స్థితి విధించడంపై కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అది ప్రజాస్వామ్య వ్యతిరేకమే గానీ.. రాజ్యాంగ విరుద్ధం కాదన్నారు. -
దిల్లీ విమానాశ్రయంలో కూలిన టెర్మినల్ పైకప్పు.. ఆరుగురికి గాయాలు
Delhi airport: దిల్లీలో వరుసగా రెండో రోజూ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విమానాశ్రయంలోని టెర్మినల్-1 పైకప్పులో కొంత భాగం కుప్పకూలింది. -
భారతీయ రచయిత్రికి కామన్వెల్త్ బహుమతి
కామన్వెల్త్ కథానికల పోటీలో ముంబయికి చెందిన 26 ఏళ్ల సంజనా ఠాకుర్ ప్రథమ బహుమతి గెలుచుకున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్ సేన దూసుకెళ్తోంది.. 11 ఏళ్ల సుదీర్ఘ విరామానికి స్వస్తి పలకాలి: గంగూలీ
-
తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల
-
రాజ్యసభలో గరం గరం.. ఖర్గే, ధన్ఖడ్ మధ్య మాటల యుద్ధం
-
బంజారాహిల్స్లో డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడిన డీజేలు
-
ఆ దూషణలు నన్నెంతో బాధించాయి - రిషి సునాక్
-
‘కల్కి’ ఆ రికార్డు జస్ట్ మిస్.. ఫస్ట్ డే రూ.100 కోట్లపైన వసూలు చేసిన చిత్రాలివే!