Pratibha Patil: ఆసుపత్రిలో చేరిన మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌

Pratibha Patil: జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్‌తో మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.

Updated : 14 Mar 2024 10:06 IST

పుణె: మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ (Pratibha Patil) ఆసుపత్రిలో చేరారు. పుణెలోని భారతీ హాస్పిటల్‌లో బుధవారం రాత్రి నుంచి చికిత్స పొందుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పారు. వైద్యుల బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. భారత్‌కు రాష్ట్రపతిగా పనిచేసిన తొలి మహిళగా ప్రతిభా పాటిల్‌ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 2007 నుంచి 2012 వరకు పదవిలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని