- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Hathras Stampede: నిర్వాహకులదే తప్పిదంగా కనిపిస్తోంది.. హాథ్రస్ ఘటనపై సిట్ చీఫ్
హాథ్రస్ తొక్కిసలాట ఘటనలో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు.. నిర్వాహకులదే తప్పిదమని సూచిస్తున్నాయని దర్యాప్తు అధికారి తెలిపారు.
లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట (Hathras Stampede) ఘటన 121 మందిని బలిగొంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తన విచారణను వేగవంతం చేసింది. ఇప్పటివరకు 90 మంది వాంగ్మూలాలను నమోదు చేసినట్లు సిట్కు నేతృత్వం వహిస్తున్న ఏడీజీ అనుపమ్ కురుక్షేత్ర తెలిపారు. కార్యక్రమ నిర్వాహకులదే తప్పిదమని ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు సూచిస్తున్నాయని పీటీఐ వార్తాసంస్థకు వెల్లడించారు.
‘‘తొక్కిసలాట ఘటనపై రూపొందించిన ప్రాథమిక నివేదికను సీఎం యోగి ఆదిత్యనాథ్కు ఇప్పటికే సమర్పించాం. హాథ్రస్ డీఎం ఆశీష్ కుమార్, ఎస్పీ నిపుణ్ అగర్వాల్, ఇతర అధికారుల స్టేట్మెంట్లను ఇందులో పొందుపర్చాం. కేసులో పూర్తిస్థాయి దర్యాప్తును ముమ్మరం చేశాం. ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాధారాలు.. నిర్వాహకుల అపరాధాన్ని సూచిస్తున్నాయి’’ అని ఏడీజీ తెలిపారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. భోలే బాబా ఆచూకీ లభించాల్సి ఉంది. కేసులో ఆయన్ని నిందితుడిగా చేర్చలేదని అలీగఢ్ ఐజీ శాలభ్ మాథుర్ గురువారం తెలిపారు.
24 ఆశ్రమాలు, లగ్జరీ కార్లు.. భోలే బాబాకు ₹100 కోట్ల ఆస్తులు!
ఎఫ్ఐఆర్లోని వివరాల ప్రకారం.. హాథ్రస్ జిల్లా సికంద్రరావ్ ప్రాంతం ఫుల్రయీ, ముగల్గఢీ గ్రామాల మధ్యలోని రహదారిని అనుకొని ఉన్న ఓ ఖాళీ ప్రదేశంలో తాత్కాలిక షెడ్లు వేసి సత్సంగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 80 వేల మంది భక్తులు హాజరవుతారని నిర్వాహకులు పోలీసుల అనుమతి తీసుకున్నారు. అయితే 2.5 లక్షలకు పైగా ప్రజలు వచ్చినట్లు తేలింది. జనం కిక్కిరిసి ఊపిరాడని కారణంగానే మరణాలు సంభవించాయని శవపరీక్షల్లో తేలిందని ఎటాలోని జిల్లా ఆసుపత్రి వైద్యులు ఇప్పటికే వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదవుల కోసం నేతలు పోటీ.. కాంగ్రెస్ ప్రభుత్వం గాఢనిద్రలో..!: కేంద్రమంత్రి శోభా కరంద్లాజే
కర్ణాటకలో సీఎం, డిప్యూటీ సీఎం నియామకాలపై కాంగ్రెస్ నేతల మధ్య జరుగుతున్న వాగ్వాదంపై కేంద్రమంత్రి శోభా కరంద్లాజే విమర్శలు గుప్పించారు. -
రిసార్టులో 49 మంది.. ఒక్కసారిగా చుట్టుముట్టిన వరదనీరు..
ఠానే జిల్లాలో కురిసిన భారీ వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి. పలు భవనాలు వరదనీటిలో చిక్కుకోగా.. రైల్వే ట్రాక్లపై మట్టిచేరడంతో లోకల్ రైల్ సర్వీసుల్ని తాత్కాలికంగా రద్దు చేశారు. -
మంజకోట్ ఆర్మీ క్యాంపు వద్ద కాల్పులు..గాయపడిన జవాన్
రాజౌరి జిల్లాలోని మంజకోట్ ఆర్మీ క్యాంపు సమీపంలో శనివారం రాత్రి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. -
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చార్ధామ్ యాత్ర నిలిపివేత
ఉత్తరాఖండ్ గర్వాల్ డివిజన్లో భారీ వర్షాల కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. -
జగన్నాథుడి రథయాత్ర.. కిక్కిరిసిన పూరీ వీధులు
ఒడిశాలోని పూరీలో విశ్వప్రసిద్ధ జగన్నాథుడి రథయాత్ర కోలాహలం నెలకొంది. ఆ రాష్ట్రంతో పాటు దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. -
సూరత్లో భవనం కుప్పకూలిన ఘటన.. ఏడుకు చేరిన మృతులు
గుజరాత్ రాష్ట్రం సూరత్లో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. సూరత్లోని పాల్ ప్రాంతంలో శనివారం ఆరంతస్తుల భవనం కూలింది. -
నేడు పూరీ జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్ర
ఒడిశాలోని పూరీ జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్రను ఆదివారం నిర్వహించనున్నారు. జగన్నాథ, బలభద్ర, సుభద్రలు శ్రీక్షేత్రంలోని రత్నసింహాసనం వీడి యాత్రగా... -
శారీరకంగా దృఢంగా ఉన్నా: దలైలామా
తాను శారీరకంగా దృఢంగా ఉన్నానని.. బుద్ధుని బోధనల వ్యాప్తికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని బౌద్ధ గురువు దలైలామా పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన మోకాలి మార్పిడి శస్త్రచికిత్స పూర్తిచేసుకొని కోలుకుంటున్నారు. -
పేపర్ లీక్ ఆరోపణలు.. ప్రిన్సిపల్ను కుర్చీలోంచి బయటకు లాగేసిన సిబ్బంది
పేపర్ లీక్ కుంభకోణంలో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో ఓ ప్రిన్సిపల్ను సిబ్బంది అంతా కలిసి బయటకు తోసేశారు. ఆమె ఫోన్ లాగేసుకొని, కుర్చీ నుంచి లేపి, బలవంతంగా బయటకు పంపారు. -
అనంత్, రాధికల సంగీత్ వేడుకలో.. జస్టిన్ బీబర్, బాలీవుడ్ తారల తళుకు
దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఇంట అనంత్ - రాధికల ముందస్తు పెళ్లి వేడుకలు జోరుగా సాగుతున్నాయి. జియో కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన ‘సంగీత్’ కార్యక్రమంలో కెనడాకు చెందిన పాప్ సింగర్ జస్టిన్ బీబర్ (30)తోపాటు బాలీవుడ్ తారలు సల్మాన్ఖాన్, రణవీర్ సింగ్, -
తేలికపాటి స్వదేశీ యుద్ధ ట్యాంకు సిద్ధం
తూర్పు లద్ధాఖ్లో వాస్తవాధీనరేఖ వెంబడి చైనా దుందుడుకు చర్యలను అడ్డుకునేందుకు భారత్ అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ ట్యాంకు ‘జొరావర్’ సిద్ధమైంది. తాజాగా దీనిపై పరీక్షలు మొదలయ్యాయి. -
23న కేంద్ర బడ్జెట్
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈనెల 22 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. -
సూరత్లో కుప్పకూలిన ఆరంతస్తుల భవనం
గుజరాత్లో పెను ప్రమాదం చోటుచేసుకుంది. సూరత్ పట్టణంలోని పాల్ ప్రాంతంలో శనివారం ఓ ఆరంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. శిథిలాల్లో పలువురు చిక్కుకుపోయారు. -
కేజ్రీవాల్పైనే దర్యాప్తు జరుగుతోంది
మద్యం కుంభకోణానికి సంబంధించిన అవినీతి కేసులో దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 15 వరకు న్యాయస్థానం పొడిగించింది. -
దోషులు శిక్ష నుంచి తప్పించుకోలేరు
హాథ్రస్ తొక్కిసలాటకు బాధ్యులైన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని వివాదాస్పద సూరజ్ పాల్ అలియాస్ నారాయణ్ సాకార్ హరి అలియాస్ భోలే బాబా పేర్కొన్నారు. మరణించిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి అండగా ఉంటామని చెప్పారు. -
ఖరారు కాని నీట్ కౌన్సెలింగ్ షెడ్యూలు
వైద్యవిద్యకు సంబంధించిన 2024 నీట్ యూజీ, పీజీ కోర్సుల కౌన్సెలింగు షెడ్యూలును మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ఇంకా నోటిఫై చేయలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ శనివారం స్పష్టం చేసింది. -
నలుగురు ముష్కరులను మట్టుబెట్టిన సైన్యం
జమ్మూకశ్మీర్లో శనివారం రెండు వేర్వేరు చోట్ల ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ ఘటనల్లో నలుగురు ఉగ్రవాదుల్ని భద్రతాదళాలు మట్టుబెట్టాయి. ఇద్దరు సైనికులూ ప్రాణాలు కోల్పోయారు. -
సంక్షిప్త వార్తలు
వ్యవసాయ మార్కెట్లలో అనధీకృత వ్యక్తులు వ్యవసాయ ఉత్పత్తుల గ్రేడింగ్, మార్కింగ్ పనులు చేస్తే జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
సీసీటీవీల అవినీతి కేసులో మాజీ మంత్రి సత్యేందర్ జైన్పై దర్యాప్తు
దేశ రాజధాని దిల్లీ నగరంలో సీసీటీవీల ఏర్పాటులో అవినీతి జరిగిందనే ఆరోపణలకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు, మాజీ మంత్రి సత్యేందర్ జైన్పై దర్యాప్తునకు లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనా అనుమతించారు. -
లోకోపైలట్లతో రాహుల్ భేటీపై వివాదం
రైల్వే డ్రైవర్ల (లోకోపైలట్ల)తో లోక్సభ విపక్షనేత రాహుల్గాంధీ భేటీఅయి వారి సమస్యలపై చర్చించడం కాస్త వివాదానికి తావిచ్చింది. కొత్తదిల్లీ రైల్వేస్టేషన్లో శుక్రవారం రాహుల్తో మాట్లాడిన డ్రైవర్లంతా బయటివారేనని, -
హిమాచల్ను ముంచెత్తుతున్న వర్షాలు.. ధర్మశాలలో 214.6మి.మీ వర్షపాతం
హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. కాంగ్రా జిల్లాలోని ధర్మశాలలో అత్యధికంగా 214.6మి.మీ వర్షపాతం నమోదైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నల్ల డైరీ చెప్పిన గోల్ ‘మాల్’ కథ.. రూ.కోట్లలోనే కస్టమర్లకు సున్నం!
-
అలాచేసిన వారు విజయ తీరాలకు చేరతారు: సీఎం రేవంత్
-
ఉక్రెయిన్ ప్రతిదాడులు.. రష్యాలో పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వాట్సప్లో ఫిర్యాదు.. దివ్యాంగ విద్యార్థుల సమస్యను పరిష్కరించిన మంత్రి లోకేశ్
-
రూ.10 లక్షలకు ఆయుష్మాన్ భారత్.. మరింత మందికి పథకం విస్తరణ?