- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
congress: దేశంలో విద్యావ్యవస్థ నాశనం అయ్యింది: కాంగ్రెస్
నీట్ యూజీ, యూజీసీ నెట్ ప్రశ్నపత్రాల లీకేజీతో జరుగుతున్న వివాదాల నేపథ్యంలో ఆదివారం జరగాల్సిన నీట్ పీజీ ప్రవేశ పరీక్షను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. దీనిపై కాంగ్రెస్ మండిపడింది.
దిల్లీ: నీట్ యూజీ, యూజీసీ నెట్ ప్రశ్నపత్రాల లీకేజీతో ముసురుకున్న వివాదాల నేపథ్యంలో ఆదివారం జరగాల్సిన నీట్ పీజీ ప్రవేశ పరీక్షను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్(Congress) అధ్యక్షుడు మల్లికిర్జున ఖర్గే(Mallikarjun Kharge) కేంద్రంపై విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
‘‘నీట్లో జరిగిన అక్రమాలకు అధికారులను మార్చడం విద్యా వ్యవస్థలోని సమస్యకు పరిష్కారం కాదు. ఎన్టీఏ స్వయం ప్రతిపత్తి గల సంస్థ. కానీ.. ప్రస్తుతం అది భాజపా, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు అనుగుణంగా వ్యవహరిస్తోంది. విద్యార్థులకు న్యాయం జరిగేలా చూసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఇప్పుడు నీట్ పరీక్ష వాయిదా పడింది. ఈ పది రోజుల్లో దాదాపు 4 పరీక్షలను వాయిదా వేయడమో, రద్దు చేయడమో చేశారు. పేపర్ లీకేజీలు, అవినీతి, అవకతవకలు మన విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నాయి. దీని వల్ల నీట్ అభ్యర్థుల భవిష్యత్తు చిన్నాభిన్నం అవుతోంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ(PM Modi) హయాంలో దేశంలో విద్యావ్యవస్థ ధ్వంసమైందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మండిపడ్డారు. భాజపా పాలనలో విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టకుండా ప్రభుత్వంపై పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అసహనం వ్యక్తం చేశారు. పేపర్ లీక్ రాకెట్, విద్యాశాఖలో జరుగుతున్న అవినీతిపై చర్యలు తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం నిస్సహాయంగా ఉందన్నారు. అసమర్థ మోదీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుకు పెను ప్రమాదమని, దేశ భవిష్యత్తును కాపాడుకోవాల్సిన అవసరం ఉందని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు.
నీట్ పరీక్షను తొలుత మార్చి 3న నిర్వహించాల్సి ఉండగా.. ఆ తర్వాత జూలై 7న నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అనంతరం జూన్ 23కి అంటే ఈరోజుకి సవరించారు. అయితే.. కొన్ని గంటల ముందు శనివారం రాత్రి 10 గంటలకు కేంద్ర ఆరోగ్యశాఖ స్పందిస్తూ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు జాతీయ పరీక్షల సంస్థ(ఎన్టీఏ) డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్కు ఉద్వాసన పలికింది. నీట్ యూజీలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది. ముందు జాగ్రత్త చర్యగా నీట్ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నామని శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అతి త్వరలో పరీక్ష తేదీని ప్రకటిస్తామని తెలిపింది. వాయిదావల్ల విద్యార్థులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేదార్నాథ్లో మంచు ఉప్పెన.. వీడియో వైరల్
‘కేదార్నాథ్ ధామ్’ సమీపంలో మంచు ఉప్పెన విరుచుకుపడింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. -
ప్రభుత్వ మద్యంలో ‘కిక్’ లేకపోవడంతోనే.. మంత్రి వ్యాఖ్యలపై దుమారం!
తమిళనాడులో ప్రభుత్వం సరఫరా చేసే మద్యంలో ‘కిక్’ లేదంటూ డీఎంకే సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలపై విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. -
గుజరాత్లో భారీ వర్షాలు.. రోడ్డుపై భారీ గుంత.. కాంగ్రెస్ చురకలు
అహ్మదాబాద్ను వర్షం అతలాకుతలం చేసింది. నగరంలోని ప్రధాన రహదారి మధ్యలో భారీ గుంత ఏర్పడింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/07/24)
-
రికార్డులు సృష్టిస్తున్న ‘కల్కి’.. రూ.500 కోట్ల క్లబ్లో చేరిక
-
దీదీ.. ఈ ఘోరం మీకు కనిపించలేదా?ఇదేనా మీ పాలన?
-
ఖుషీ స్వెట్టర్ కోరిక.. చీరలో వేదిక.. కోర్టులో రెజీనా
-
జలపాతం సందర్శనకు వెళ్లి.. ఒకే కుటుంబంలో అయిదుగురు గల్లంతు!
-
కేదార్నాథ్లో మంచు ఉప్పెన.. వీడియో వైరల్