- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
‘నీపై దయచూపడమా..?’: కుమార్తె గర్భానికి కారణమైన తండ్రికి 101 ఏళ్ల జైలు
కొన్నేళ్లపాటు కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడిన ఓ వ్యక్తికి కేరళ (Kerala)లోని కోర్టు విధించిన శిక్ష సంచలనం సృష్టించింది.
దిల్లీ: కన్నకూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ తండ్రి ఆమె భవిష్యత్తును చిదిమేశాడు. పదేళ్ల ప్రాయం నుంచే ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఆ పైశాచికత్వం బయటపెట్టకూడదని బెదిరించడమే కాకుండా ఆరేళ్లపాటు మృగంలా ప్రవర్తించాడు. 16 ఏళ్ల వయసులో ఆ బాలిక గర్భం దాల్చడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కేరళలోని మల్లపురానికి చెందిన స్పెషల్ ఫాస్ట్ట్రాక్ కోర్టు దీనిపై తాజాగా తీర్పు వెలువరించింది. కేసు తీవ్రత దృష్ట్యా అతడికి 101 ఏళ్ల జైలు శిక్షతో పాటు యావజ్జీవ కారాగార శిక్షనూ విధించింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం..
పోక్సో, జువెనైల్ జస్టిస్ యాక్ట్ వంటి చట్టాల కింద గతవారం ఆ వ్యక్తికి కోర్టు శిక్ష వేసింది. ఈ క్రూరమైన నేర ప్రభావం ఆ బాలికపై జీవితాంతం ఉంటుందని తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ‘‘ఒక తండ్రిగా ఆ చిన్నారిని కాపాడాల్సిన వ్యక్తే.. ఈ దారుణానికి ఒడిగట్టాడు. 16 ఏళ్ల వయసులో ఆమె గర్భం దాల్చేవరకు పైశాచికత్వాన్ని కొనసాగించాడు. దీనిని సాధారణ లైంగిక నేరంగా చూడలేం. నేరానికి పాల్పడిన వ్యక్తి ఆర్థికంగా, విద్యాపరంగా వెనకబడిన కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. అతడిపై ఎలాంటి కనికరం చూపలేం’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆ బాలిక తల్లి నిద్రిస్తున్న సమయంలోనో, ఆమె లేనప్పుడో ఈ అకృత్యానికి పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చడంతో అతడే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అప్పుడు కూడా ఈ విషయం ఎవరికీ చెప్పొద్దన్నాడు. కానీ తర్వాత ఆమె ఇచ్చిన వాంగ్మూలంలో అసలు విషయం బయటపడిందని ఆ కథనాలు పేర్కొన్నాయి. ఆ తర్వాత మూడు నెలల గర్భాన్ని వైద్యులు తొలగించారు. డీఎన్ఏ పరీక్ష.. ఆ ఘటనకు కారకుడు ఎవరో ధ్రువీకరించింది. ఈ వివరాలన్నింటిని కోర్టు ముందు ఉంచడంతో..ఈ సంచలన తీర్పు వెలువడింది. బాధితురాలి తల్లితో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా అతడికి వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆచూకీ లేని ‘భోలే బాబా’.. బాధితుల్లో ఆక్రోశం!
మృతదేహాలను గుర్తించేందుకు మార్చురీలకు ఓవైపు.. గాయపడిన వారి కోసం ఆసుపత్రులకు పరుగులు తీయడం మరోవైపు.. తమవారి ఆచూకీ ఇంకా దొరకలేదంటూ అధికారులను పలువురు ప్రాధేయపడుతున్న యూపీలోని దృశ్యాలు కలిచివేస్తున్నాయి. -
దేవభూమిని వణికిస్తున్న వర్షాలు.. 100 రహదారులు మూసివేత
ఉత్తరాఖండ్లో కురిసిన భారీ వర్షాలకు అక్కడి నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. అలకనంద నది ఉప్పొంగడంతో రుద్రప్రయాగ వద్ద నది ఒడ్డున ఏర్పాటు చేసిన 10 అడుగుల శివుడి విగ్రహం నీట మునిగింది. -
పవిత్రా గౌడను నా భర్త పెళ్లి చేసుకోలేదు: పోలీసులకు దర్శన్ భార్య లేఖ
Renukaswamy murder case: పవిత్రా గౌడను తన భర్త దర్శన్ పెళ్లి చేసుకోలేదని నటుడి భార్య వెల్లడించారు. ఈమేరకు బెంగళూరు పోలీసు కమిషనర్కు ఆమె ఓ లేఖ రాశారు. -
ప్రచారంలో సవాలు విసిరి.. మంత్రి పదవికి రాజీనామా చేసి..!
తాను బాధ్యత వహించిన స్థానాల్లో భాజపా ఓడిపోవడంతో రాజస్థాన్ మంత్రి కిరోడి లాల్ మీనా తన పదవికి రాజీనామా చేశారు. -
ఇంకా పరారీలోనే భోలే బాబా.. ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు
Bhole Baba: హాథ్రస్ తొక్కిసలాట ఘటన తర్వాత నుంచి భోలే బాబా అదృశ్యమయ్యాడు. అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. -
వాయు కాలుష్యంతో భారత్లో ఏటా 33 వేల మరణాలు: లాన్సెట్
Pollution: వాయు కాలుష్యం కారణంగా భారత్లో సంభవిస్తున్న మరణాలపై నిర్వహించిన ఓ అధ్యయనాన్ని లాన్సెట్ ప్రచురింది. అందులోని కీలక విషయాలేంటో చూద్దాం. -
గజరాజులకు అదిరిపోయే డెన్
ఆ ఆరు ఏనుగులకూ అక్కడ రాజభోగాలే... ఉదయమే కాసేపు నడక, వ్యాయామం. 8:30కు అరటి పండ్లు, కొబ్బరి బొండాలు, క్యారెట్, చెరకు గడలు, పుచ్చకాయలతో టిఫిన్. మధ్యాహ్నం గంటన్నర సేపు జలకాలాట. -
132 సీట్లతో విమానం తరహా బస్సులు అందుబాటులోకి తెస్తాం : గడ్కరీ
కాలుష్యం అనేది దేశంలో అతిపెద్ద సమస్యగా మారిందని.. ఈ నేపథ్యంలో వ్యక్తిగత, ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు కాలుష్య రహిత మార్గాలను అన్వేషిస్తున్నామని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. -
అనుమతి 80 వేలమందికి.. హాజరైంది 2.5 లక్షలు
ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య బుధవారానికి 121కి చేరింది. -
గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సినేషను అవసరం
‘‘ఒక కుటుంబంలో తల్లి ప్రాణాలు కోల్పోతే.. ఆసుపత్రి లెక్కలో అది ఒక మరణం. కానీ, ఆ కుటుంబానికి అది తీరని లోటు’’ అని మనసులో నాటుకుపోయేలా తన తండ్రి చెప్పిన మాటలను రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి గుర్తు చేసుకున్నారు. -
సంఘ విద్రోహుల చర్య ఇది.. దర్యాప్తునకు సహకరిస్తా: భోలే బాబా
యూపీలో హాథ్రస్ దుర్ఘటన జరిగిన ఒకరోజు అనంతరం దానిపై భోలే బాబా స్పందించాడు. తాను ఆ వేదిక నుంచి వెళ్లిపోయిన చాలా సమయం తర్వాతే ఆ తొక్కిసలాట చోటుచేసుకుందన్నాడు. -
మళ్లీ ఆస్పత్రిలో చేరిన ఆడ్వాణీ
భాజపా దిగ్గజ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్.కె.ఆడ్వాణీ (96) బుధవారం రాత్రి దిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత వారం ఎయిమ్స్లో చేరి చికిత్స పొందిన విషయం తెలిసిందే. -
సూరజ్ పాలే భోలే బాబా!
అతడు తన చేతితో నీరు ఇస్తే సమస్యలు తీరుతాయట.. అతడు అడుగుపెట్టిన చోట మట్టిని తాకినా ఆశీర్వాదం అట.. ఉత్తరప్రదేశ్కు చెందిన ‘భోలే బాబా’ను అనుసరించేవారి నమ్మిక ఇది. -
రుతుపవనాల సమయంలోనూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
రుతుపవనాల సమయంలో తీవ్రమైన తేమతో కూడిన వేడికి గురవుతున్న వారి సంఖ్య భారత్లో క్రమంగా పెరుగుతోందని తాజా అధ్యయనం పేర్కొంది. ఈ రకమైన వాతావరణ ప్రభావానికి గురవతున్న వారి సంఖ్య 1951-2020 మధ్యకాలంలో 67 కోట్లకు చేరిందని తెలిపింది. -
కొవిడ్లో 3% అధికంగా.. బరువు తక్కువ శిశు జననాలు
భారత్లో కొవిడ్ మహమ్మారి సమయంలో బరువు తక్కువ శిశువుల జననాలు 3 శాతం అధికంగా నమోదైనట్లు ఓ అధ్యయనం పేర్కొంది. -
మణిపుర్ ప్రభుత్వాన్ని విశ్వసించలేం
జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడికిన మణిపుర్లోని రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆ రాష్ట్ర సర్కారును విశ్వసించలేమంటూ జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం బుధవారం మండిపడింది. -
వందేభారత్ రైలులో వర్షపునీటి లీకేజీ
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సెమీహైస్పీడ్ వందేభారత్ రైళ్లలోని సౌకర్యాలపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. -
బిహార్లో ఒకే రోజు కుప్పకూలిన 3 వంతెనలు
నిర్మాణంలో ఉన్నవి..వినియోగంలో ఉన్నవి.. పాతవి అనే తేడా లేకుండా బిహార్లో వంతెనలు కుప్పకూలుతూనే ఉన్నాయి. బుధవారం ఏకంగా మూడు వారధులు నేలమట్టమయ్యాయి. -
రాహుల్గాంధీ నివాసం వద్ద భద్రతా సిబ్బంది సంఖ్య పెంపు
మితవాద గ్రూపులు దాడి చేయవచ్చన్న నిఘా వర్గాల సమాచారంతో దిల్లీలోని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాసం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఝార్ఖండ్ సీఎంగా మళ్లీ హేమంత్ సోరెన్!
జేఎంఎం నేత హేమంత్ సోరెన్ ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా మూడోసారి పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుత ముఖ్యమంత్రి చంపయీ సోరెన్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. -
నీట్ అక్రమాలపై శిరోముండనంతో నిరసన
‘ఇండియా’ కూటమి పార్టీలకు చెందిన విద్యార్థి సంఘాలు పోటీ పరీక్షల్లో అక్రమాలను నిరసిస్తూ బుధవారం దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జగన్ జైలుకు పోయే సమయం ఆసన్నమైంది: మంత్రి రామ్ప్రసాద్రెడ్డి
-
రోహిత్ - కోహ్లీ బదులు వీళ్లే.. ఇంట్రెస్టింగ్గా మూడో ప్లేయర్ స్థానం?
-
రష్యాకు ప్రధాని మోదీ.. అయిదేళ్ల తర్వాత తొలిసారి
-
అనంత్ అంబానీ - రాధికా మర్చెంట్ ‘మామెరు’ ఫంక్షన్.. ఏంటీ వేడుక?
-
ఝార్ఖండ్ సీఎంగా.. ప్రమాణస్వీకారం చేసిన హేమంత్ సోరెన్
-
స్టీవ్ జాబ్స్తో కలిసి పనిచేసిన ఆ రోజులు మరిచిపోలేను: ఐఫోన్ మాజీ డిజైనర్