- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Rahul Gandhi: లోక్సభలో రాహుల్ ప్రసంగం.. ప్రధాని మోదీ అభ్యంతరం
దేశమంతా ఏకమై రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేసిందని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
దిల్లీ: దేశమంతా ఏకమై రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేసిందని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు. భారత్ అనే భావన, రాజ్యాంగంతోపాటు భాజపా ఆలోచనలను ప్రతిఘటించిన లక్షలాదిమందిపై గత పదేళ్లలో క్రమపద్ధతిలో దాడి జరిగిందని ఆరోపించారు. తానూ బాధితుడినేనని.. తనపై 20కిపైగా కేసులు మోపారన్నారు. ‘‘నాకు రెండేళ్ల జైలుశిక్ష పడింది. నా ఇల్లు తీసేసుకున్నారు. ఈడీ ఆధ్వర్యంలో 55 గంటల పాటు విచారణ ఎదుర్కొన్నా’’ అని రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చలో భాగంగా రాహుల్ ప్రసంగించారు. ప్రతిపక్షంలో ఉండటం గర్వంగా, సంతోషంగా ఉందని పేర్కొంటూ.. అధికారంలో కంటే ఇదే ఎక్కువ విలువైనదని, ఇందులో ‘సత్యం’ ఉందని తెలిపారు. అయితే కాంగ్రెస్ ఎంపీ మాట్లాడుతుండగా ప్రధాని సహా భాజపా ఎంపీలు పదే పదే అభ్యంతరం తెలపడం గమనార్హం.
అధికార పక్షం తీవ్ర అభ్యంతరం..
ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్, భాజపాపై విమర్శలు గుప్పించిన రాహుల్ గాంధీ.. సభలో కొన్ని మతపరమైన ఫొటోలను చూపించారు. దీనిపై అధికార పక్షం నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. సభలో ఇలాంటి మతపరమైన ఫొటోల ప్రదర్శనకు నిబంధనలు అంగీకరించవని స్పీకర్ ఓం బిర్లా వారించారు. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలగజేసుకుని రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. హిందువులను హింసావాదులుగా రాహుల్ పేర్కొనడం ఆమోదనీయం కాదని దుయ్యబట్టారు. అటు కేంద్ర మంత్రి అమిత్ షా సైతం విపక్ష నేత క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఎమర్జెన్సీ, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు కారకులైన వారికి.. అహింస గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. అయితే.. తాను భాజపాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశానని.. ఆ పార్టీ, ఆర్ఎస్ఎస్లే మొత్తం హిందూ సమాజం కాదని రాహుల్ తెలిపారు. అన్ని మతాలు ధైర్యం, నిర్భయత, అహింస సందేశాలను చాటి చెబుతున్నాయన్నారు.
‘నీట్’ను కమర్షియల్గా మార్చేశారు
‘‘రాష్ట్రపతి ప్రసంగంలో నీట్, అగ్నివీర్ల ప్రస్తావన లేదు. ప్రొఫెషనల్ పరీక్ష అయిన ‘నీట్’ను కమర్షియల్గా మార్చారు. గతంలో తీసుకొచ్చిన రైతు చట్టాల వల్ల 700 మంది అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారు. వారికి సంతాపంగా సభలో మౌనం కూడా పాటించలేదు. భాజపా హయాంలో సంస్థలు నిర్వీర్యమయ్యాయి. దేవుడితో ప్రత్యక్షంగా మాట్లాడతానని స్వయంగా ప్రధాని చెప్పారు. భాజపా ప్రభుత్వం.. జమ్మూకశ్మీర్ను రెండు ముక్కలు చేసింది. అల్లర్లతో మణిపుర్ అట్టుడికిపోయినా.. ఇప్పటివరకు ప్రధాని వెళ్లలేదు. అక్కడ నా కళ్లముందే పిల్లలపై బుల్లెట్ల వర్షం కురిసింది. నోట్ల రద్దు వల్ల యువత ఉపాధి కోల్పోయింది. జీఎస్టీ వల్ల వ్యాపారులు, ప్రజలు అనేక బాధలు పడ్డారు. వీటి వల్ల దేశప్రజలకు కలిగిన లాభం ఏంటి?’’ అని ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్గి రాజేసిన ‘వీధి న్యాయం’... మమతపై గవర్నర్ ఘాటు వ్యాఖ్యలు
ఇటీవల పశ్చిమబెంగాల్లోని చోప్రాలో ఓ వ్యక్తితోపాటు మహిళను నడిరోడ్డుపై చావబాదిన ఘటన రాష్ట్రంలో అగ్గి రాజేస్తోంది. గవర్నర్ ఆనంద్బోస్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
గూగుల్ మ్యాప్స్ను నమ్మి.. దట్టమైన అడవిలో 11 గంటలు చిక్కుకొని..
గూగుల్ మ్యాప్స్ను అనుసరిస్తూ ఆలయానికి వెళ్లిన ఐదుగురు విద్యార్థులు దట్టమైన అడవిలో చిక్కుకున్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లో 11 గంటల పాటు అక్కడే గడిపారు. -
పేపర్ లీక్లను తీవ్రంగా పరిగణిస్తున్నాం - ప్రధాని మోదీ
నీట్ ప్రశ్నాపత్రం లీక్ నిందితులను కఠినంగా శిక్షిస్తామమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. -
ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట.. 87కి చేరిన మృతుల సంఖ్య
ఉత్తర్ప్రదేశ్లో ఓ కార్యక్రమంలో తొక్కిసలాట జరగడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. -
ఖర్గే స్థానంలో ‘ఆయన’ ఉంటే బాగుంటుంది.. రాజ్యసభ ఛైర్మన్
రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీరుపై ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ మండిపడ్డారు. జగదీప్వ్యాఖ్యలకు బదులిస్తూ ఖర్గే చేసిన వ్యాఖ్యలతో సభ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. -
టీషర్ట్, చిరిగిన జీన్స్ ధరించి కాలేజీకి రావొద్దు!
ఇటీవల తమ కాలేజీల్లో హిజాబ్పై నిషేధం విధించిన ముంబయిలోని ఓ విద్యాసంస్థ.. తాజాగా చిరిగిన జీన్ ప్యాంట్, టీషర్ట్లపైనా ఆంక్షలు విధించింది. -
మీకు వచ్చింది 99/100 కాదు.. 99/543: కాంగ్రెస్పై మోదీ సెటైర్లు
PM Modi: ఎన్ని అబద్ధాలు చెప్పినా విపక్షాలకు మళ్లీ ఘోర ఓటమి తప్పలేదని ప్రధాని మోదీ విమర్శించారు. వారి బాధను తాను అర్థం చేసుకోగలనని అన్నారు. 99 సీట్లకే కాంగ్రెస్ మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకుంటోందన్నారు. -
‘నీపై దయచూపడమా..?’: కుమార్తె గర్భానికి కారణమైన తండ్రికి 101 ఏళ్ల జైలు
కొన్నేళ్లపాటు కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడిన ఓ వ్యక్తికి కేరళ (Kerala)లోని కోర్టు విధించిన శిక్ష సంచలనం సృష్టించింది. -
ముంబయి అల్లర్ల నిందితుడు.. 31 ఏళ్ల తర్వాత చిక్కాడు!
మూడు దశాబ్దాల క్రితం నాటి ముంబయి అలర్ల కేసులో పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. -
నీట్పై 26 పిటిషన్లు.. జులై 8 నుంచి సుప్రీం కోర్టు విచారణ
నీట్ వివాదంపై దాఖలైన అనేక పిటిషన్లను భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం జులై 8న విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది. -
పరీక్షకు 2 గంటల ముందే ప్రశ్నపత్రం రెడీ.. ‘నీట్ పీజీ’ నిర్వహణకు కీలక నిర్ణయం..!
NEET PG Exam: నీట్ పీజీ 2024 పరీక్షను ఈ నెలాఖరు లేదా ఆగస్టులో నిర్వహించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ వారంలోనే షెడ్యూల్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. -
విజయ్ మాల్యాపై నాన్- బెయిలబుల్ వారెంట్.. జారీ చేసిన ముంబయి కోర్టు
Vijay Mallya: బ్యాంకుల నుంచి తీసుకొన్న రూ.వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయిన విజయ్ మాల్యాపై ముంబయి ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. -
మాకు 80 సీట్లు వచ్చినా ఈవీఎంలను విశ్వసించం: అఖిలేశ్ యాదవ్
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా విపక్ష నేతలు కేంద్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ పలు అంశాలపై మాట్లాడారు. -
‘రాహుల్ గాంధీలా ప్రవర్తించకండి’.. ఎన్డీయే ఎంపీలకు మోదీ సూచన
PM Modi: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ స్పీకర్ను అవమానిస్తూ అమర్యాదగా ప్రవర్తించారని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. ఆయనలా ఎన్డీయే సభ్యులెవరూ చేయొద్దని సూచించారు. -
జిగాన గన్స్.. రూ.25 లక్షల కాంట్రాక్ట్..: కారులోనే సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర
సల్మాన్ ఖాన్ను కూడా సింగర్ సిద్ధూ మూసేవాలా తరహాలోనే హత్య చేసేందుకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కుట్ర పన్నింది. జిగాన తుపాకులు, 70 మందితో కూడిన నెట్వర్క్, పాక్ ఆయుధ డీలర్లు, స్థానిక కిరాయి గ్యాంగ్లతో ఓ నెట్వర్క్ ఈ బాలీవుడ్ హీరోపై దాడి కుట్రలో భాగమైనట్లు తేలింది. -
రాహుల్ ప్రసంగంపై దుమారం.. కొన్ని వ్యాఖ్యలు తొలగింపు
Rahul Gandhi: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంలోని కొన్ని అంశాలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించారు. -
రోజూ దేవుణ్ని ప్రార్థిస్తున్నాడని మరణశిక్ష జీవితఖైదుగా మార్పు.. హైకోర్టు సంచలన తీర్పు
ఒడిశా హైకోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. ఆరేళ్ల బాలికపై హత్యాచారం కేసులో దోషిగా తేలిన ఎస్కే ఆసిఫ్ అలీకి ఒడిశాలోని జగత్సింగ్పుర్లో ఉన్న పోక్సో కోర్టు విధించిన మరణశిక్షను హైకోర్టు జీవిత ఖైదుగా మార్చింది. -
ఎంపీగా ఇంజినీర్ రషీద్ ప్రమాణానికి ఎన్ఐఏ అనుమతి
ఉగ్రనిధుల కేసు నిందితుడు ఇంజినీర్ రషీద్ ఎంపీగా ప్రమాణం చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అనుమతి ఇచ్చింది. -
స్వచ్ఛంద సంస్థల రెన్యువల్ చెల్లుబాటు గడువు పెంపు
విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్యే) కింద నమోదైన అన్ని స్వచ్ఛంద సంస్థల (ఎన్జీవోల) చెల్లుబాటు గడువును మరోసారి పెంచుతున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. -
భారతీయులకు మాతృభూమిపై ప్రేమ, భక్తి ఎన్నటికీ తరగవు
బయటి ప్రపంచానికి భారత్పై ఎలాంటి అభిప్రాయం ఉన్నా, దేశంలో ప్రతి ఒక్కరికీ మాతృభూమిపై తరగని ప్రేమ, భక్తి ఉంటాయని, ఎన్ని వైరుధ్యాలున్నా భారత్ ఒకే దేశంగా నిలిచిందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. -
మేధా పాట్కర్కు 5 నెలల జైలు శిక్ష
ఇరవై మూడేళ్ల క్రితంనాటి పరువు నష్టం దావాలో ఉద్యమకారిణి మేధా పాట్కర్కు దిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రాఘవ్ శర్మ సోమవారం అయిదు నెలల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అగ్గి రాజేసిన ‘వీధి న్యాయం’... మమతపై గవర్నర్ ఘాటు వ్యాఖ్యలు
-
టాటూ రూమర్స్పై దిశా పటానీ అలా.. వెంకటేశ్ సినిమాలో ఐశ్వర్య ఇలా!
-
దిల్లీకి సీఎం చంద్రబాబు.. బడ్జెట్ ప్రతిపాదనలపై ప్రధానితో చర్చించే అవకాశం
-
గూగుల్ మ్యాప్స్ను నమ్మి.. దట్టమైన అడవిలో 11 గంటలు చిక్కుకొని..
-
పేపర్ లీక్లను తీవ్రంగా పరిగణిస్తున్నాం - ప్రధాని మోదీ
-
ఆస్పత్రిలో భారత మాజీ హెడ్ కోచ్.. ఆర్థిక సాయం కోసం ఎదురుచూపు