- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
CBI: ‘యూజీసీ-నెట్’ అవకతవకలపై దర్యాప్తు.. సీబీఐ బృందంపై స్థానికుల దాడి!
‘యూజీసీ-నెట్’ పరీక్షలో అవకతవకలపై దర్యాప్తులో భాగంగా బిహార్లోని నవాదాకు వెళ్లిన సీబీఐ బృందంపై స్థానికులు దాడికి పాల్పడ్డారు.
పట్నా: ‘యూజీసీ-నెట్ (UGC-NET)’ పరీక్షలో అవకతవకలపై దర్యాప్తులో భాగంగా బిహార్లోని నవాదాకు వెళ్లిన సీబీఐ (CBI) బృందంపై స్థానికులు దాడికి పాల్పడటం కలకలం రేపింది. దర్యాప్తు సంస్థ ఫిర్యాదు మేరకు ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు ఆదివారం వెల్లడించారు.
యూజీసీ- నెట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యామంత్రిత్వశాఖ సూచన మేరకు సీబీఐ గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా అధికారుల బృందం నవాదాలోని కసియాడీహ్ గ్రామానికి వెళ్లింది. ఈ క్రమంలోనే పెద్దఎత్తున స్థానికులు సీబీఐ వాహనాలను చుట్టుముట్టారు. అధికారులపై దౌర్జన్యానికి దిగారు. దీంతో అధికారులు వెంటనే స్థానిక పోలీస్లకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు.. వారిని చెదరగొట్టారు. ప్రభుత్వ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం, దాడి చేయడం వంటి ఆరోపణలపై కేసు నమోదు చేసి, నలుగురిని అరెస్టు చేశారు.
ముగిసిన నీట్ రీ-ఎగ్జామ్.. దాదాపు సగం మంది గైర్హాజరు
దేశంలోని యూనివర్సిటీల్లో లెక్చరర్షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, పీహెచ్డీలలో ప్రవేశాలకు కోసం ఈ నెల జూన్ 18న యూజీసీ నెట్ పరీక్ష నిర్వహించారు. అయితే.. ఇందులో అవకతవకలు జరిగినట్టు యూజీసీ నిర్ధారణ మేరకు దాన్ని రద్దు చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అస్సాంలో వరద బీభత్సం
అస్సాంలో వరదల పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వరదనీరు ముంచెత్తుతోంది. దీంతో గురువారం ఒక్కరోజే ఆరుగురు మృతి చెందారు. -
కర్ణాటక-ఏపీ సరిహద్దుల సర్వే
కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఏడు బీ-1 కేటగిరీ గనులను సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర ఉన్నతాధికారుల సమితి(సీఈసీ) గురువారం పరిశీలించింది. -
17 రోజుల్లో కూలిన 12 వంతెనలు.. తప్పెవరిది?
గత 17 రోజుల్లో బిహార్లో 12 వంతెనలు కూలిపోవడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. దీనికి ఇంజినీర్లు, గుత్తేదారులే కారణమని ప్రభుత్వం ప్రాథమికంగా తేల్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రజా వేదిక శిథిలాలు అక్కడే
-
భారాసకు భారీ షాక్.. కాంగ్రెస్లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/07/24)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
రకుల్ప్రీత్ రెడ్ హాట్ లుక్.. మడోన్నా అలలతో ఆట.. మేకప్తో మాళవిక!
-
పాకిస్థాన్లో లీటరు పాల ధర రూ.370.. ఆ దేశాల కంటే అధికం!