- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
NEET Row: ‘నీట్’ వ్యవహారంలో కీలక పరిణామం.. సీబీఐ రంగ ప్రవేశం
NEET Row | వైద్య విద్యాకోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ (యూజీ) పరీక్షలో అవకతవకలపై విచారించేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. ఈ మేరకు ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
దిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) ప్రశ్నపత్రం లీకేజీ అంశంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు మే 5న నిర్వహించిన ఈ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో దీనిపై దర్యాప్తు చేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు సీబీఐ (CBI) ఆదివారం కేసు నమోదు చేసింది. నీట్ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు వస్తోన్న ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారించనుంది. అలాగే, బిహార్లో పేపర్ లీక్, పలుచోట్ల విద్యార్థులు సమయం కోల్పోయారంటూ వారికి గ్రేస్ మార్కులు కలపడం వంటి అంశాలపైనా సమగ్రంగా విచారించనుంది.
నీట్ పరీక్షల్లో ‘మున్నాభాయ్’లు.. వెలుగులోకి కళ్లుబైర్లుకమ్మే వాస్తవాలు..!
కేంద్ర విద్యాశాఖ సూచనల మేరకు నమోదు చేసిన ఈ కేసులో నిందితులుగా గుర్తు తెలియని వ్యక్తులను చేర్చినట్లు సీబీఐ తెలిపింది. దేశవ్యాప్తంగా దాదాపు 24లక్షల మంది విద్యార్థులు రాసిన ఈ పరీక్షలో అక్రమాలు, మోసాలు జరిగాయని పలుచోట్ల కేసులు నమోదైనట్లు కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దీనిపై ఉన్నత స్థాయి సమీక్ష అనంతరం పరీక్షల ప్రక్రియలో పారదర్శకత కోసం ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సదరు అధికారి వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘90% కాపీ పేస్ట్.. ఎంపీలను సస్పెండ్ చేసి తీసుకొచ్చారు’: కొత్త న్యాయ చట్టాలపై ప్రతిపక్షాలు
New Criminal Laws: తాజాగా అమల్లోకి వచ్చిన కొత్త నేర న్యాయ చట్టాలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. వాటిని బలవంతంగా అమల్లోకి తీసుకొస్తున్నారని ఆరోపించాయి. -
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. టీ20 వరల్డ్ కప్ విజయంపై టీమ్ఇండియాకు అభినందనలు
నేడు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా సభ్యులంతా భారత క్రికెట్ జట్టుకు అభినందనలు తెలియజేశారు. -
పశ్చిమ బెంగాల్ మహిళలకు సురక్షితం కాదు: జేపీ నడ్డా
పశ్చిమ బెంగాల్లో ఓ జంటను నడిరోడ్డుపై దారుణంగా కొడుతున్న వీడియో వైరల్గా మారింది. దీనిపై భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. -
నీట్ రీ-టెస్ట్ ఫలితాలు విడుదల.. మారిన ర్యాంకుల జాబితా
NEET-UG 2024: నీట్ రీటెస్ట్ ఫలితాలను ఎన్టీఏ సోమవారం విడుదల చేసింది. దీంతోపాటు నీట్ యూజీ 2024 అభ్యర్థులందరి ర్యాంకులు సవరించినట్లు వెల్లడించింది. -
అమల్లోకి భారతీయ న్యాయ సంహిత.. తొలి కేసు నమోదు
భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)(Bharatiya Nyay Sanhita) కింద తొలి కేసు నమోదు అయింది. దిల్లీలో ఓ వీధి వ్యాపారిపై పోలీసులు ఈ కేసు పెట్టారు. -
ఈ అయిదు ప్రశ్నలు వేసుకోకుండా ‘షేర్’ చేయొద్దు: ఐక్యరాజ్య సమితి
Social Media: ఏటా జూన్ 30న సామాజిక మాధ్యమాల దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. సోషల్ మీడియా ప్రభావం, వాటి సద్వినియోగంపై అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం. -
న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయం
భారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది. మన దేశంలో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి(ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ), భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయి. -
అమ్మ పేరిట మొక్క
‘అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి (ఏక్ పేడ్ మా కే నామ్)’ అని దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తద్వారా వన మహోత్సవానికి ఊతమివ్వాలని కోరారు. -
ప్రభుత్వ పాఠశాలలో ఏసీ తరగతి గదులు
విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు పశ్చిమబెంగాల్లో ఉపాధ్యాయులు ఏసీ తరగతి గదులను అందుబాటులోకి తీసుకొచ్చారు. -
‘వివాహేతర సంబంధం’పై ఆగ్రహం.. బెంగాల్లో ఓ జంటకు బహిరంగ శిక్ష
వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్న కారణంగా పశ్చిమబెంగాల్లో ఓ జంటను నడిరోడ్డుపై దారుణంగా చావగొట్టిన వీడియో వైరల్గా మారడంతో ఈ ఘటనపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. -
భారత ఆర్మీకి 30వ చీఫ్గా ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు
భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఆదివారం పదవీ విరమణ చేయగా.. ఆయన స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆ బాధ్యతలు చేపట్టారు. -
పార్లమెంటులో దుమారం రేపనున్న నీట్
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ, నిరుద్యోగం, అగ్నిపథ్, ద్రవ్యోల్బణం వంటి అంశాలు సోమవారం పార్లమెంటులో దుమారం రేకెత్తించే అవకాశాలున్నాయి. -
కేదార్నాథ్ సమీపంలో విరిగిపడ్డ మంచుచరియ
ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయానికి నాలుగు కిలోమీటర్ల పైనున్న గాంధీ సరోవరం వద్ద ఆదివారం ఉదయం భారీ మంచుచరియ విరిగిపడింది. -
ఒవైసీకి వ్యతిరేకంగా వీహెచ్పీ ప్రదర్శన
లోక్సభ సభ్యుడిగా ప్రమాణస్వీకార సమయంలో ‘జై పాలస్తీన్’ అని నినదించిన ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రదర్శన నిర్వహించింది. -
6,619 మందితో అమర్నాథ్ యాత్రకు బయలుదేరిన మూడో బ్యాచ్
జమ్మూలోని భగవతీ నగర్లోని బేస్ క్యాంపు నుంచి 6,619 మందితో కూడిన మూడో బ్యాచ్ కశ్మీర్లోని బేస్ క్యాంపులకు ఆదివారం తెల్లవారుజామున బయలుదేరింది. -
సంక్షిప్త వార్తలు (6)
చిన్నప్పుడు అందరిలాగే నేనూ కథలు వినడానికి తెగ ఆసక్తి చూపేదాన్ని. కానీ పుస్తకాలు చదవడం అసలు ఇష్టముండేది కాదు. -
కుటుంబ పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక ప్రచారం
కుటుంబ పింఛనుదారుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ సోమవారం ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. -
జలపాతంలో మునిగి మహిళ, ఇద్దరు చిన్నారుల దుర్మరణం
మహారాష్ట్రలోని పుణె జిల్లా లోనావాలా ప్రాంతంలోని భూసీ డ్యామ్ బ్యాక్వాటర్ సమీపంలోని జలపాతంలో మునిగి ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు మరణించారు. -
ఆసుపత్రిలో చేరిన శత్రుఘ్నసిన్హా
బాలీవుడ్ సీనియర్ నటుడు, టీఎంసీ పార్లమెంటు సభ్యుడు శత్రుఘ్నసిన్హా (77) తీవ్రజ్వరంతో ముంబయిలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరినట్లు ఆయన కుమారుడు లవ్ సిన్హా ఆదివారం వెల్లడించారు. -
వాట్సప్లో ఏఐ స్నేహితుడు
ఇక నుంచి ఏదైనా తెలుసుకోవాలనిపిస్తే ఏ సెర్చ్ ఇంజిన్నూ ఆశ్రయించాల్సిన పనిలేదు. వాట్సప్లో చాట్ చేస్తూనే వివిధ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని చిటికెలో తెలుసుకోవచ్చు. -
కేదార్నాథ్లో మంచు ఉప్పెన.. వీడియో వైరల్
‘కేదార్నాథ్ ధామ్’ సమీపంలో మంచు ఉప్పెన విరుచుకుపడింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి.
తాజా వార్తలు (Latest News)
-
గవర్నర్ సీపీ రాధాకృష్ణన్తో సీఎం రేవంత్రెడ్డి భేటీ
-
ఎన్టీఆర్ భవన్పై దాడి ఘటన.. విచారణ చేపట్టిన పోలీసులు
-
రివ్యూ: ‘గురువాయూర్ అంబలనాదయిల్’.. మలయాళ బ్లాక్ బస్టర్ ఎలా ఉంది?
-
యుద్ధం చేస్తామంటే విడుదల చేస్తాం.. ఖైదీలకు ఆఫర్
-
ప్రొద్దుటూరులో పింఛను డబ్బు మాయం.. ఘటనపై పోలీసుల అనుమానం!
-
విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకొన్న మహిళా టీచర్..!