- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
NEET Row: నాలుగు దశల్లో దర్యాప్తు
నీట్(యూజీ-2024) పరీక్షలో చోటు చేసుకున్న అవకతవకలను నిర్ధారించేందుకు సీబీఐ సిద్ధమైంది. ఇందుకోసం మొత్తం నాలుగు దశల్లో దర్యాప్తు జరపనుంది. ప్రశ్నపత్రం తయారీ నుంచి వాటి ముద్రణ, దేశవ్యాప్తంగా వివిధ పరీక్ష కేంద్రాలకు వాటిని ఎలా పంపించారు..
బిహార్, గుజరాత్, రాజస్థాన్లలో సాక్ష్యాల సేకరణ
నీట్(యూజీ) కేసుపై సీబీఐ దూకుడు
దిల్లీ: నీట్(యూజీ-2024) పరీక్షలో చోటు చేసుకున్న అవకతవకలను నిర్ధారించేందుకు సీబీఐ సిద్ధమైంది. ఇందుకోసం మొత్తం నాలుగు దశల్లో దర్యాప్తు జరపనుంది. ప్రశ్నపత్రం తయారీ నుంచి వాటి ముద్రణ, దేశవ్యాప్తంగా వివిధ పరీక్ష కేంద్రాలకు వాటిని ఎలా పంపించారు.. అనే అంశంతోపాటు పరీక్షల నిర్వహణ అంశంలో జాతీయ పరీక్ష సంస్థ (ఎన్టీఏ) నిబంధనలను కచ్చితంగా పాటించిందా.. గోప్యతకు భంగం వాటిల్లే విధంగా ఎక్కడైనా ఉల్లంఘనలకు పాల్పడిందా.. నీట్-యూజీ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించినందున సాంకేతికంగా ఏమైనా చొరబాటు జరిగిందా.. అనే దిశల్లో విచారించనుంది.
నీట్ పరీక్ష పత్రం రూపకల్పన నుంచి ప్రింటింగ్, రవాణా, పరీక్షలకు ముందు వాటికి భద్రత కల్పించిన వారందరినీ అవసరం మేరకు విడివిడిగా సీబీఐ విచారించే అవకాశముంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు కేసుల్లో మొత్తం 1000 మంది పేర్లు, వారి మొబైల్ నంబర్లను సీబీఐ జల్లెడ పడుతోంది. పరీక్ష పత్రాల లీకేజీతో వారికి ఏమైనా సంబంధం ఉందేమో గమనిస్తోంది. దర్యాప్తులో భాగంగా బిహార్, గుజరాత్, రాజస్థాన్లలోని 5 కేసులను సీబీఐ స్వాధీనం చేసుకుంది. బిహార్, గుజరాత్లలో ఒక్కో కేసును, రాజస్థాన్లో మూడు కేసులను సీబీఐ మళ్లీ నమోదు (రీరిజిస్టర్) చేసింది. మహారాష్ట్రలోని కేసునూ తీసుకోనుంది.
దేశవ్యాప్తంగా నీట్ యూజీ-24ను ఆన్లైన్ విధానంలో నిర్వహించారు. మొత్తం 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మరోవైపు నెట్ పరీక్షను దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో పెన్ను, పేపర్ విధానంలో నిర్వహించగా 9లక్షల మందికి పైగా విద్యార్థులు రాశారు.
బిహార్లో..
పట్నా: నీట్(యూజీ)లో అక్రమాలపై దర్యాప్తు జరుపుతున్న సీబీఐ బృందం సోమవారం బిహార్ రాజధాని పట్నాలోని ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగాన్ని (ఈవోయూ) సందర్శించి సాక్ష్యాలను సేకరించింది. ఇప్పటిదాకా ఈవోయూ చేసిన దర్యాప్తు తీరుతెన్నులను పరిశీలించింది. ఈ కేసులో అరెస్టయిన 18 మంది వివరాలను సేకరించింది. నిందితులంతా ప్రస్తుతం పట్నా జైలులో ఉన్నారు. వారిని దిల్లీకి సీబీఐ తీసుకెళ్లి మరింత లోతుగా ప్రశ్నించే అవకాశముంది. మరోవైపు సాక్ష్యాల విధ్వంసం, ఆదాయానికి మించిన ఆస్తులకు (డీఏ) సంబంధించి పలు కేసులను సీబీఐ నమోదు చేయనుంది. దానాపుర్ మున్సిపాలిటీలో జూనియర్ ఇంజినీరుగా పని చేస్తున్న సికందర్ ప్రసాద్ యాదవేందుపై డీఏ కేసును సీబీఐ పెట్టనుంది.
మహారాష్ట్రలో నలుగురిపై కేసు
లాతుర్: నీట్(యూజీ) అక్రమాలకు సంబంధించి మహారాష్ట్రలోని లాతుర్కు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులతోపాటు నలుగురిపై ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. నిందితుల్లో సంజయ్ తుకారాం జాదవ్, జలీల్ ఖాన్ ఉమర్ ఖాన్ పఠాన్ ఉన్నారు. నాందేడ్కు చెందిన మష్నాజీ కొంగల్వావ్, దిల్లీకి చెందిన గంగాధర్పైనా కేసు నమోదైంది. వీరిలో పఠాన్ను ఆదివారం రాత్రి ఏటీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు.
దిల్లీలో విద్యార్థుల ఆందోళన
దిల్లీ: నీట్(యూజీ)లో అక్రమాలను నిరసిస్తూ సోమవారం పార్లమెంటుకు మార్చ్ నిర్వహించేందుకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కొంత మంది ఎన్ఎస్యూఐ నాయకులున్నారు. నీట్(యూజీ)ను రద్దు చేయాలని కోరుతూ జంతర్మంతర్ నుంచి వారు ఈ ర్యాలీకి సిద్ధమయ్యారు. ప్లకార్డులతోపాటు జెండాలను విద్యార్థులు ప్రదర్శించారు. విద్యార్థుల ఆందోళన సందర్భంగా దిల్లీ పోలీసులతోపాటు పారా మిలిటరీ బలగాలను మోహరించారు. విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాహుల్ VS రాజ్నాథ్.. అగ్నిపథ్పై మాటల తూటాలు
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా అగ్నిపథ్ పథకంపై లోక్సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మధ్య మాటల తూటాలు పేలాయి. -
రైళ్ల టైమ్ టేబుల్ యథాతథం.. డిసెంబర్ 31వరకు పాతదే వర్తింపు
రైళ్ల రాకపోకలకు సంబంధించిన టైమ్టేబుల్ వివరాల్లో ఎటువంటి మార్పు లేదని.. డిసెంబర్ 31, 2024 వరకు ప్రస్తుతమున్న కాలపట్టికే కొనసాగుతుందని భారతీయ రైల్వే వెల్లడించింది. -
కర్ణాటకలో నాయకత్వ మార్పు..? సీఎం ఏమన్నారంటే!
సీఎం పదవి నుంచి వైదొలగి డీకే శివకుమార్కు మార్గం సుగమం చేయాలని వక్కలిగ వర్గానికి చెందిన ఓ పీఠాధిపతి సిద్ధరామయ్యకు ఇటీవల విజ్ఞప్తి చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
కుండపోత వర్షాలు.. ఏడు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్
రానున్న ఐదు రోజుల్లో పలు రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. మొత్తం 7 రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. -
పరువు నష్టం కేసులో ఎదురు దెబ్బ.. ఎంపీకి 50లక్షల జరిమానా
పరువు నష్టం కేసులో తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సాకేత్ గోఖలేకు ఎదురు దెబ్బ తగిలింది. -
‘నన్ను బహిష్కరిస్తే.. 63 మంది ఎంపీలు ఇంటికెళ్లారు’: భాజపాపై మహువా మొయిత్రా ఫైర్
Mahua Moitra: లోక్సభలో తనపై బహిష్కరణ వేటు వేసిన భాజపాకు ప్రజలు గట్టి సమాధానం చెప్పారని టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రా అన్నారు. 63 మంది ఎంపీలను ఇంటికి పంపించారన్నారు. -
రాహుల్ దాడి భాజపాపై మాత్రమే: ప్రియాంక గాంధీ
రాహుల్ గాంధీ హిందువులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని భాజపా చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కొట్టిపడేశారు. -
అమల్లోకి కొత్త నేర న్యాయ చట్టాలు.. నిపుణులు ఏమంటున్నారు!
కొత్తగా అమల్లోకి వచ్చిన నేర న్యాయ చట్టాలు న్యాయ వ్యవస్థలో మార్పునకు కీలక ముందడుగుగా కొందరు అభివర్ణించగా.. మరికొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. -
‘మోదీజీ నవ్వరెందుకో’.. రాహుల్ ప్రశ్నకు ప్రధాని ఏం చెప్పారంటే?
Rahul Gandhi: లోక్సభలో ప్రసంగించిన రాహుల్ గాంధీ కేంద్రంపై ఘాటు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా మోదీజీ ఎప్పుడూ సీరియస్గా ఎందుకు ఉంటారని అడగ్గా.. ప్రధాని దీనికి గట్టి కౌంటర్ ఇచ్చారు. అసలేం జరిగిందంటే.. -
పరువునష్టం కేసు.. మేధా పాట్కర్కు అయిదు నెలల జైలుశిక్ష
ఓ పరువునష్టం కేసులో ‘నర్మదా బచావో ఆందోళన్’ ఉద్యమకారిణి మేధా పాట్కర్కు దిల్లీ కోర్టు అయిదు నెలల జైలుశిక్ష విధించింది. -
మైక్ కట్ చేస్తున్నాననడం సరికాదు.. ఇది గౌరవానికి సంబంధించిన అంశం: ఓం బిర్లా
ప్రతిపక్ష నేతల మైక్లను సభాపతి కట్ చేస్తున్నారంటూ ఆరోపణలు చేయడం సరికాదని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla) పేర్కొన్నారు. -
ఇది రాహుల్కి కఠిన పరీక్ష.. అనురాగ్ ఠాకూర్ విమర్శలు
లోక్సభ ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికవ్వడం ఆయనకు కఠిన పరీక్షతో సమానమని భాజపా ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు. -
భద్రతా పరమైన సవాళ్లు స్వీకరించడానికి ఆర్మీ సిద్ధంగా ఉంది: జనరల్ ద్వివేది.
దేశానికి ఎదురయ్యే ఎటువంటి భద్రతా సవాళ్లనైనా ఎదుర్కోవడానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది పేర్కొన్నారు. -
మోదీ అంతరిక్షంలోకి వెళ్లగలరా? - ఇస్రో చీఫ్ ఏమన్నారంటే!
‘గగన్యాన్’ మిషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అక్కడికి వెళ్లవచ్చని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఛైర్మన్ ఎస్. సోమనాథ్ పేర్కొన్నారు. -
లోక్సభలో రాహుల్ ప్రసంగం.. ప్రధాని మోదీ అభ్యంతరం
దేశమంతా ఏకమై రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేసిందని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. -
కొత్త నేర చట్టాలపై విపక్షాలది అనవసర ఆరోపణే: కేంద్ర హోం మంత్రి అమిత్ షా
కొత్త నేర చట్టాల(New criminal laws)పై విపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని, వాటిపై ఆందోళన చెందుతున్న నేతలతో సమావేశమయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అమిత్ షా (Amit Shah) తెలిపారు. -
ధన్ఖడ్, ఖర్గే సంభాషణ.. సభలో నవ్వులే నవ్వులు!
రాజ్యసభలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకొంది. ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మధ్య జరిగిన సరదా సంభాషణతో సభలో నవ్వులు విరబూశాయి. -
జైల్లో ఉన్న ఇంజినీర్ రషీద్ ప్రమాణ స్వీకారానికి ఎన్ఐఏ అనుమతి
లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ జైల్లో ఉండటంతో ఇంజినీర్ రషీద్ (Engineer Rashid ).. ఎంపీగా ప్రమాణం చేయలేకపోయారు. దీనిపై ఎన్ఐఏ స్పందించింది. -
‘90% కాపీ పేస్ట్.. ఎంపీలను సస్పెండ్ చేసి తీసుకొచ్చారు’: కొత్త న్యాయ చట్టాలపై ప్రతిపక్షాలు
New Criminal Laws: తాజాగా అమల్లోకి వచ్చిన కొత్త నేర న్యాయ చట్టాలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. వాటిని బలవంతంగా అమల్లోకి తీసుకొస్తున్నారని ఆరోపించాయి. -
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. టీ20 వరల్డ్ కప్ విజయంపై టీమ్ఇండియాకు అభినందనలు
నేడు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా సభ్యులంతా భారత క్రికెట్ జట్టుకు అభినందనలు తెలియజేశారు. -
పశ్చిమ బెంగాల్ మహిళలకు సురక్షితం కాదు: జేపీ నడ్డా
పశ్చిమ బెంగాల్లో ఓ జంటను నడిరోడ్డుపై దారుణంగా కొడుతున్న వీడియో వైరల్గా మారింది. దీనిపై భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ దేశంలో తెల్లని వెడ్డింగ్ వేసుకున్నా..వైన్ గ్లాసుల్లో మద్యం తాగినా..!
-
ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల.. సిలబస్ ఇదే..
-
పింఛన్ల పంపిణీలో రికార్డు.. ఏపీలో ఒక్క రోజే 95% పూర్తి
-
రాహుల్ VS రాజ్నాథ్.. అగ్నిపథ్పై మాటల తూటాలు
-
‘కల్కి 2898 ఏడీ’ సాధించిన టాప్-10 బాక్సాఫీస్ రికార్డులివే!
-
జియో, ఎయిర్టెల్ కొత్త టారిఫ్లు.. వార్షిక రీఛార్జికి ‘ప్లాన్’ చేస్తున్నారా?