Vijay Mallya: విజయ్‌ మాల్యాపై నాన్‌- బెయిలబుల్‌ వారెంట్‌.. జారీ చేసిన ముంబయి కోర్టు

Vijay Mallya: బ్యాంకుల నుంచి తీసుకొన్న రూ.వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయిన విజయ్‌ మాల్యాపై ముంబయి ప్రత్యేక కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్ జారీ చేసింది.

Published : 02 Jul 2024 15:50 IST

Vijay Mallya | ముంబయి: పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా (Vijay Mallya)పై నాన్‌- బెయిలబుల్‌ వారెంట్‌ (NBW) జారీ అయింది. ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (IOB)కు చెందిన రూ.180 కోట్ల రుణం ఎగవేసిన కేసులో ముంబయిలోని ప్రత్యేక కోర్టు ఈ వారెంట్‌ జారీ చేసింది. జూన్‌ 29న ప్రత్యేక సీబీఐ (CBI)కోర్టు న్యాయమూర్తి నాయక్‌ నింబాల్కర్‌ ఈ వారెంట్‌ను జారీ చేశారు. పూర్తి ఉత్తర్వులు జులై 1న వెలుగులోకి వచ్చాయి.  

కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ మాజీ ప్రమోటర్‌ అయిన మాల్యాపై 2007 నుంచి 2012 మధ్య కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం ఐఓబీ బ్యాంక్‌ నుంచి పొందిన రుణాలను మాల్యా ఎగవేతకు పాల్పడ్డారంటూ సీబీఐ కేసు నమోదు చేసింది. ఉద్దేశపూర్వకంగా చెల్లింపుల ఎగవేతకు పాల్పడ్డారని పేర్కొంది. దీంతో ప్రభుత్వ బ్యాంకుకు రూ.180 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని తెలిపింది. ఛార్జ్‌షీట్‌లోని వివరాలను పరిగణనలోకి తీసుకున్న సీబీఐ ప్రత్యేక కోర్టు.. విజయ్‌ మాల్యాను రప్పించేందుకు ఓపెన్‌ ఎండెండ్‌ నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేయడానికి ఇదే సరైన కేసుగా కోర్టు అభిప్రాయపడింది. భారత్‌లోని చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకొనేందుకు మాల్యా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని పేర్కొంటూ నాన్‌- బెయిలబుల్‌ వారెంట్‌ను జారీ చేసింది. 

ఈ నెలలోనే అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌.. తేదీలు ఇవే!

2016లోనే భారత్‌ నుంచి విదేశాలకు పారిపోయిన మాల్యా.. ప్రస్తుతం లండన్‌లో నివాసం ఉంటున్నారు. పరారీలో ఉన్న ఆయన్ను తమకు అప్పగించాలని భారత్‌ చాలాకాలంగా కోరుతున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు