Bridge Collapse: బిహార్‌లో కుంగిన వంతెన.. పది రోజుల వ్యవధిలో నాల్గో ఘటన

బిహార్‌లో మరో వంతెన ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలో 10 రోజుల వ్యవధిలో ఇది నాల్గో ఘటన కావడం గమనార్హం.

Published : 27 Jun 2024 18:55 IST

పట్నా: బిహార్‌లో వరుస వంతెన ప్రమాదాలు (Bridge Collapse) ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తాజాగా కిషన్‌గంజ్‌ జిల్లాలో కంకయీ ఉపనదిపై నిర్మించిన ఓ వంతెన కుంగిపోయింది. దీంతో బహదుర్‌గంజ్‌, దిఘాల్‌బ్యాంక్‌ బ్లాక్‌ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో 10 రోజుల వ్యవధిలో ఇది నాల్గో ఘటన కావడం గమనార్హం.

‘‘కంకయీ, మహానంద నదులను కలిపే మడియా ఉపనదిపై 2011లో 70 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో ఈ వంతెనను నిర్మించారు. నేపాల్‌లోని పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో నదిలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. ప్రవాహం ధాటికి వంతెన పిల్లర్లు కుంగిపోయాయి’ అని జిల్లా మెజిస్ట్రేట్‌ తుషార్‌ సింగ్లా తెలిపారు. బ్రిడ్జికి ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేసి, రాకపోకలను నిలిపివేసినట్లు చెప్పారు. రహదారుల శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా బుల్లెట్‌ రైళ్లు.. సాధ్యాసాధ్యాలపై త్వరలో అధ్యయనం..!

అంతకుముందు తూర్పు చంపారన్‌, సివాన్‌, అరారియా జిల్లాల్లో వంతెన సంబంధిత ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పది రోజుల వ్యవధిలోనే రాష్ర్టంలో నాలుగు వంతెనలు కూలిపోవడంతో అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు