- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Salman Khan: జిగాన గన్స్.. రూ.25 లక్షల కాంట్రాక్ట్..: కారులోనే సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర
సల్మాన్ ఖాన్ను కూడా సింగర్ సిద్ధూ మూసేవాలా తరహాలోనే హత్య చేసేందుకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కుట్ర పన్నింది. జిగాన తుపాకులు, 70 మందితో కూడిన నెట్వర్క్, పాక్ ఆయుధ డీలర్లు, స్థానిక కిరాయి గ్యాంగ్లతో ఓ నెట్వర్క్ ఈ బాలీవుడ్ హీరోపై దాడి కుట్రలో భాగమైనట్లు తేలింది.
ఇంటర్నెట్డెస్క్: బాలీవుడ్ స్టార్ సల్మాన్ఖాన్ హత్యకు బిష్ణోయ్ గ్యాంగ్ పన్నిన భారీ కుట్ర దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్లో సల్మాన్ఖాన్ ఇంటిపై కాల్పుల కేసు దర్యాప్తులో ఒళ్లు జలదరించే వాస్తవాలు బయటపడ్డాయి. నవీ ముంబయి పోలీసులు ఈమేరకు దాఖలు చేసిన 350 పేజీల ఛార్జిషీట్లో కీలక అంశాలు ప్రస్తావించారు. సల్మాన్ హత్యకు ఆ గ్యాంగ్ పక్కా ప్లానింగ్తో వ్యవహరిస్తోంది. అచ్చంగా పంజాబీ సింగర్ సిద్ధూమూసేవాలా హత్య తరహాలోనే కారులో హత్య చేయాలని నిర్ణయించినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం మైనర్లను షార్పు షూటర్లుగా వాడేందుకు ఈ గ్యాంగ్ ఏర్పాట్లు చేసింది. సినిమా షూటింగ్లు లేదా పన్వేల్ ఫామ్హౌస్కు సల్మాన్ రాకపోకలు సాగిస్తున్న వేళ ఈ కుట్రను అమలుచేయాలనుకొన్నట్లు తెలిపారు. ఇక హత్యకు రూ.25 లక్షల కాంట్రాక్టు కూడా ఇచ్చింది. 2023 ఆగస్టు నుంచి 2024 ఏప్రిల్ మధ్య రూపొందించింది. తుర్కియే (టర్కీ) నుంచి జిగాన పిస్టోళ్లను తెప్పించేందుకు పథకం సిద్ధం చేసింది.
ఏమిటీ జిగాన తుపాకులు..
గతంలో సింగర్ సిద్ధూ మూసేవాలా, గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ హత్యల్లో ఈ తుపాకులు వాడారు. తుర్కియేకు చెందిన ‘టిసాస్’ కంపెనీ ఈ సెమీ-ఆటోమేటిక్ ఆయుధాన్ని తయారుచేస్తోంది. అక్కడ పాలిమర్ ఫ్రేమ్తో తయారైన తొలి పిస్తోల్ ఇదే. ఈ ఆయుధం ఖరీదు ఒక్కోటీ రూ.ఆరు లక్షలకు పైనే. అక్కడి సైన్యం, స్పెషల్ ఫోర్సెస్, ఇతర సెక్యూరిటీ ఏజెన్సీలు వీటిని వాడుతున్నాయి. దీనిలో బరస్ట్మోడ్తో అత్యంత వేగంగా కాల్పులు జరపవచ్చు. భారత్లో వీటిపై నిషేధం ఉంది.
మరోవైపు పాకిస్థాన్ నుంచి వీటిని దేశంలోకి అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఈ తుర్కియే తుపాకులకు పాకిస్థాన్ నకళ్లు తయారుచేస్తోంది. ఇవి అసలు తుపాకులంత నాణ్యతతో ఉన్నా.. ధరలో మాత్రం చౌకగా లభిస్తుంటాయి. పాకిస్థాన్లో ‘గన్ వ్యాలీ’గా పేరున్న ‘దర్రా ఆదమ్ ఖేల్’ అనే ప్రాంతంలో దాదాపు 2,000 ఆయుధాల షాపులు ఉన్నాయి. జిగాన తుపాకులు అత్యంత కచ్చితత్వంతో పనిచేయడంతోపాటు.. మిగిలిన అధునాతన గన్స్ కంటే తక్కువ ధరలో లభిస్తాయి. వీటితోపాటు ఈ కుట్ర అమలుకు ఏకే-47,ఏకే92ఎస్, ఎం16 రైఫిల్స్ను పాక్ నుంచి సరిహద్దులు దాటించి తెచ్చేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ ఏర్పాట్లు చేసింది.
70 మందితో భారీ నెట్వర్క్..
ఈ మొత్తం కుట్రను అమలుచేయడానికి లారెన్స్ బిష్ణోయ్-సంపత్ నెహ్రా గ్యాంగులకు చెందిన 60-70 మందితో ఓ భారీ నెట్వర్క్ ఏర్పాటుచేశారు. వీరు సల్మాన్ కదలికలపై నిఘా పెట్టారు. ముంబయిలోని అపార్ట్మెంట్, పన్వేలీ ఫామ్హౌస్ వంటిచోట్ల వీరు ఓ కన్నేసి ఉంచారు. వీటితోపాటు థానే, పుణె, రాయ్ఘడ్, గుజరాత్ల్లో రెక్కీలు నిర్వహించారు. ఇక హత్య పథకాన్ని అమలుచేసేందుకు 18ఏళ్ల లోపు మైనర్లను సిద్ధం చేసినట్లు ఛార్జిషీట్లో పేర్కొన్నారు. ఇప్పటికే వారు గోల్డీబ్రార్, అన్మోల్ బిష్ణోయ్ ఆర్డర్ల కోసం ఎదురుచూస్తున్నట్లు గుర్తించారు. హత్య తర్వాత కన్యాకుమారి మీదుగా శ్రీలంకకు పారిపోయేలా ప్రణాళిక కూడా సిద్ధమైంది.
లోతైన దర్యాప్తుతో వెల్లడి..
పోలీసులు ఈ కేసును ఛాలెంజ్గా తీసుకొన్నారు. ఇంటెలిజెన్స్ సమాచారం, నిందితుల మొబైల్ ఫోన్ల సమాచార విశ్లేషణ. వాట్సాప్ గ్రూపులు ఏర్పాటుచేసిన విధానం, టవర్ లొకేషన్స్, ప్రత్యక్ష సాక్షులతో ఆడియో, వీడియో కాల్స్ వంటి వాటి ఆధారంగా దర్యాప్తు బృందం ఓ అవగాహనకు రాగలిగింది. ఛార్జిషీట్లో ధనుంజయ్ తాప్సింగ్, అజేయ్ కశ్యప్, గౌతమ్ వినోద్ భాటియా, వాస్పి మహమ్మద్ ఖాన్ అలియాస్ చైనా, రిజ్వాన్ హసన్ అలియాస్ జావెద్ ఖాన్, దీపక్ హవా సింగ్ పేర్లను ప్రస్తావించింది.
ఇన్స్పెక్టర్కు ఇంటెలిజెన్స్ టిప్తో బహిర్గతం..
పన్వేల్ ఇన్స్పెక్టర్ నితిన్ ఠాక్రేకు ఈ ఏడాది ఏప్రిల్లో ఓ ఇంటెలిజెన్స్ టిప్ వచ్చింది. లారెన్స్ బిష్ణోయ్ తన గ్యాంగ్ సభ్యులకు సల్మాన్ను హత్య చేసేందుకు రూ.25 లక్షలు ఆఫర్ చేసినట్లు దీనిలో తెలిసింది. ఈ గ్యాంగ్ సభ్యలు దాదాపు 15-16 మందితో వాట్సాప్ గ్రూపు ఏర్పాటుచేసుకొన్నారు. హత్యపై వారు కమ్యూనికేట్ చేసుకొంటున్నట్లు గుర్తించారు. ఈ గ్రూపులో అన్మోల్ బిష్ణోయ్, గోల్డీబ్రార్, అజేయ్ కశ్యప్, వినోద్ భాటియా, వాస్పి మహమ్మద్ ఖాన్, రిజ్వాన్ హసన్ ఉన్నట్లు కనుగొన్నారు.
పాకిస్థాన్కు చెందిన సుఖా షూటర్, డోగ్రా అనే ఇద్దరు ఆయుధ సప్లయర్లు ఈ కుట్ర కోసం పనిచేసినట్లు అధికారులు ప్రస్తావించారు. వీరు ఏకే-47, ఎం16 రైఫిల్స్ను గ్యాంగ్కు అందించేందుకు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
అజయ్ కశ్యప్ కుట్రకు కోఆర్డినేటర్..
ఏప్రిల్లో సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు జరపడానికి ముందే పన్వేల్లో నలుగురు మనుషులు వేర్వేరు ప్రాంతాల్లో సిద్ధంగా ఉన్నట్లు నవీ ముంబయి సర్కిల్ డీసీపీ వివేక్ పన్సారే పేర్కొన్నారు. మొత్తం 25 మంది వరకు ప్లానింగ్లో భాగమైనట్లు పేర్కొన్నారు. వీరందరినీ అజయ్ కశ్యప్ సమన్వయం చేసినట్లు వెల్లడించారు. ఈ కుట్ర అమలుకు వాడే ఆయుధాల సమాచారం కూడా ఇతనికి తెలుసన్నారు. ఈ ముఠా ఎస్కేప్ ప్లానింగ్ కూడా సిద్ధం చేసినట్లు డీసీపీ వెల్లడించారు. అరెస్టు చేసిన నిందితుల మొబైల్ ఫోన్లలో సల్మాన్పై ఎలా దాడి చేయాలో సూచనలు చెబుతున్న వీడియోలు కూడా పోలీసులకు లభించాయి. ఏకే-47లతో పాటు.. ఇతర ఆయుధాలు కూడా దాడికి వాడాలని వారికి సూచించారు. పాక్లోని ఆయుధ డీలర్లతో తాను టచ్లో ఉన్నట్లు అజేయ్ ఇంటరాగేషన్లో అంగీకరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వందేభారత్లో వర్షపు నీరు లీకేజీ.. వీడియో వైరల్!
వర్షం కురవడంతో పైకప్పు నుంచి వందేభారత్లోకి నీరు చేరింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఈ ఘటనపై స్పందించిన రైల్వేశాఖ ఏమందంటే..? -
ఝార్ఖండ్ సీఎం చంపాయీ సోరెన్ రాజీనామా
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి చంపాయీ సోరెన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన గవర్నర్ రాధాకృష్ణన్కు అందించారు. -
‘డంక్డ్ రైస్ కేక్’..ఇడ్లీ అనుకున్నానే..!: హర్ష గొయెంకా పోస్ట్ వైరల్
ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా తాజాగా చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘జికా’ వైరస్ కలకలం.. రాష్ట్రాలకు కేంద్రం అడ్వైజరీ
మహారాష్ట్రలో పలుచోట్ల జికా వైరస్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో వైరస్ వ్యాప్తిపై నిఘా పెట్టాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ అడ్వైజరీ జారీ చేసింది. -
అవినీతిపై పోరు.. దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం: మోదీ
మోదీ సర్కార్ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ ప్రతిపక్షాలు ఆరోపించడంపై ప్రధాని తీవ్రంగా స్పందించారు. అవినీతిపరులను వదిలేది లేదన్నారు. -
ఆ రాష్ట్రంలో కుప్పకూలుతున్న వంతెనలు.. 15 రోజుల్లో ఏడు!
భారీ వర్షాల నేపథ్యంలో బిహార్లో గడిచిన 15 రోజుల్లో ఏడు బ్రిడ్జిలు కూలిపోయాయి. -
అదొక భయానక అనుభవం..ఎయిర్లైన్స్పై ప్రయాణికుడి పోస్టు
విస్తారా ఎయిర్లైన్స్ సేవలపై ఓ ప్రయాణికుడు అసహనం వ్యక్తం చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
జులై 5న ఎంపీగా ప్రమాణం చేయనున్న అమృత్పాల్ సింగ్
ఖలిస్థానీ నేత అమృత్పాల్ సింగ్ (Amritpal Singh) జులై 5 లోక్సభ ఎంపీ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు మరో ఎంపీ సరభ్జీత్ సింగ్ ఖల్సా వెల్లడించారు. -
జైలుకెళ్లి.. బాబాగా మారి.. ‘భోలే’ పాదధూళి కథేంటీ?
Hathras Stampede: హాథ్రస్ తొక్కిసలాటకు కారణమైన సత్సంగ్ కార్యక్రమాన్ని నిర్వహించిన భోలే బాబా గతంలో ఓ లైంగిక వేధింపుల కేసులో జైలుకెళ్లినట్లు తెలుస్తోంది. -
హాథ్రస్ తొక్కిసలాటపై జ్యుడీషియల్ విచారణ: సీఎం యోగి ప్రకటన
హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటపై జ్యుడీషియల్ విచారణ జరపనున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. -
రాజ్యసభలో సుధామూర్తి తొలి ప్రసంగం.. కృతజ్ఞతలు చెప్పిన మోదీ
సర్వైకల్ క్యాన్సర్ నివారణ మార్గాలపై అవగాహన కల్పించేలా ఎంపీ సుధామూర్తి (Sudha Murty) రాజ్యసభలో ప్రసంగించారు. దానిపై మోదీ(Modi) స్పందించారు. -
132 సీట్ల బస్సు.. విమానం తరహాలో సౌకర్యాలు.. పైలట్ ప్రాజెక్టుపై నితిన్ గడ్కరీ!
వ్యక్తిగత, ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు కాలుష్య రహిత మార్గాలను అన్వేషిస్తున్నామని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. -
మణిపుర్పై రాజకీయాలు ఆపండి: విపక్షాలపై మోదీ ధ్వజం
PM Modi: మణిపుర్లో హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టాయని ప్రధాని మోదీ అన్నారు. ఆ అంశంపై రాజకీయాలు చేయడం ఇకనైనా ఆపాలని విపక్షాలకు గట్టిగా చెప్పారు. -
మళ్లీ అదే మాట అంటూ అవమానిస్తున్నారు.. మోదీపై ప్రతిపక్షాల ధ్వజం
కాంగ్రెస్ను ‘పరాన్న జీవి’ అంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) స్పందించారు. 2021లో రైతులు నిరసన చేపట్టినప్పుడు అదే మాట అన్నారని, మళ్లీ అదే మాట అంటూ అవమానిస్తున్నారన్నారు. -
‘డిక్టేటర్ ఎవరో ఇప్పుడు చెప్పండి’: మోదీ, రాహుల్ వీడియోలు షేర్ చేసిన భాజపా
కాంగ్రెస్ (Congress), విపక్ష పార్టీలు చేస్తోన్న విమర్శలకు భాజపా (BJP) వీడియోల రూపంలో కౌంటర్ వచ్చింది. వాటిని సామాజిక మాధ్యమాల వేదికగా షేర్ చేసింది. -
రాజ్యసభలో మోదీ ప్రసంగం.. విపక్షాలు వాకౌట్
PM Modi: రాజ్యసభలో మోదీ ప్రసంగిస్తుండగా.. ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. దీంతో ఛైర్మన్ ధన్ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నీట్ వివాదం.. నటుడు విజయ్ కీలక వ్యాఖ్యలు
నీట్ పరీక్షల అవకతవకలపై విమర్శలు చెలరేగుతోన్న సమయంలో దానిని రద్దు చేయాలని తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ పరిణామాలపై నటుడు విజయ్ (Vijay) స్పందించారు. -
హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. భోలే బాబా ఎక్కడ..?
Hathras stampede: హాథ్రస్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కన్పించకుండా పోయిన భోలే బాబా కోసం గాలిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. -
టీషర్ట్, చిరిగిన జీన్స్తో కళాశాలకు రావొద్దు
కళాశాల ఆవరణలో విద్యార్థులు హిజాబ్ ధరించడాన్ని నిషేధించి ఇటీవల వార్తల్లో నిలిచిన చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషనల్ సొసైటీ.. తాజాగా టీషర్ట్లు, చిరిగిన జీన్స్(టాన్)పైనా నిషేధం విధించింది. -
మట్టి రాసిన మరణ శాసనం.. 121 మంది దుర్మరణం
భోలే బాబా పాద ధూళి కోసం వచ్చిన భక్తులు ఆ మట్టిలోనే కలిసిపోయిన పెను విషాద ఘటన ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్ జిల్లా ఫుల్రయీ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. -
అరుణాచల్ప్రదేశ్లో సరికొత్త కప్ప జాతి
అరుణాచల్ ప్రదేశ్లోని టేల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఒక సరికొత్త కప్ప జాతిని భారత జంతు పరిశోధన విభాగం శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని తలపై కొమ్ముల్లాంటి ఆకృతులు ఉన్నాయని వారు వివరించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
దేవుడి స్క్రిప్ట్ మరోలా ఉంది.. రిషభ్ పంత్ ఎమోషనల్ పోస్టు
-
ఝార్ఖండ్ సీఎం చంపాయీ సోరెన్ రాజీనామా
-
సినిమాల్లో నటించడంపై స్పందించిన పవన్ కల్యాణ్
-
ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా
-
హైదరాబాద్ను చుట్టేసిన నభా నటేశ్.. కృతి సనన్ స్టైలిష్ డ్రెస్సు!
-
‘డంక్డ్ రైస్ కేక్’..ఇడ్లీ అనుకున్నానే..!: హర్ష గొయెంకా పోస్ట్ వైరల్