- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Hathras Stampede: ‘రద్దీకి అదే కారణం..! భోలే బాబా త్వరలోనే ప్రజల ముందుకు..’
భోలే బాబా (Bhole Baba) త్వరలోనే ప్రజల ముందుకు వస్తారని ఆయన తరఫు న్యాయవాది ఏపీ సింగ్ వెల్లడించారు.
లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాట కేసులో (Hathras Stampede) భోలే బాబా (Bhole Baba) ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. అయితే.. ఆయన త్వరలోనే ప్రజల ముందుకు వస్తారని బాబా తరఫు న్యాయవాది ఏపీ సింగ్ వెల్లడించారు. కేసు విచారణకు పూర్తిగా సహకరిస్తారని చెప్పారు. 121 మంది మృతికి కారణమైన జులై 2నాటి తొక్కిసలాట ఘటనానంతరం భోలే బాబా కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన దేవ్ప్రకాశ్ కూడా పరారీలో ఉన్నాడు. అయితే, తొక్కిసలాటలో అతడు గాయపడ్డాడని, ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని.. కోలుకున్న వెంటనే సిట్ ముందుకు వస్తాడని న్యాయవాది చెప్పారు.
ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్వరకు ఎటువంటి సత్సంగ్లు నిర్వహించలేదని, అందుకే ఇటీవలి కార్యక్రమానికి పెద్దఎత్తున ప్రజలు పోటెత్తారని న్యాయవాది తెలిపారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల అవసరాలను ట్రస్టు చూసుకుంటుందని చెప్పారు. ‘‘జిల్లాల వారీగా బాధితుల వివరాలు ట్రస్టు వద్ద ఉన్నాయి. తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాల విద్య, ఆరోగ్యం, పెళ్లి ఖర్చులను నారాయణ్ సాకార్ హరి ట్రస్టు భరిస్తుంది’’ అని వివరించారు.
24 ఆశ్రమాలు, లగ్జరీ కార్లు.. భోలే బాబాకు ₹100 కోట్ల ఆస్తులు!
ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఆరుగురిని అరెస్టు చేశారు. మంగళవారం నాడు తొక్కిసలాట జరిగిన సమయంలో వేదిక లోపల వీరే జనాన్ని నియంత్రించే బాధ్యతలను చేపట్టారు. దేవ్ప్రకాశ్ మధుకర్ ఆచూకీ చెప్పిన వారికి రూ.లక్ష రివార్డును అందజేస్తామని పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. భోలే బాబాను కేసులో నిందితుడిగా చేర్చలేదు. సత్సంగ్కు 80 వేల మంది భక్తులు హాజరవుతారని నిర్వాహకులు పోలీసుల అనుమతి తీసుకోగా.. 2.5 లక్షల మంది హాజరైనట్లు అంచనా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్తర భారతంలో తరుగుతున్న పాతాళగంగ
ఉత్తర భారత దేశం.. 2002 నుంచి 2021 మధ్య దాదాపు 450 క్యూబిక్ కిలోమీటర్ల మేర భూగర్భ జలాలను కోల్పోయిందని తాజా అధ్యయనం పేర్కొంది. -
బిహార్లో మరో వంతెన కూలింది: తేజస్వీ
బిహార్లో మరో వంతెన కూలిపోయినట్లు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆరోపించారు. తూర్పు చంపారన్ జిల్లాలో కూలిన ఓ నిర్మాణానికి సంబంధించిన వీడియోను ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
రూ.10 లక్షలకు పెరగనున్న ఆయుష్మాన్ ఆరోగ్య బీమా
ప్రతిష్ఠాత్మక ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని రూ.10లక్షలకు పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. -
లోకోపైలట్ల పరిస్థితిని పార్లమెంటులో లేవనెత్తుతాం
రైల్వే లోకోపైలట్ల సమస్యల్ని విపక్ష ఇండియా కూటమి పార్లమెంటులో లేవనెత్తుతుందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ చెప్పారు. -
310 పందులను చంపిన కేరళ
ఆఫ్రికన్ స్వైన్ జ్వరం (ఏఎస్ఎఫ్) వ్యాప్తిని కట్టడిచేసేందుకు కేరళ ప్రభుత్వం దాదాపు 310 పందులను చంపింది. ఏఎస్ఎఫ్ను తొలుత త్రిశూర్ జిల్లాలోని మతకథరన్ గ్రామంలో గుర్తించినట్లు అధికారులు ప్రకటించారు. -
నీట్-యూజీపై నేటి నుంచి సుప్రీంలో విచారణ
వివాదాస్పదంగా మారిన వైద్య ప్రవేశ పరీక్ష నీట్-యూజీ 2024పై సోమవారం నుంచి సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం కానుంది. -
ఖల్సా రాజ్ కలలు కనడం నేరం కాదు
‘ఖల్సా రాజ్’ కలలను నిజం చేసుకునేందుకు లక్షలాది సిక్కులు తమ జీవితాలను త్యాగం చేశారని, ఆ విధమైన కలలు కనడం నేరం కాదని సిక్కు అతివాద బోధకుడు, ఖడూర్ సాహిబ్ పార్లమెంటు సభ్యుడు అమృత్పాల్ సింగ్ అన్నారు. -
మరో ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో రెండు రోజులుగా రెండు గ్రామాల్లో కొనసాగుతున్న ఎన్కౌంటర్లలో మృతి చెందిన ఉగ్రవాదుల సంఖ్య ఆరుకి పెరిగింది. -
సంక్షిప్త వార్తలు
జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఛైర్పర్సన్ రేఖా శర్మపై సామాజిక మాధ్యమంలో అభ్యంతరకర పోస్టు చేశారన్న ఆరోపణలపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై దిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
‘పిల్లాడిలా ఎన్నిసార్లు ఏడుస్తారు’ - ఉద్ధవ్పై మండిపడ్డ శిందే!
మరికొన్ని నెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ‘శివసేన’ నేతల మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలయ్యింది. -
ఫిర్యాదులు సరైనవని తేలితే వారికి మళ్లీ పరీక్ష - ఎన్టీఏ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు CUET-UG పరీక్షకు సంబంధించి అభ్యర్థులు లేవనెత్తే ఫిర్యాదులు సరైనవని తేలితే వారికి జులై 15 నుంచి 19 మధ్య కాలంలో మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెల్లడించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/07/24)
-
స్టన్నింగ్ కియారా.. చీరలో పూజ.. స్టైలిష్ శ్రీముఖి
-
‘పిల్లాడిలా ఎన్నిసార్లు ఏడుస్తారు’ - ఉద్ధవ్పై మండిపడ్డ శిందే!
-
ఫిర్యాదులు సరైనవని తేలితే వారికి మళ్లీ పరీక్ష - ఎన్టీఏ
-
పేపర్ లీక్లతో యువత కలల్ని నాశనం చేసినోళ్లను వదిలేది లేదు.. సీఎం భజన్లాల్ శర్మ
-
ఆ ఆపరేషన్ కారణంగానే సినిమాలకు విరామం: నభా నటేశ్