- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Hathras Stampede: 24 ఆశ్రమాలు, లగ్జరీ కార్లు.. భోలే బాబాకు ₹100 కోట్ల ఆస్తులు!
Hathras Stampede: భోలే బాబా నిర్వహించిన సత్సంగ్కు హాజరై అనంతరం తొక్కిసలాటలో మరణించిన ఘటనలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భోలే బాబాకు దాదాపు రూ.100 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు సమాచారం.
హాథ్రస్: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటకు (Hathras Stampede) కేంద్ర బిందువుగా మారిన భోలే బాబా (Bhole Baba) ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. 121 మంది మృతికి కారణమైన ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ దుర్ఘటనపై జ్యుడిషియల్ విచారణ జరుపుతామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారు.
ఎఫ్ఐఆర్లో పేర్కొన్న సూరజ్పాల్ అలియాస్ నారాయణ్ సాకార్ హరి అలియాస్ భోలే బాబా (Bhole Baba) దొరికితే ప్రశ్నిస్తామని అలీగఢ్ ఐజీ శాలభ్ మాథుర్ గురువారం తెలిపారు. కేసులో ఆయన్ని నిందితుడిగా చేర్చలేదని వెల్లడించారు. ఈ క్రమంలో భోలే బాబాకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన ఆస్తులు, విలాసాలపై ఓ జాతీయ మీడియా ఛానెల్ విస్తుపోయే నిజాలు వెల్లడించింది. ఆయన ఆశ్రమంలోని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం సేకరించినట్లు వెల్లడించింది.
హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. బాధితులను పరామర్శించిన రాహుల్ గాంధీ
భోలే బాబాకు (Bhole Baba) దేశవ్యాప్తంగా 24 ఆశ్రమాలు ఉన్నాయని సమాచారం. వీటిలో అత్యధికంగా యూపీలోనే ఉన్నాయి. ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ.100 కోట్ల వరకు ఉంటుందని ఆశ్రమంలో విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. శ్రీ నారాయణ్ హరి సాకార్ ఛారిటబుల్ ట్రస్ట్ పేరిట వీటిని నిర్వహిస్తున్నారు. ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్లే వీటి నిర్వహణ కార్యకలాపాలు చూస్తుంటారు. నిత్యం తెలుపు రంగు దుస్తులు, టై, కళ్లద్దాల్లో కనిపించే ఆయన అనుచరులకు దర్శనమిచ్చే సమయంలో భారీ పరేడ్తో వస్తారు. దాదాపు 16 మంది వ్యక్తిగత కమాండోలు ఆయన కారుకు ముందు 350 సీసీ బైక్లపై ప్రయాణిస్తూ దారిని క్లియర్ చేస్తారు. వెనక 15-30 కార్లతో ఆయన కాన్వాయ్ ఉంటుంది. దీంట్లో తెల్లటి టయోటా ఫార్చునర్ కారులో ఆయన ప్రయాణిస్తారు. కారు సీట్లతో సహా ఇంటీరియర్ సైతం పూర్తిగా తెలుపు రంగులో ఉంటుందని ఆయన అనుచరుల్లో కొంతమంది తెలిపారు.
సూరజ్పాల్ మెయిన్పురిలోని ఆశ్రమంలో నివాసముంటారు. హరి నగర్గా పిలిచే ఈ ఆశ్రమం 13 ఎకరాల్లో విస్తరించి ఉంది. భోలే బాబా (Bhole Baba), ఆయన భార్య కోసం అందులో దాదాపు ఆరు విలాసవంతమైన గదులు ఉంటాయని సమాచారం. ఆశ్రమంలోకి ప్రవేశిస్తుండగానే దానికి విరాళాలిచ్చిన 200 మంది పేర్లు కనిపిస్తాయని తెలుస్తోంది. వాటిపై రూ.10 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు ఇచ్చిన దాతల వివరాలు ఉంటాయని సమాచారం. ఇటావాలో మరో కొత్త ఆశ్రమం నిర్మాణంలో ఉంది.
ఈ దుర్ఘటనలో బాధిత కుటుంబాలను కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుక్రవారం పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. దీన్ని రాజకీయం చేయడం తన ఉద్దేశం కాదని.. బాధితులకు భరోసా ఇవ్వడం కోసమే వచ్చినట్లు తెలిపారు. అయితే, సత్సంగ్ నిర్వహణలో అధికార యంత్రాంగంవైపు నుంచి లోపాలు ఉన్నట్లు తెలుస్తోందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోల్కతా పోలీస్ కమిషనర్, డీసీపీపై వేటు..!
కోల్కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్, డీసీపీ ఇందిరా ముఖర్జీలపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించింది. ఇద్దరు అధికారులు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించారని గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ కేంద్ర హోంశాఖకు నివేదిక సమర్పించడంతో ఈ చర్యలకు సిద్ధమైంది. -
‘పిల్లాడిలా ఎన్నిసార్లు ఏడుస్తారు’ - ఉద్ధవ్పై మండిపడ్డ శిందే!
మరికొన్ని నెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ‘శివసేన’ నేతల మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలయ్యింది. -
ఎన్సీడబ్ల్యూ ఫిర్యాదు.. ఎంపీ మహువా మొయిత్రాపై కేసు నమోదు
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
‘క్యానులో ఏదో తెచ్చి చల్లారు’.. భోలే బాబా లాయర్ ఆరోపణ
సత్సంగ్ జరిగే సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు డబ్బాల్లో విష పదార్థాన్ని తీసుకువచ్చినట్లు కొందరు తనతో చెప్పారని, దాన్ని చల్లడం వల్లే అనేక మంది సొమ్మసిల్లి ప్రాణాలు కోల్పోయారని భోలే బాబా తరఫు న్యాయవాది ఆరోపించారు. -
రిషికేశ్లో ఉప్పొంగుతున్న గంగ.. ఘాట్ల వద్దకు వెళ్లొద్దని హెచ్చరికలు
ఉత్తరాఖండ్లో వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గంగా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. -
జలపాతం చూసేందుకు వెళ్లి.. వరదలో చిక్కుకొని!
గోవాలోని జలపాతాన్ని చూసేందుకు వెళ్లిన 80 మంది పర్యాటకులు వరదలో చిక్కుకుపోయారు. -
నల్ల డైరీ చెప్పిన గోల్ ‘మాల్’ కథ.. రూ.కోట్లలోనే కస్టమర్లకు సున్నం!
రూ.2500తో డేటా కొనుగోలు చేసి.. రూ. కోట్ల మేర మోసాలకు పాల్పడ్డారు ఇద్దరు నిందితులు. నోయిడాలో జరిగిన ఈ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. -
పదవుల కోసం నేతలు పోటీ.. కాంగ్రెస్ ప్రభుత్వం గాఢనిద్రలో..!: కేంద్రమంత్రి శోభా కరంద్లాజే
కర్ణాటకలో సీఎం, డిప్యూటీ సీఎం నియామకాలపై కాంగ్రెస్ నేతల మధ్య జరుగుతున్న వాగ్వాదంపై కేంద్రమంత్రి శోభా కరంద్లాజే విమర్శలు గుప్పించారు. -
రిసార్టులో 49 మంది.. ఒక్కసారిగా చుట్టుముట్టిన వరదనీరు..
ఠానే జిల్లాలో కురిసిన భారీ వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి. పలు భవనాలు వరదనీటిలో చిక్కుకోగా.. రైల్వే ట్రాక్లపై మట్టిచేరడంతో లోకల్ రైల్ సర్వీసుల్ని తాత్కాలికంగా రద్దు చేశారు. -
మంజకోట్ ఆర్మీ క్యాంపు వద్ద కాల్పులు..గాయపడిన జవాన్
రాజౌరి జిల్లాలోని మంజకోట్ ఆర్మీ క్యాంపు సమీపంలో శనివారం రాత్రి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. -
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చార్ధామ్ యాత్ర నిలిపివేత
ఉత్తరాఖండ్ గర్వాల్ డివిజన్లో భారీ వర్షాల కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. -
జగన్నాథుడి రథయాత్ర.. కిక్కిరిసిన పూరీ వీధులు
ఒడిశాలోని పూరీలో విశ్వప్రసిద్ధ జగన్నాథుడి రథయాత్ర కోలాహలం నెలకొంది. ఆ రాష్ట్రంతో పాటు దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. -
సూరత్లో భవనం కుప్పకూలిన ఘటన.. ఏడుకు చేరిన మృతులు
గుజరాత్ రాష్ట్రం సూరత్లో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. సూరత్లోని పాల్ ప్రాంతంలో శనివారం ఆరంతస్తుల భవనం కూలింది. -
నేడు పూరీ జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్ర
ఒడిశాలోని పూరీ జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్రను ఆదివారం నిర్వహించనున్నారు. జగన్నాథ, బలభద్ర, సుభద్రలు శ్రీక్షేత్రంలోని రత్నసింహాసనం వీడి యాత్రగా... -
శారీరకంగా దృఢంగా ఉన్నా: దలైలామా
తాను శారీరకంగా దృఢంగా ఉన్నానని.. బుద్ధుని బోధనల వ్యాప్తికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని బౌద్ధ గురువు దలైలామా పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన మోకాలి మార్పిడి శస్త్రచికిత్స పూర్తిచేసుకొని కోలుకుంటున్నారు. -
పేపర్ లీక్ ఆరోపణలు.. ప్రిన్సిపల్ను కుర్చీలోంచి బయటకు లాగేసిన సిబ్బంది
పేపర్ లీక్ కుంభకోణంలో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో ఓ ప్రిన్సిపల్ను సిబ్బంది అంతా కలిసి బయటకు తోసేశారు. ఆమె ఫోన్ లాగేసుకొని, కుర్చీ నుంచి లేపి, బలవంతంగా బయటకు పంపారు. -
అనంత్, రాధికల సంగీత్ వేడుకలో.. జస్టిన్ బీబర్, బాలీవుడ్ తారల తళుకు
దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఇంట అనంత్ - రాధికల ముందస్తు పెళ్లి వేడుకలు జోరుగా సాగుతున్నాయి. జియో కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన ‘సంగీత్’ కార్యక్రమంలో కెనడాకు చెందిన పాప్ సింగర్ జస్టిన్ బీబర్ (30)తోపాటు బాలీవుడ్ తారలు సల్మాన్ఖాన్, రణవీర్ సింగ్, -
తేలికపాటి స్వదేశీ యుద్ధ ట్యాంకు సిద్ధం
తూర్పు లద్ధాఖ్లో వాస్తవాధీనరేఖ వెంబడి చైనా దుందుడుకు చర్యలను అడ్డుకునేందుకు భారత్ అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ ట్యాంకు ‘జొరావర్’ సిద్ధమైంది. తాజాగా దీనిపై పరీక్షలు మొదలయ్యాయి. -
23న కేంద్ర బడ్జెట్
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈనెల 22 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. -
సూరత్లో కుప్పకూలిన ఆరంతస్తుల భవనం
గుజరాత్లో పెను ప్రమాదం చోటుచేసుకుంది. సూరత్ పట్టణంలోని పాల్ ప్రాంతంలో శనివారం ఓ ఆరంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. శిథిలాల్లో పలువురు చిక్కుకుపోయారు. -
కేజ్రీవాల్పైనే దర్యాప్తు జరుగుతోంది
మద్యం కుంభకోణానికి సంబంధించిన అవినీతి కేసులో దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 15 వరకు న్యాయస్థానం పొడిగించింది.
తాజా వార్తలు (Latest News)
-
టాజ్మిన్ బ్రిట్స్ హాఫ్ సెంచరీ.. టీమ్ఇండియా లక్ష్యం 178
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
తితిదే పరిపాలనా భవనంలో సోదాలు.. కొనసాగుతున్న విజిలెన్స్ విచారణ
-
ఆధార్ ఫొటోకి మోడల్గా మారి ఫోజులిచ్చిన చిన్నారి.. వీడియో వైరల్
-
‘పిల్లాడిలా ఎన్నిసార్లు ఏడుస్తారు’ - ఉద్ధవ్పై మండిపడ్డ శిందే!
-
ఎన్సీడబ్ల్యూ ఫిర్యాదు.. ఎంపీ మహువా మొయిత్రాపై కేసు నమోదు