- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Amritpal Singh: జులై 5న ఎంపీగా ప్రమాణం చేయనున్న అమృత్పాల్ సింగ్
ఖలిస్థానీ నేత అమృత్పాల్ సింగ్ (Amritpal Singh) జులై 5 లోక్సభ ఎంపీ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు మరో ఎంపీ సరభ్జీత్ సింగ్ ఖల్సా వెల్లడించారు.
దిల్లీ: ఖలిస్థానీ నేత, వారిస్ పంజాబ్ దే నాయకుడు అమృత్పాల్ సింగ్ (Amritpal Singh) లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జాతీయ భద్రతా చట్టం కింద అస్సాంలోని డిబ్రూగఢ్లో జైల్లో ఉన్న అతడు.. జులై 5న లోక్సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని ఫరీద్కోట ఎంపీ సరభ్జీత్ సింగ్ ఖల్సా మీడియాకు వెల్లడించారు.
అమృత్ పాల్ సింగ్ ప్రమాణస్వీకారం గురించి తాను లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో మాట్లాడానని ఖల్సా చెప్పారు. జులై 5న స్పీకర్ ఛాంబర్లో ప్రమాణ స్వీకారం ఉండనుందని తెలిపారు. దీనికి సంబంధించి అతడికి ఐదవ తేదీ నుంచి నాలుగురోజులకు పేరోల్ లభించినట్లు చెప్పారు. అమృత్ పాల్.. పంజాబ్ (Punjab)లోని ఖడూర్ సాహిబ్ స్థానం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అదే రోజు ఉగ్రనిధుల కేసు (terror-funding case) నిందితుడు, బారాముల్లా ఎంపీ ఇంజినీర్ రషీద్ (Engineer Rashid) ప్రమాణ స్వీకారం కూడా ఉండనుంది.
అమృత్సర్ జిల్లా అజ్నాలా పోలీసులపై దాడి కేసులో అమృత్పాల్ పేరు దేశంలో మార్మోగింది. అతడు చాలాకాలం దుబాయిలో ఉన్నాడు. ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ వ్యవస్థాపకుడు దీప్సిద్ధూ మరణంతో అమృత్పాల్ ఆ సంస్థకు తానే నాయకుడినని ప్రకటించుకున్నాడు. నాటినుంచి ఖలిస్థానీ కార్యకలాపాలకు ఏకంగా పంజాబ్నే స్థావరంగా ఎంచుకున్నాడు. అజ్నాలా ఘటన తర్వాత దాదాపు నెల రోజులు అజ్ఞాతంలో గడిపాడు. చివరికి జర్నైల్ సింగ్ గ్రామమైన రోడెవాల్లోని గురుద్వారాలో అతడిని అరెస్టు చేసి డిబ్రూగఢ్ జైలుకు తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదే నిజమైతే.. భోలే బాబా మా వారిని బతికించొచ్చు కదా..!
భోలే బాబా (Bhole Baba) అద్భుతాలు చేయగలిగితే.. తన సత్సంగ్ కార్యక్రమానికి వచ్చిన మృతులను ఎందుకు బతికించలేదని హాథ్రస్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. -
ఎంపీలుగా ప్రమాణం చేసిన అమృత్పాల్ సింగ్, ఇంజినీర్ రషీద్
వివిధ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్పాల్ సింగ్, ఉగ్రనిధుల కేసు నిందితుడు ఇంజినీర్ రషీద్ శుక్రవారం ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేశారు. -
ఆ ప్రశ్నాపత్రాలు ఇస్తామంటే నమ్మొద్దు - ఎన్బీఈ హెచ్చరిక
‘ఎఫ్ఎంజీఈ’ అర్హత పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాన్ని అందజేస్తామని సోషల్ మీడియాలో వస్తోన్న ప్రచారాన్ని నమ్మవద్దని నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ వెల్లడించింది. -
30 ఏళ్లుగా ఒక్క చీరా కొనుక్కోలేదు.. సుధామూర్తి ఆసక్తికర సంగతులు
Sudha Murty: రాజ్యసభ ఎంపీ సుధామూర్తి గత 30 ఏళ్లలో ఒక్క చీరను కూడా కొనలేదట. అందుకు కారణమేంటో ఆమె ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. -
నిర్వాహకులదే తప్పిదంగా కనిపిస్తోంది.. హాథ్రస్ ఘటనపై సిట్ చీఫ్
హాథ్రస్ తొక్కిసలాట ఘటనలో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు.. నిర్వాహకులదే తప్పిదమని సూచిస్తున్నాయని దర్యాప్తు అధికారి తెలిపారు. -
నీట్ పరీక్షను రద్దు చేయడం హేతుబద్ధం కాదు.. ‘సుప్రీం’లో కేంద్రం అఫిడవిట్
నీట్ పరీక్షను రద్దు చేయడం హేతుబద్ధతమైనది కాదని కేంద్రం తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. -
ఆప్ పార్లమెంటరీ ఛైర్పర్సన్గా సంజయ్ సింగ్
ఆమ్ఆద్మీ పార్టీ పార్లమెంటరీ ఛైర్పర్సన్గా ఆప్ సంజయ్ సింగ్ను నియమించింది. -
జమ్మూకశ్మీర్ ఎన్నికలు అప్పుడేనా..?
అమర్నాథ్ యాత్ర ముగిసిన అనంతరం జమ్మూకశ్మీర్ ఎన్నికలు నిర్వహించనున్నారని అధికారిక వర్గాల సమాచారం. -
అందుకే బిహార్లో వరుసగా బ్రిడ్జ్లు కూలుతున్నాయట! నివ్వెరపరుస్తున్న కేంద్రమంత్రి సమాధానం
బిహార్ (Bihar)లో వరుసగా బ్రిడ్జ్లు కూలిపోవడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి వెల్లడించారు. అయితే ఆయన ఇచ్చిన వివరణ ఆశ్చర్యపరుస్తోంది. -
24 ఆశ్రమాలు, లగ్జరీ కార్లు.. భోలే బాబాకు ₹100 కోట్ల ఆస్తులు!
Hathras Stampede: భోలే బాబా నిర్వహించిన సత్సంగ్కు హాజరై అనంతరం తొక్కిసలాటలో మరణించిన ఘటనలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భోలే బాబాకు దాదాపు రూ.100 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు సమాచారం. -
హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. బాధితులను పరామర్శించిన రాహుల్ గాంధీ
Hathras Stampede: యూపీలో హాథ్రస్లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన బాధితులను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరామర్శించారు. బాధితుల ఇళ్లకు వెళ్లి ధైర్యం చెప్పారు. -
రక్తంలో కొలెస్ట్రాల్పై కొత్త మార్గదర్శకాలు.. తొలిసారి జారీ చేసిన సీఎస్ఐ
రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిల అసాధారణ హెచ్చుతగ్గులను (డిస్లిపిడెమియా) నివారించేందుకు దోహదపడేలా కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్ఐ) మన దేశంలో తొలిసారి మార్గదర్శకాలను గురువారం జారీ చేసింది. -
బ్రహ్మపుత్రి
వానలు పెరిగాయంటే... అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలోగల రెండువేల లంకల్లో ప్రజలందరి ప్రాణాలూ అరచేతుల్లో! అలాంటి లంకల్లో ఒకటి మొరిగావ్ జిల్లాలోని పులియామారి చార్! -
కుటుంబాన్ని కలవవచ్చు.. దిల్లీ వదిలి వెళ్లకూడదు
ఖలిస్థాన్ సానుభూతిపరుడు, పంజాబ్లోని ఖడూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికైన అమృత్పాల్ సింగ్ ఎంపీగా ప్రమాణం చేయడానికి పెరోల్ ఇచ్చిన న్యాయస్థానం 10 షరతులు విధించింది. -
రోజువారీ మరణాల్లో 7శాతం వాయు కాలుష్యం వల్లే
దేశంలో వాయు కాలుష్యం తీవ్రతపై లాన్సెట్ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్ సహా పది నగరాల్లో రోజువారీ మరణాల్లో సగటున 7శాతానికి పైగా ఈ కారణంగానే సంభవిస్తున్నాయని అధ్యయనం ద్వారా వెల్లడించింది. -
మా అబ్బాయి పెళ్లికి రండి.. సోనియా కుటుంబాన్ని ఆహ్వానించిన ముకేశ్ అంబానీ
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ దిల్లీలోని ఆమె 10 జన్పథ్ నివాసంలో గురువారం కలిశారు. -
నీట్-యూజీని రద్దు చేయొద్దు
పరీక్ష పత్రాల లీకేజీ, ఇతరత్రా అక్రమాల ఆరోపణల నేపథ్యంలో వివాదాస్పదమైన నీట్-యూజీ (2024)ని రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్లు వస్తోన్న నేపథ్యంలో ఆ అభ్యర్థనలను వ్యతిరేకిస్తూ 56 మంది ర్యాంకర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ఆసుపత్రి నుంచి ఆడ్వాణీ డిశ్చార్జ్
భాజపా దిగ్గజ నేత, మాజీ ఉపప్రధాని ఎల్కే ఆడ్వాణీ(96) గురువారం సాయంత్రం దిల్లీలోని అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. -
అడ్డా కూలీలకు గౌరవమివ్వాలి
కాయ కష్టం చేసే అడ్డా కూలీలకు పూర్తి హక్కులను కల్పించాలని, వారికి తగిన గౌరవం ఇవ్వాలని, అది తన జీవిత లక్ష్యమని కాంగ్రెస్ అగ్ర నేత, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. -
సుప్రీంకు క్షమాపణ చెప్పిన ఐఎంయే అధ్యక్షుడు
పతంజలి ఆయుర్వేద సంస్థ ప్రకటనల కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యక్తపరిచిన అభిప్రాయంపై చేసిన వ్యాఖ్యలకు ‘భారత వైద్య సంఘం’ (ఐఎంయే) అధ్యక్షుడు డాక్టర్ ఆర్.వి.అశోకన్ గురువారం బహిరంగ క్షమాపణ చెప్పారు. -
కోటాలో జేఈఈ అభ్యర్థి ఆత్మహత్య
రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. తాజాగా జేఈఈ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్లో చంద్రబాబుకు ఘనస్వాగతం.. భారీగా తరలివచ్చిన తెదేపా శ్రేణులు
-
నాపై నాకే నమ్మకం కుదరలేదు: కోహ్లీ
-
అదే నిజమైతే.. భోలే బాబా మా వారిని బతికించొచ్చు కదా..!
-
హైదరాబాద్లో పలు చోట్ల వర్షం.. స్తంభించిన ట్రాఫిక్
-
ఇప్పుడు 140+ కోట్ల మంది ఛాంపియన్లే: హార్దిక్ పాండ్య
-
బ్రిటన్ ఎన్నికల్లో భారత సంతతి హవా.. 26 మంది గెలుపు!