- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Hathras Stampede: అదే నిజమైతే.. భోలే బాబా మా వారిని బతికించొచ్చు కదా..!
భోలే బాబా (Bhole Baba) అద్భుతాలు చేయగలిగితే.. తన సత్సంగ్ కార్యక్రమానికి వచ్చిన మృతులను ఎందుకు బతికించలేదని హాథ్రస్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు.
హాథ్రస్: ఉత్తర్ప్రదేశ్లోని (Uttarpradesh) హాథ్రస్ (Hathras) జిల్లాలో జరిగిన తొక్కిసలాట పలు కుటుంబాల్లో చీకట్లు నింపింది. తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలైనవారు కొందరైతే. అమ్మానాన్నల వెంట వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన వారు మరికొందరు. బాధిత కుటుంబాల్లో ఎవరిని కదిలించినా కన్నీటి గాథలు వెలుగులోకి వస్తున్నాయి. యూపీకి చెందిన చోటేలాల్ ఆయన భార్య మంజుదేవితో కలిసి గత ఐదారేళ్ల నుంచి ‘భోలే బాబా’ (Bhole Baba) సత్సంగానికి వెళ్తున్నారు. భోలే బాబా ప్రసంగాలతో ఎంతో కొంత మంచిని నేర్చుకుంటాడన్న ఆశతో మంగళవారం తమ ఆరేళ్ల కుమారుడిని కూడా వెంట తీసుకెళ్లారు. అదే ఆ బాలుడికి చివరి రోజైంది. తొక్కిసలాటలో మంజుదేవితోపాటు, కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు.
‘‘తొక్కిసలాట మొదలైనప్పుడు నేను ప్రధాన గేటు దగ్గరే ఉన్నాను. జనం నుంచి తప్పించుకునే క్రమంలో నా భార్య నీటితో నింపిన చిన్న కుండీలో పడిపోయి ఊపిరాడక చనిపోయింది. అక్కడే ఉన్న నా కుమారుడు కూడా తొక్కిసలాటలో ప్రాణాలొదిలాడు. జనాన్ని నెట్టుకుంటూ వారి దగ్గరికి వెళ్లలేక కొడుకు, భార్యను కోల్పోయాను’’ అంటూ చోటేలాల్ కన్నీరుమున్నీరయ్యారు. ఆయన లాంటి ఎంతో మందికి ఈ దుర్ఘటన తీరని ఆవేదన మిగిల్చింది. హాథ్రస్లోని వివిధ మార్చురీల్లో ఉన్న తమవారిని గుర్తించేందుకు వెళ్లిన బంధువుల రోదనలు గుండెల్ని పిండేస్తున్నాయి. ‘‘దాదాపు గత పదేళ్లుగా భోలే బాబా సత్సంగ్ కార్యక్రమాలకు వెళ్తున్నాం. ఇలాంటి ఘోరం ఎప్పుడూ జరగలేదు. తొక్కిసలాటలో మా అత్తమ్మ చనిపోయారు. ఆమే మా కుటుంబానికి వెన్నెముక. మేం బాధల్లో ఉన్నప్పుడు ధైర్యం చెప్పేవారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మా మధ్య లేరు. అసలు ఈ దారుణం ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు’’ అంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలా ఎంతో మంది మీడియా ఎదుట తమ కన్నీటిగాథలను వినిపిస్తున్నారు. వారంతా అడిగే ఏకైక ప్రశ్న ఒక్కటే. ‘‘భోలే బాబా అద్భుతాలు చేస్తారని మేం అందరం నమ్ముతున్నాం. ఆయన్ని దైవస్వరూపంగా కొలుస్తున్నాం. అదే నిజమైతే.. ఇంత దారుణం ఎలా జరిగింది? ఒక వేళ జరిగినా తన కోసం వచ్చిన భక్తులను తన అద్భుతాలతో తిరిగి ఎందుకు బతికించలేదు?’’ అని నిస్సహాయతతో ప్రశ్నిస్తున్నారు. ప్రాణాలతో బయటపడిన వారు తమ భయంకరమైన అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు. ‘‘ తొక్కిసలాటలో చిక్కుకొని తప్పించుకునే ప్రయత్నం చేశాను. ఇంతలో ఒక్కసారిగా నాపై జనం పడిపోయారు. స్పృహ కోల్పోయా. లేచి చూసేసరికి ఆస్పత్రిలో ఉన్నా. దేవుడి దయవల్ల ప్రాణాలతో బయటపడ్డా’’ అంటూ చికిత్స పొందుతున్న బాధితుడొకరు చెప్పారు. ‘‘ ఎటు చూసినా జనం పరుగులు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. నా కాలికి గాయమైంది. భయంతో స్పృహ కోల్పోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. చివరికి ఆస్పత్రిలో నా వారిని కలుసుకున్నాను’’ అంటూ ఓ మహిళ మీడియా ఎదుట తన ప్రత్యక్ష అనుభవాన్ని చెప్పుకొచ్చారు.
భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో మంగళవారం 121 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వందల మంది గాయపడ్డారు. ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్ జిల్లా ఫుల్రయీ గ్రామంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో ప్రసిద్ధుడైన భోలే బాబా దర్శనం కోసం ఒక్కసారిగా జనం ఎగబడటంతోపాటు ఆయన పాదాల చుట్టూ ఉన్న మట్టిని సేకరించేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిడుగు పాటుకు 10మంది మృత్యువాత
పిడుగుపాటుకు బిహార్లో పది మంది బలైపోయారు. -
పూరీ రథయాత్రలో అపశ్రుతి.. ఒకరి మృతి
ఒడిశాలోని పూరీలో విశ్వప్రసిద్ధ జగన్నాథుడి రథయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది -
కోల్కతా పోలీస్ కమిషనర్, డీసీపీపై వేటు..!
కోల్కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్, డీసీపీ ఇందిరా ముఖర్జీలపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించింది. ఇద్దరు అధికారులు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించారని గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ కేంద్ర హోంశాఖకు నివేదిక సమర్పించడంతో ఈ చర్యలకు సిద్ధమైంది. -
‘పిల్లాడిలా ఎన్నిసార్లు ఏడుస్తారు’ - ఉద్ధవ్పై మండిపడ్డ శిందే!
మరికొన్ని నెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ‘శివసేన’ నేతల మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలయ్యింది. -
ఎన్సీడబ్ల్యూ ఫిర్యాదు.. ఎంపీ మహువా మొయిత్రాపై కేసు నమోదు
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
‘క్యానులో ఏదో తెచ్చి చల్లారు’.. భోలే బాబా లాయర్ ఆరోపణ
సత్సంగ్ జరిగే సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు డబ్బాల్లో విష పదార్థాన్ని తీసుకువచ్చినట్లు కొందరు తనతో చెప్పారని, దాన్ని చల్లడం వల్లే అనేక మంది సొమ్మసిల్లి ప్రాణాలు కోల్పోయారని భోలే బాబా తరఫు న్యాయవాది ఆరోపించారు. -
రిషికేశ్లో ఉప్పొంగుతున్న గంగ.. ఘాట్ల వద్దకు వెళ్లొద్దని హెచ్చరికలు
ఉత్తరాఖండ్లో వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గంగా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. -
జలపాతం చూసేందుకు వెళ్లి.. వరదలో చిక్కుకొని!
గోవాలోని జలపాతాన్ని చూసేందుకు వెళ్లిన 80 మంది పర్యాటకులు వరదలో చిక్కుకుపోయారు. -
నల్ల డైరీ చెప్పిన గోల్ ‘మాల్’ కథ.. రూ.కోట్లలోనే కస్టమర్లకు సున్నం!
రూ.2500తో డేటా కొనుగోలు చేసి.. రూ. కోట్ల మేర మోసాలకు పాల్పడ్డారు ఇద్దరు నిందితులు. నోయిడాలో జరిగిన ఈ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. -
పదవుల కోసం నేతలు పోటీ.. కాంగ్రెస్ ప్రభుత్వం గాఢనిద్రలో..!: కేంద్రమంత్రి శోభా కరంద్లాజే
కర్ణాటకలో సీఎం, డిప్యూటీ సీఎం నియామకాలపై కాంగ్రెస్ నేతల మధ్య జరుగుతున్న వాగ్వాదంపై కేంద్రమంత్రి శోభా కరంద్లాజే విమర్శలు గుప్పించారు. -
రిసార్టులో 49 మంది.. ఒక్కసారిగా చుట్టుముట్టిన వరదనీరు..
ఠానే జిల్లాలో కురిసిన భారీ వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి. పలు భవనాలు వరదనీటిలో చిక్కుకోగా.. రైల్వే ట్రాక్లపై మట్టిచేరడంతో లోకల్ రైల్ సర్వీసుల్ని తాత్కాలికంగా రద్దు చేశారు. -
మంజకోట్ ఆర్మీ క్యాంపు వద్ద కాల్పులు..గాయపడిన జవాన్
రాజౌరి జిల్లాలోని మంజకోట్ ఆర్మీ క్యాంపు సమీపంలో శనివారం రాత్రి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. -
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చార్ధామ్ యాత్ర నిలిపివేత
ఉత్తరాఖండ్ గర్వాల్ డివిజన్లో భారీ వర్షాల కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. -
జగన్నాథుడి రథయాత్ర.. కిక్కిరిసిన పూరీ వీధులు
ఒడిశాలోని పూరీలో విశ్వప్రసిద్ధ జగన్నాథుడి రథయాత్ర కోలాహలం నెలకొంది. ఆ రాష్ట్రంతో పాటు దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. -
సూరత్లో భవనం కుప్పకూలిన ఘటన.. ఏడుకు చేరిన మృతులు
గుజరాత్ రాష్ట్రం సూరత్లో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. సూరత్లోని పాల్ ప్రాంతంలో శనివారం ఆరంతస్తుల భవనం కూలింది. -
నేడు పూరీ జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్ర
ఒడిశాలోని పూరీ జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్రను ఆదివారం నిర్వహించనున్నారు. జగన్నాథ, బలభద్ర, సుభద్రలు శ్రీక్షేత్రంలోని రత్నసింహాసనం వీడి యాత్రగా... -
శారీరకంగా దృఢంగా ఉన్నా: దలైలామా
తాను శారీరకంగా దృఢంగా ఉన్నానని.. బుద్ధుని బోధనల వ్యాప్తికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని బౌద్ధ గురువు దలైలామా పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన మోకాలి మార్పిడి శస్త్రచికిత్స పూర్తిచేసుకొని కోలుకుంటున్నారు. -
పేపర్ లీక్ ఆరోపణలు.. ప్రిన్సిపల్ను కుర్చీలోంచి బయటకు లాగేసిన సిబ్బంది
పేపర్ లీక్ కుంభకోణంలో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో ఓ ప్రిన్సిపల్ను సిబ్బంది అంతా కలిసి బయటకు తోసేశారు. ఆమె ఫోన్ లాగేసుకొని, కుర్చీ నుంచి లేపి, బలవంతంగా బయటకు పంపారు. -
అనంత్, రాధికల సంగీత్ వేడుకలో.. జస్టిన్ బీబర్, బాలీవుడ్ తారల తళుకు
దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఇంట అనంత్ - రాధికల ముందస్తు పెళ్లి వేడుకలు జోరుగా సాగుతున్నాయి. జియో కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన ‘సంగీత్’ కార్యక్రమంలో కెనడాకు చెందిన పాప్ సింగర్ జస్టిన్ బీబర్ (30)తోపాటు బాలీవుడ్ తారలు సల్మాన్ఖాన్, రణవీర్ సింగ్, -
తేలికపాటి స్వదేశీ యుద్ధ ట్యాంకు సిద్ధం
తూర్పు లద్ధాఖ్లో వాస్తవాధీనరేఖ వెంబడి చైనా దుందుడుకు చర్యలను అడ్డుకునేందుకు భారత్ అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ ట్యాంకు ‘జొరావర్’ సిద్ధమైంది. తాజాగా దీనిపై పరీక్షలు మొదలయ్యాయి. -
23న కేంద్ర బడ్జెట్
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈనెల 22 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.