- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Yogi Adityanath: హాథ్రస్ తొక్కిసలాటపై జ్యుడీషియల్ విచారణ: సీఎం యోగి ప్రకటన
హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటపై జ్యుడీషియల్ విచారణ జరపనున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు.
లఖ్నవూ: ఉత్తరప్రదేశ్ (Uttarpradesh)లోని హాథ్రస్లో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట ఘటన దేశంలో పెనువిషాదం నింపింది. ఈ దుర్ఘటనలో 121 మంది మృతి చెందగా.. వీరిలో ఆరుగురు ఇతర రాష్ట్రాల వారు ఉన్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బుధవారం వెల్లడించారు. ఆరుగురు మృతుల్లో హరియాణా నుంచి నలుగురు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి ఒక్కొక్కరు ఉన్నట్లు తెలిపారు. ఈ దుర్ఘటనపై విశ్రాంత హైకోర్టు జడ్జితో జ్యుడీషియల్ విచారణ జరుపుతామని ప్రకటించారు. న్యాయ విచారణ కమిటీలో విశ్రాంత అధికారులతో పాటు పోలీసు అధికారులు కూడా భాగంగా ఉంటారని తెలిపారు. ఈ విషాదానికి బాధ్యులెవరో గుర్తించడంతో పాటు, ఏదైనా కుట్ర ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తారని వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకొనేలా నిబంధనలు రూపొందిస్తామని సీఎం తెలిపారు.
హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. భోలే బాబా ఎక్కడ..?
హాథ్రస్ జిల్లాలో భోలే బాబా పాద ధూళి కోసం జనం ఒక్కసారిగా ఎగబడటంతో మంగళవారం జరిగిన భారీ తొక్కిసలాట (Hathras stampede) పలు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 121 మంది మృతి చెందగా.. గాయాలపాలైనవారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే, ఈ విషాదం తర్వాత భోలే బాబా పరారీలో ఉన్నారు. అతడి ఆచూకీ గుర్తించేందుకు పోలీసులు గాలిస్తున్నారు.
సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ హైకోర్టులో పిల్
హాథ్రస్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ అలహాబాద్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. గౌరవ్ ద్వివేది అనే న్యాయవాది ఈ పిల్ దాఖలు చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని.. ఇందుకు జిల్లా అధికారులదే పూర్తి బాధ్యత అని ఆరోపించారు. ఈ వ్యవహారంపై న్యాయమైన విచారణ జరిగేలా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని పిటిషన్లో కోరారు. అలాగే, ఈ దుర్ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. డీజీపీ, హాథ్రస్ డివిజనల్ కమిషనర్, జిల్లా మెజిస్ట్రేట్, ఎస్పీ, ఫులేరా పోలీస్స్టేషన్లోని ఎస్హెచ్వోలను సస్పెండ్ చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే, ఈ పిటిషన్పై విచారణ తేదీని ఇంకా నిర్ణయించలేదని కోర్టు వర్గాలు పేర్కొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30 ఏళ్లుగా ఒక్క చీరా కొనుక్కోలేదు.. సుధామూర్తి ఆసక్తికర సంగతులు
Sudha Murty: రాజ్యసభ ఎంపీ సుధామూర్తి గత 30 ఏళ్లలో ఒక్క చీరను కూడా కొనలేదట. అందుకు కారణమేంటో ఆమె ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. -
నిర్వాహకులదే తప్పిదంగా కనిపిస్తోంది.. హాథ్రస్ ఘటనపై సిట్ చీఫ్
హాథ్రస్ తొక్కిసలాట ఘటనలో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు.. నిర్వాహకులదే తప్పిదమని సూచిస్తున్నాయని దర్యాప్తు అధికారి తెలిపారు. -
నీట్ పరీక్షను రద్దు చేయడం హేతుబద్ధం కాదు.. ‘సుప్రీం’లో కేంద్రం అఫిడవిట్
నీట్ పరీక్షను రద్దు చేయడం హేతుబద్ధతమైనది కాదని కేంద్రం తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. -
ఆప్ పార్లమెంటరీ ఛైర్పర్సన్గా సంజయ్ సింగ్
ఆమ్ఆద్మీ పార్టీ పార్లమెంటరీ ఛైర్పర్సన్గా ఆప్ సంజయ్ సింగ్ను నియమించింది. -
జమ్మూకశ్మీర్ ఎన్నికలు అప్పుడేనా..?
అమర్నాథ్ యాత్ర ముగిసిన అనంతరం జమ్మూకశ్మీర్ ఎన్నికలు నిర్వహించనున్నారని అధికారిక వర్గాల సమాచారం. -
అందుకే బిహార్లో వరుసగా బ్రిడ్జ్లు కూలుతున్నాయట! నివ్వెరపరుస్తున్న కేంద్రమంత్రి సమాధానం
బిహార్ (Bihar)లో వరుసగా బ్రిడ్జ్లు కూలిపోవడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి వెల్లడించారు. అయితే ఆయన ఇచ్చిన వివరణ ఆశ్చర్యపరుస్తోంది. -
24 ఆశ్రమాలు, లగ్జరీ కార్లు.. భోలే బాబాకు ₹100 కోట్ల ఆస్తులు!
Hathras Stampede: భోలే బాబా నిర్వహించిన సత్సంగ్కు హాజరై అనంతరం తొక్కిసలాటలో మరణించిన ఘటనలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భోలే బాబాకు దాదాపు రూ.100 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు సమాచారం. -
హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. బాధితులను పరామర్శించిన రాహుల్ గాంధీ
Hathras Stampede: యూపీలో హాథ్రస్లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన బాధితులను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరామర్శించారు. బాధితుల ఇళ్లకు వెళ్లి ధైర్యం చెప్పారు. -
రక్తంలో కొలెస్ట్రాల్పై కొత్త మార్గదర్శకాలు.. తొలిసారి జారీ చేసిన సీఎస్ఐ
రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిల అసాధారణ హెచ్చుతగ్గులను (డిస్లిపిడెమియా) నివారించేందుకు దోహదపడేలా కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్ఐ) మన దేశంలో తొలిసారి మార్గదర్శకాలను గురువారం జారీ చేసింది. -
బ్రహ్మపుత్రి
వానలు పెరిగాయంటే... అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలోగల రెండువేల లంకల్లో ప్రజలందరి ప్రాణాలూ అరచేతుల్లో! అలాంటి లంకల్లో ఒకటి మొరిగావ్ జిల్లాలోని పులియామారి చార్! -
కుటుంబాన్ని కలవవచ్చు.. దిల్లీ వదిలి వెళ్లకూడదు
ఖలిస్థాన్ సానుభూతిపరుడు, పంజాబ్లోని ఖడూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికైన అమృత్పాల్ సింగ్ ఎంపీగా ప్రమాణం చేయడానికి పెరోల్ ఇచ్చిన న్యాయస్థానం 10 షరతులు విధించింది. -
రోజువారీ మరణాల్లో 7శాతం వాయు కాలుష్యం వల్లే
దేశంలో వాయు కాలుష్యం తీవ్రతపై లాన్సెట్ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్ సహా పది నగరాల్లో రోజువారీ మరణాల్లో సగటున 7శాతానికి పైగా ఈ కారణంగానే సంభవిస్తున్నాయని అధ్యయనం ద్వారా వెల్లడించింది. -
మా అబ్బాయి పెళ్లికి రండి.. సోనియా కుటుంబాన్ని ఆహ్వానించిన ముకేశ్ అంబానీ
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ దిల్లీలోని ఆమె 10 జన్పథ్ నివాసంలో గురువారం కలిశారు. -
నీట్-యూజీని రద్దు చేయొద్దు
పరీక్ష పత్రాల లీకేజీ, ఇతరత్రా అక్రమాల ఆరోపణల నేపథ్యంలో వివాదాస్పదమైన నీట్-యూజీ (2024)ని రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్లు వస్తోన్న నేపథ్యంలో ఆ అభ్యర్థనలను వ్యతిరేకిస్తూ 56 మంది ర్యాంకర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ఆసుపత్రి నుంచి ఆడ్వాణీ డిశ్చార్జ్
భాజపా దిగ్గజ నేత, మాజీ ఉపప్రధాని ఎల్కే ఆడ్వాణీ(96) గురువారం సాయంత్రం దిల్లీలోని అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. -
అడ్డా కూలీలకు గౌరవమివ్వాలి
కాయ కష్టం చేసే అడ్డా కూలీలకు పూర్తి హక్కులను కల్పించాలని, వారికి తగిన గౌరవం ఇవ్వాలని, అది తన జీవిత లక్ష్యమని కాంగ్రెస్ అగ్ర నేత, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. -
సుప్రీంకు క్షమాపణ చెప్పిన ఐఎంయే అధ్యక్షుడు
పతంజలి ఆయుర్వేద సంస్థ ప్రకటనల కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యక్తపరిచిన అభిప్రాయంపై చేసిన వ్యాఖ్యలకు ‘భారత వైద్య సంఘం’ (ఐఎంయే) అధ్యక్షుడు డాక్టర్ ఆర్.వి.అశోకన్ గురువారం బహిరంగ క్షమాపణ చెప్పారు. -
కోటాలో జేఈఈ అభ్యర్థి ఆత్మహత్య
రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. తాజాగా జేఈఈ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. -
8 నుంచి మోదీ రష్యా పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన ఖరారైంది. ఈ నెల 8-10 తేదీల్లో ఆయన రష్యాతోపాటు ఆస్ట్రియాలో అధికారిక పర్యటన చేపట్టనున్నట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ గురువారం ప్రకటించింది. -
బిహార్లో కూలిన మరో వంతెన
బిహార్లో వరుసగా వంతెనలు కూలుతున్నాయి. గురువారం సారణ్ జిల్లాలోని గండకీ నదిపై మరో వంతెన కూలింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. -
‘మెదడును తినే అమీబా’ వ్యాధితో కేరళలో బాలుడి మృతి
‘మెదడును తినే అమీబా (అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్)’ అనే అరుదైన వ్యాధి బారిన పడి కేరళలో 14 ఏళ్ల మృదుల్ అనే ఓ బాలుడు మృత్యువాతపడ్డాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జింబాబ్వేకు యువ భారత్.. ఈ కుర్రాళ్లపై ఓ లుక్కేద్దాం!
-
‘కల్కి’లో కృష్ణుడిగా మహేశ్బాబు: నాగ్ అశ్విన్ సమాధానమేంటంటే?
-
ఎమ్మెల్సీలుగా సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక
-
30 ఏళ్లుగా ఒక్క చీరా కొనుక్కోలేదు.. సుధామూర్తి ఆసక్తికర సంగతులు
-
మీ ఆగ్రహం నన్ను తాకింది: ప్రధానిగా చివరి ప్రసంగంలో రిషి సునాక్ భావోద్వేగం
-
రివ్యూ: వెబ్సిరీస్: మీర్జాపూర్ సీజన్-3.. క్రైమ్, యాక్షన్ సిరీస్-3 మెప్పించిందా?