- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Lok Sabha: ఎంపీలుగా 535 మంది ప్రమాణం
నూతన లోక్సభ తొలి సమావేశాల సందర్భంగా సోమ, మంగళవారాల్లో మొత్తం 535 మంది సభ్యులు ఎంపీలుగా ప్రమాణం చేశారు.
తొలిరోజు 262, రెండోరోజు 273 మందితో పూర్తి
మిగిలిపోయిన మరో ఏడుగురు సభ్యులు
దిల్లీ: నూతన లోక్సభ తొలి సమావేశాల సందర్భంగా సోమ, మంగళవారాల్లో మొత్తం 535 మంది సభ్యులు ఎంపీలుగా ప్రమాణం చేశారు. మరో ఏడుగురు సభ్యుల ప్రమాణం మిగిలింది. వీరితో నూతన స్పీకర్ తరవాత ప్రమాణం చేయించే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు 262 మంది సోమవారం.. మరో 273 మంది మంగళవారం ఎంపీలుగా ప్రమాణం చేశారు.
రెండో రోజు మంగళవారం ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ పలువురు సభ్యులతో ప్రమాణం చేయించారు. వారిలో కేంద్రమంత్రి నారాయణ్ రాణే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఆయన భార్య డింపుల్ యాదవ్, నటి హేమామాలిని (భాజపా), కనిమొళి (డీఎంకే), సుప్రియా సూలే(ఎన్సీపీ-ఎస్పీ), నటి కంగనా రనౌత్ (భాజపా), అర్వింద్ సావంత్ (శివసేన-యూబీటీ), మహువా మొయిత్రా (టీఎంసీ), శ్రీకాంత్ శిందే (శివసేన) తదితరులు ఉన్నారు. రాహుల్ గాంధీ రాజ్యాంగం చిరు పుస్తకాన్ని చేతిలో పట్టుకుని ఆంగ్లంలో ప్రమాణం పూర్తిచేశారు. అనంతరం ‘జై హింద్’, ‘జై సంవిధాన్’ అని నినదించారు.
- ప్రమాణాల కార్యక్రమంలో మొదటగా కాంగ్రెస్ ఎంపీ (నందుర్బార్) గోవాల్ కగాడా పడావి ప్రమాణం చేశారు. అనంతరం శోభా దినేశ్ బచ్చావ్, స్మితా ఉదయ్ వాఘ్ తదితరులు చేశారు.
- స్పీకర్ పదవికి పోటీపడుతున్న భాజపా ఎంపీ ఓం బిర్లా కూడా మంగళవారం ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా సభాధ్యక్ష స్థానంలో ఉన్న రాధా మోహన్ సింగ్ తన కుర్చీలోంచి లేచి ఓం బిర్లాకు అభినందనలు తెలిపారు. రాజస్థాన్లోని కోటా నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
- ఎంపీ సుప్రియా సూలే తన ప్రమాణం అనంతరం ప్రొటెం స్పీకర్ మహతాబ్ కాళ్లకు నమస్కరించారు. అనంతరం భాజపా సీనియర్ నేత, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆశీస్సులు తీసుకున్నారు.
- మహారాష్ట్ర ఎంపీలు ప్రమాణం తర్వాత జైహింద్, జై మహారాష్ట్ర, జైభీం, జై శివాజీ అంటూ నినాదాలు చేయగా.. ప్రమాణస్వీకార పత్రంలో ఏముందో అదే చెప్పాలని ప్రొటెం స్పీకర్ సభ్యులకు సూచించారు.
- ప్రమాణం చేయకుండా మిగిలిపోయిన ఎంపీల్లో తృణమూల్ కాంగ్రెస్కు చెందిన శత్రుఘ్నసిన్హా, దీపక్ అధికారి, షేక్ నురుల్ ఇస్లాం, ఎస్పీకి చెందిన అఫ్జల్, జైలు నుంచి గెలుపొందిన స్వతంత్రులు అమృత్పాల్ సింగ్, షేక్ అబ్దుల్ రషీద్ ఉన్నారు.
- మణిపుర్కు చెందిన ఇద్దరు కాంగ్రెస్ ఎంపీల ప్రమాణం సందర్భంగా ఆ పార్టీకే చెందిన ఎంపీలంతా ‘మణిపుర్, మణిపుర్’ అంటూ నినాదాలు చేశారు.
- కాంగ్రెస్కు చెందిన అవుటర్ మణిపుర్ ఎంపీ అల్ఫ్రెడ్ ఎస్ అర్థర్ ప్రమాణం అనంతరం ‘మణిపుర్కు న్యాయం అందించండి..దేశాన్ని కాపాడండి’ అని పేర్కొన్నారు.
- పంజాబ్కు చెందిన పలువురు ఎంపీలు పంజాబీలో, మహారాష్ట్ర సభ్యులు మరాఠీ, హిందీలో, ఒడిశా ఎంపీల్లో అత్యధికులు ఒడియాలోనూ కొందరు ఇంగ్లిష్లోను ప్రమాణాలు చేశారు. ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన ఎంపీల్లో అత్యధికులు రాజ్యాంగ ప్రతిని వెంటబెట్టుకుని ప్రమాణాలు చేశారు.
ఒంటెపై పార్లమెంటుకు వచ్చిన ఎంపీ
రాజస్థాన్కు చెందిన భారత్ ఆదివాసీ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ రాజ్కుమార్ రోత్ ప్రమాణస్వీకారానికి ఒంటెపై పార్లమెంట్కు వచ్చారు. అయితే, పార్లమెంట్ పరిసరాల్లోకి రాగానే ఆయన్ను అక్కడున్న భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఒంటెను ఇంతకంటే ముందుకు అనుమతించడం కుదరదని చెప్పారు. సిబ్బంది తీరుపై ఎంపీ అసహనం వ్యక్తం చేశారు. దీనిపై పార్లమెంట్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానన్నారు. కాంగ్రెస్ మద్దతుతో బాంస్వాడా లోక్సభ స్థానం నుంచి ఆయన విజయం సాధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శిగా విక్రమ్ మిస్రీ నియామకం
ప్రస్తుతం జాతీయ భద్రత ఉపసలహాదారుగా ఉన్న విక్రమ్ మిస్రీ (59) విదేశీ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా శుక్రవారం నియమితులయ్యారు. -
నీట్పై చర్చకు విపక్షాల పట్టు
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్ అక్రమాలపై పార్లమెంటు ఉభయసభలు శుక్రవారం దద్దరిల్లాయి. విపక్షాల ఆందోళనలతో లోక్సభ సోమవారానికి(జులై 1) వాయిదాపడింది. -
హేమంత్ సోరెన్ దోషి అని నమ్మడానికి ఆధారాల్లేవు
భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఐదు నెలలుగా జైలులో ఉన్న ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు భారీ ఊరట లభించింది. -
నీట్-యూజీ పేపర్ లీకు కేసు.. ఝార్ఖండ్లో ప్రిన్సిపల్, వైస్ప్రిన్సిపల్ అరెస్టు
నీట్-యూజీ ప్రశ్నపత్రం లీకు కేసుకు సంబంధించి ఝార్ఖండ్లోని హజారీబాగ్లో ఓ పాఠశాల ప్రిన్సిపల్, వైస్ప్రిన్సిపల్ను సీబీఐ శుక్రవారం అరెస్టు చేసింది. -
పనితీరు బాగోకపోతే ముందస్తుగా పదవీ విరమణ
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కార్యాలయాలూ తమ సిబ్బంది పనితీరుకు సంబంధించిన నివేదికను ప్రతి నెలా 15వ తేదీలోగా అందించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీఓపీటీ) స్పష్టం చేసింది. -
పరీక్షల నిర్వహణకు ఎన్టీఏ కొత్త తేదీల ప్రకటన
ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణలతో జాతీయ పరీక్షల సంస్థ(ఎన్టీఏ) ఇటీవల రద్దుచేసిన పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు శుక్రవారం కొత్త తేదీలను ప్రకటించింది. -
కొత్త నేర న్యాయచట్టాలపై 1న పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక కార్యక్రమాలు
కొత్త నేర న్యాయచట్టాలు అమల్లోకి వచ్చే జులై ఒకటిన దేశవ్యాప్తంగా ఉన్న 17,500 పోలీస్ స్టేషన్లు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నాయి. -
మీడియాలో వాణిజ్య ప్రకటనలకు ‘స్వీయ ధ్రువీకరణ’ అప్పుడే వద్దు
ప్రజలను మోసం చేసే, తప్పుదారి పట్టించే వాణిజ్య ప్రకటనలను నిరోధించే లక్ష్యంతో సుప్రీంకోర్టు సూచన మేరకు అమలులోకి తెచ్చిన ‘స్వీయ ధ్రువీకరణ పత్రం’ సమర్పించే నిబంధనను ప్రస్తుతానికి మెడికల్ ఉత్పత్తులకు మాత్రమే పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాజ్యసభ ఎంపీ కార్తికేయ శర్మ విజ్ఞప్తి చేశారు. -
విమానం మరుగుదొడ్డిలో పొగతాగిన వ్యక్తి అరెస్టు
దేశ రాజధాని దిల్లీ నుంచి ముంబయికి వెళుతున్న ఇండిగో విమానంలోని మరుగుదొడ్డిలో పొగ తాగిన ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి కటకటాల పాలయ్యాడు. -
పరీక్షల విధానంలో సంస్కరణలు.. సలహాల కోసం వెబ్సైట్ ప్రారంభం
నీట్ యూజీ , యూజీసీ నెట్ పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
ప్రాథమిక గణిత ప్రశ్నలపై 80% మంది ఉపాధ్యాయుల్లో తడబాటు
భారత్తోపాటు మధ్య ప్రాచ్య దేశాల్లోని గణిత ఉపాధ్యాయుల్లో దాదాపు 80 శాతం మంది నిష్పత్తి, అనుపాత తార్కికం, బీజ గణితం, ఎస్టిమేషన్, లాజికల్ రీజనింగ్ వంటి ప్రాథమిక భావనల్లో తడబడుతున్నారని ఓ అధ్యయనం తెలిపింది. -
సంక్షిప్త వార్తలు (5)
దేశానికి సంబంధించిన ఏ విషయంపైనా ప్రజాశ్రేయస్సు కోణంలో చర్చ జరగడం లేదు. హిందూ-ముస్లిం, రిజర్వేషన్లకు మద్దతు-వ్యతిరేకం, నాకు నచ్చిన పార్టీ-ప్రత్యర్థి పార్టీ.. ఇలా మన దృష్టికోణం విభజనవాదంతో నిండిపోయింది. -
నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి
వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష ‘నీట్’ నుంచి తమిళనాడును మినహాయించాలని, ఇందుకు కేంద్రం వెంటనే ఆమోదం తెలపాలని శుక్రవారం తమిళనాడు శాసనసభలో ప్రత్యేక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. -
దిల్లీ.. తల్లడిల్లి
భారీ వర్షాలతో దేశ రాజధాని దిల్లీ నగరం అతలాకుతలమైంది. శుక్రవారం తెల్లవారుజామున 3.00 గంటల నుంచి నగరంలో కుండపోత వర్షం మొదలై పలు ప్రాంతాల్లో వరదనీరు ఉప్పొంగింది. -
దిల్లీ విమానాశ్రయ ఘటన.. కేంద్రం కీలక ఆదేశాలు
దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల నిర్మాణాలను క్షుణ్నంగా తనిఖీ చేయాలని పౌర విమానయానశాఖ ఆధ్వర్యంలోని ‘భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ’ ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
నేను మునుపటిలా లేను కానీ..: డిబేట్లో తడబాటు వేళ బైడెన్ ఏమన్నారంటే..?
-
అతడి స్థానంపై కనీసం ప్రశ్నించలేం.. అత్యంత కీలకం: గావస్కర్
-
అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు
-
జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు
-
రజనీకాంత్, కమల్ హాసన్, అర్జున్: ‘సినిమాటిక్ యూనివర్స్’పై శంకర్ ఏమన్నారంటే?
-
పింఛన్దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ