- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Stampede: మట్టి రాసిన మరణ శాసనం.. 121 మంది దుర్మరణం
భోలే బాబా పాద ధూళి కోసం వచ్చిన భక్తులు ఆ మట్టిలోనే కలిసిపోయిన పెను విషాద ఘటన ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్ జిల్లా ఫుల్రయీ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.
భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో తీవ్ర విషాదం
ఆయన పాదధూళి సేకరించే క్రమంలో తొక్కిసలాట
వందల మందికి గాయాలు
ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో దారుణం
ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్ జిల్లా సికంద్రరావ్ ఆసుపత్రి వద్ద మృతదేహాలు.. విలపిస్తున్న బంధువులు
హాథ్రస్: భోలే బాబా పాద ధూళి కోసం వచ్చిన భక్తులు ఆ మట్టిలోనే కలిసిపోయిన పెను విషాద ఘటన ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్ జిల్లా ఫుల్రయీ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో ప్రసిద్ధుడైన భోలే బాబా దర్శనం కోసం ఒక్కసారిగా జనం ఎగబడటంతోపాటు ఆయన పాదాల చుట్టూ ఉన్న మట్టిని సేకరించేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 121 మంది దుర్మరణం పాలయ్యారు. వందల మంది గాయపడ్డారు. మరణించిన వారిలో 108 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఘటనపై ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఒకరిపై ఒకరు పడి..
భోలే బాబా సత్సంగ్ కార్యక్రమాన్ని గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్నారు. మంగళవారం చివరి రోజు కావడంతో ఆయనను దర్శించుకునేందుకు, ఆయన పాదాల చెంత మట్టిని సేకరించి తీసుకెళ్లేందుకు భారీగా భక్తులు వచ్చారు. ఈ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకోవడంతో గాలి ఆడక పలువురు ఒకరిపై ఒకరు పడి మృతి చెందారు. 23 మృతదేహాలను ఎటా జిల్లా ఆసుపత్రికి తరలించారు. మిగిలిన మృతదేహాలను, క్షతగాత్రులను అంబులెన్సులు, కార్లు, ట్రక్కులు, టెంపోల్లో హాథ్రస్లోని సికంద్రరావ్ ట్రామా కేర్ సెంటర్కు తీసుకెళ్లారు. ఆసుపత్రి ఆవరణలో మృతదేహాలను ఉంచడంతో బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ట్రక్కులో ఐదారు మృతదేహాలు ఉండగా ఒక మహిళ కన్నీరు మున్నీరవుతున్న దృశ్యం హృదయ విదారకంగా కనిపించింది.
ఇంటికి వెళ్లే సమయంలో..
సత్సంగ్ను ముగించుకుని సాయంత్రం 3.30 గంటల సమయంలో భక్తులంతా ఇంటికి వెళ్లే సమయంలో ఈ తొక్కిసలాట జరిగిందని, జనమంతా ఒకరిపై ఒకరు పడటంతో ఎక్కువ మంది చనిపోయారని ప్రత్యక్ష సాక్షి శకుంతలా దేవి తెలిపారు. భక్తుల భారీ రద్దీవల్లే తొక్కిసలాట చోటుచేసుకుందని సికంద్రరావ్ ఠాణా అధికారి ఆశిష్ తెలిపారు. సత్సంగ్ నిర్వాహకులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున పరిహారాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.
గంటన్నరలోనే అంతా ముగిసింది
- భోలే బాబా గంటన్నరపాటు ఈ కార్యక్రమంలో గడిపారు. ఆ తర్వాత బయలుదేరిన సమయంలో ఆయన పాదాలను తాకడానికి భక్తులు ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. మైదానం చిత్తడిగా ఉండటంతో మరింత ప్రమాదకరంగా మారిందని సత్సంగ్లో పాల్గొన్న సోను కుమార్ తెలిపారు.
- మైదానాన్ని మించి జనం వచ్చారని, ఏర్పాట్లు అందుకు తగ్గట్లుగా లేవని ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు.
పార్లమెంటులో నివాళి
లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ మాట్లాడుతున్నప్పుడు ఘటన గురించి తెలియడంతో ఆయన వెంటనే సంతాపం ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ‘ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది. కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు యూపీ ప్రభుత్వంతో నిరంతరం టచ్లో ఉన్నారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఈ సభ ద్వారా హామీ ఇస్తున్నా’ అని ప్రధాని పేర్కొన్నారు.
- హృదయం ద్రవించే ఘటన ఇదని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆవేదన వ్యక్తం చేశారు. హాథ్రస్ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు.
- మృతులకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ అధినాయకురాలు మాయావతి తీవ్ర సంతాపం తెలిపారు.
- ‘తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. ‘ఇండియా’ కూటమి శ్రేణులు సహాయక చర్యల్లో భాగం కావాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
ప్రైవేటు కార్యక్రమం కావడంతో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అనుమతి ఇచ్చారు. వేదిక బయట భద్రతను స్థానిక పోలీసులు కల్పించారు. వేదిక లోపల నిర్వాహకులే భద్రతా ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో భక్తులను నియంత్రించడం వారివల్ల కాలేదు.
నేలపైనే మృత దేహాలు
తొక్కిసలాట ఘటనలో చనిపోయిన వారి మృత దేహాలు హాథ్రస్లోని సికంద్రరావ్ ఆసుపత్రి వద్ద నేలపైనే చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. స్పృహ కోల్పోయినవారూ మృతదేహాల పక్కనే పడి ఉన్నారు. గాయపడినవారు ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద నేలపైనే పడుకుని కనిపించారు. వారి చుట్టూ బంధువులు ఉన్నారు. ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేవు. కనీసం ఆక్సిజన్ కూడా లేదు.
ఎవరీ భోలే బాబా?
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్ప్రదేశ్కు చెందిన నారాయణ్ సాకార్ హరి.. అలియాస్ సాకార్ విశ్వ హరి.. ‘భోలే బాబా’గా ప్రసిద్ధి. ఎటా జిల్లా బహదూర్ గ్రామానికి చెందిన ఆయన.. బాల్యంలో తండ్రితో కలిసి వ్యవసాయం చేసేవాడు. గతంలో ఇంటెలిజెన్స్ బ్యూరోలోనూ పని చేసినట్లు చెప్పుకొనేవాడు. 26 ఏళ్ల క్రితమే ఉద్యోగం వదిలేసి ఆధ్యాత్మికబాట పట్టినట్లు ప్రచారం చేసుకున్నాడు. తనకు గురువు అంటూ ఎవరూ లేరని, సమాజ హితం కోసమే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు చెబుతుంటాడు. అలీగఢ్తోపాటు హాథ్రస్ జిల్లాల్లో ప్రతి మంగళవారం సత్సంగ్ పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతుంటారు. వీటికి వేల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. ‘భోలే బాబా’కు పలు రాష్ట్రాల్లో వేల మంది అనుచరులున్నారు. కార్యక్రమాల నిర్వహణకు వాలంటీర్లు ఉంటారు. కొవిడ్ మహమ్మారి విజృంభణ సమయంలోనూ భారీ సంఖ్యలో భక్తులు ఆయన కార్యక్రమాలకు హాజరయ్యారు. తాజాగా ఫుల్రయీ గ్రామంలో సత్సంగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గజరాజులకు అదిరిపోయే డెన్
ఆ ఆరు ఏనుగులకూ అక్కడ రాజభోగాలే... ఉదయమే కాసేపు నడక, వ్యాయామం. 8:30కు అరటి పండ్లు, కొబ్బరి బొండాలు, క్యారెట్, చెరకు గడలు, పుచ్చకాయలతో టిఫిన్. మధ్యాహ్నం గంటన్నర సేపు జలకాలాట. -
132 సీట్లతో విమానం తరహా బస్సులు అందుబాటులోకి తెస్తాం : గడ్కరీ
కాలుష్యం అనేది దేశంలో అతిపెద్ద సమస్యగా మారిందని.. ఈ నేపథ్యంలో వ్యక్తిగత, ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు కాలుష్య రహిత మార్గాలను అన్వేషిస్తున్నామని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. -
అనుమతి 80 వేలమందికి.. హాజరైంది 2.5 లక్షలు
ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య బుధవారానికి 121కి చేరింది. -
గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సినేషను అవసరం
‘‘ఒక కుటుంబంలో తల్లి ప్రాణాలు కోల్పోతే.. ఆసుపత్రి లెక్కలో అది ఒక మరణం. కానీ, ఆ కుటుంబానికి అది తీరని లోటు’’ అని మనసులో నాటుకుపోయేలా తన తండ్రి చెప్పిన మాటలను రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి గుర్తు చేసుకున్నారు. -
సంఘ విద్రోహుల చర్య ఇది.. దర్యాప్తునకు సహకరిస్తా: భోలే బాబా
యూపీలో హాథ్రస్ దుర్ఘటన జరిగిన ఒకరోజు అనంతరం దానిపై భోలే బాబా స్పందించాడు. తాను ఆ వేదిక నుంచి వెళ్లిపోయిన చాలా సమయం తర్వాతే ఆ తొక్కిసలాట చోటుచేసుకుందన్నాడు. -
మళ్లీ ఆస్పత్రిలో చేరిన ఆడ్వాణీ
భాజపా దిగ్గజ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్.కె.ఆడ్వాణీ (96) బుధవారం రాత్రి దిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత వారం ఎయిమ్స్లో చేరి చికిత్స పొందిన విషయం తెలిసిందే. -
సూరజ్ పాలే భోలే బాబా!
అతడు తన చేతితో నీరు ఇస్తే సమస్యలు తీరుతాయట.. అతడు అడుగుపెట్టిన చోట మట్టిని తాకినా ఆశీర్వాదం అట.. ఉత్తరప్రదేశ్కు చెందిన ‘భోలే బాబా’ను అనుసరించేవారి నమ్మిక ఇది. -
రుతుపవనాల సమయంలోనూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
రుతుపవనాల సమయంలో తీవ్రమైన తేమతో కూడిన వేడికి గురవుతున్న వారి సంఖ్య భారత్లో క్రమంగా పెరుగుతోందని తాజా అధ్యయనం పేర్కొంది. ఈ రకమైన వాతావరణ ప్రభావానికి గురవతున్న వారి సంఖ్య 1951-2020 మధ్యకాలంలో 67 కోట్లకు చేరిందని తెలిపింది. -
కొవిడ్లో 3% అధికంగా.. బరువు తక్కువ శిశు జననాలు
భారత్లో కొవిడ్ మహమ్మారి సమయంలో బరువు తక్కువ శిశువుల జననాలు 3 శాతం అధికంగా నమోదైనట్లు ఓ అధ్యయనం పేర్కొంది. -
మణిపుర్ ప్రభుత్వాన్ని విశ్వసించలేం
జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడికిన మణిపుర్లోని రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆ రాష్ట్ర సర్కారును విశ్వసించలేమంటూ జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం బుధవారం మండిపడింది. -
వందేభారత్ రైలులో వర్షపునీటి లీకేజీ
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సెమీహైస్పీడ్ వందేభారత్ రైళ్లలోని సౌకర్యాలపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. -
బిహార్లో ఒకే రోజు కుప్పకూలిన 3 వంతెనలు
నిర్మాణంలో ఉన్నవి..వినియోగంలో ఉన్నవి.. పాతవి అనే తేడా లేకుండా బిహార్లో వంతెనలు కుప్పకూలుతూనే ఉన్నాయి. బుధవారం ఏకంగా మూడు వారధులు నేలమట్టమయ్యాయి. -
రాహుల్గాంధీ నివాసం వద్ద భద్రతా సిబ్బంది సంఖ్య పెంపు
మితవాద గ్రూపులు దాడి చేయవచ్చన్న నిఘా వర్గాల సమాచారంతో దిల్లీలోని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాసం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఝార్ఖండ్ సీఎంగా మళ్లీ హేమంత్ సోరెన్!
జేఎంఎం నేత హేమంత్ సోరెన్ ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా మూడోసారి పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుత ముఖ్యమంత్రి చంపయీ సోరెన్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. -
నీట్ అక్రమాలపై శిరోముండనంతో నిరసన
‘ఇండియా’ కూటమి పార్టీలకు చెందిన విద్యార్థి సంఘాలు పోటీ పరీక్షల్లో అక్రమాలను నిరసిస్తూ బుధవారం దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించాయి. -
సంక్షిప్త వార్తలు
ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, అరుణాచల్ప్రదేశ్, మణిపుర్లను వరదలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రాల్లోని నదుల్లో నీటిమట్టాలు ప్రమాదకర స్థాయికి చేరడంతో వరద ఉద్ధృతి పెరిగింది. -
ఐదుగురు నిపుణుల కమిటీని నియమించండి
హాథ్రస్ ఘటనపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పర్యవేక్షణలో ఐదుగురు నిపుణులతో ప్రత్యేక కమిటీని నియమించాలంటూ బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. -
మీ మానసిక పరిస్థితి బాగానే ఉందా!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, జ్యోతిరాదిత్య సింధియా 2018లో తాను పైలట్గా ఉన్న ఎయిరిండియా విమానం కూల్చివేసి, జాతీయ భద్రతను అస్థిరపరచాలని ప్రయత్నించినట్లు కెప్టెన్ దీపక్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ను దిల్లీ హైకోర్టు ధర్మాసనం బుధవారం కొట్టివేసింది. -
కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై 5న హైకోర్టులో విచారణ
మద్యం కుంభకోణానికి సంబంధించి సీబీఐ మోపిన అవినీతి కేసులో దిల్లీ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్పై హైకోర్టు ఈ నెల 5న విచారణ జరపనుంది. -
దేశాల సమన్వయంతోనే గ్రహాల రక్షణ వ్యవస్థ: ఇస్రో ఛైర్మన్ సోమనాథ్
అంతరిక్షంలో పరిభ్రమిస్తున్న గ్రహశకలాల (ఆస్టరాయిడ్స్) నుంచి భూమి సహా ఇతర గ్రహాలను రక్షించే వ్యవస్థను ఏ దేశమూ ఒంటరిగా రూపొందించలేదని ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ అన్నారు. -
ఏనుగుల కోసం ప్రత్యేక రెస్టారంట్, ప్లే గ్రౌండ్.. ఎక్కడో తెలుసా?
ఒడిశా అటవీ శాఖ ఏనుగుల కోసం వాటి శిక్షణా కేంద్రంలో సకల సౌకర్యాలు కల్పించింది. రెస్టారంట్, బాతింగ్ ఏరియాతో పాటు అనేక సదుపాయాలు సమకూర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
వరంగల్ నిట్ విద్యార్థికి రూ.88 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ
-
ఉద్యోగులు పనివేళలు పాటించాల్సిందే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వంచకుడు అంజాద్పై కేసు.. పెళ్లి చేసుకుంటానని బలవంతాన తీసుకెళ్లినట్లు తేజస్విని స్టేట్మెంట్
-
జగన్ రంగుల మాయకు రూ.కోట్ల ఖర్చు!
-
గురువెక్కడో మేమూ అక్కడే.. ఆయన వెళ్లిన పాఠశాలలోనే చేరిన 133 మంది విద్యార్థులు