- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. పోలవరాన్ని చూస్తే నా కళ్ల వెంట నీళ్లొచ్చాయి: సీఎం చంద్రబాబు
పోలవరాన్ని జగన్ గోదావరిలో ముంచారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం కంటే జగన్ చేసిన నష్టమే ఎక్కువన్నారు. పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. గత ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించిన పురోగతిని రాష్ట్ర ప్రజల ముందుంచిన ఆయన.. పోలవరాన్ని చూస్తే తన కళ్లవెంట నీళ్లొచ్చాయన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. భారాసకు మరో షాక్.. కాంగ్రెస్లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే
భారత రాష్ట్ర సమితి (భారాస)కు మరో షాక్ తగిలింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. దిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, తెలంగాణ మాజీ స్పీకర్, భారాస బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి హస్తం గూటికి చేరిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. పీవీ సేవలను తెలుగు జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది: మంత్రి కోమటిరెడ్డి
దివంగత ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలను తెలుగు జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నేత అని చెప్పుకోవడాన్ని గర్వంగా భావిస్తున్నామని చెప్పారు. పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా హైదరాబాద్లోని పీవీ ఘాట్లో మంత్రి సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. కార్యకర్తల సంక్షేమానికి కృషి చేస్తా: తెదేపా ఏపీ అధ్యక్షుడు పల్లా
తెదేపా ఏపీ అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించి ప్రభుత్వంలో భాగం చేయడమే ప్రధాన కర్తవ్యంగా పనిచేస్తానన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ఏయూ వీసీ ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్ రాజీనామా
ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్ స్టీఫెన్సన్ తమ పదవులకు రాజీనామా చేశారు. ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్గా ప్రొ. కిశోర్బాబు బాధ్యతలు స్వీకరించారు. గత ఐదేళ్లలో ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి యూనివర్సిటీని భ్రష్టు పట్టించారంటూ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. పరీక్షల విధానంలో సంస్కరణలు.. సలహాల కోసం వెబ్సైట్ ప్రారంభం
పరీక్షల నిర్వహణ విభాగం ఎన్టీఏలో సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం విద్యార్థులు, తల్లిదండ్రులు సూచనలు కోరింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన https://innovateindia.mygov.in/examination-reforms-nta/ వెబ్సైట్ ద్వారా తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయవచ్చని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. సభలో రాహుల్ గాంధీ మైక్ మ్యూట్ చేశారు.. కాంగ్రెస్ ఆరోపణలు
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ‘నీట్ పేపర్ లీక్’ వ్యవహారంపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. దానికిముందు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ అంశం లేవనెత్తగానే మైక్ ఆపేశారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈమేరకు ఎక్స్ (ట్విటర్) వేదికగా ఒక వీడియోను షేర్ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ₹21 లక్షల కోట్లకు రిలయన్స్ మార్కెట్ క్యాప్.. తొలి భారతీయ కంపెనీగా చరిత్ర
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ మరోసారి అరుదైన ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా రూ.21 లక్షల కోట్లతో సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్ నిలిచింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. దక్షిణాఫ్రికా మహిళా జట్టుతో ఏకైక టెస్టు.. భారత ఓపెనర్ల సరికొత్త రికార్డు
భారత మహిళా క్రికెటర్లు చరిత్ర సృష్టించారు. టెస్టుల్లో తొలి వికెట్కు రికార్డు భాగస్వామ్యం నమోదు చేసిన ఘనతను ఖాతాలో వేసుకున్నారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో స్మృతి మంధాన (149), షఫాలీ వర్మ (128*) సెంచరీలు బాదేశారు. దీంతో తొలి వికెట్కు 292 పరుగులు (52 ఓవర్లలో) జోడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కొద్దిసేపు ఎమర్జెన్సీ.. సురక్షిత స్థానాలకు వ్యోమగాములు
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇటీవల కొద్దిసేపు ఎమర్జెన్సీ నెలకొంది. దీంతో వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్లు తప్పనిసరిగా బోయింగ్ స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో తలదాచుకోవాల్సి వచ్చింది. ఐఎస్ఎస్కు అత్యంత సమీపంలో భారీగా ఉపగ్రహ వ్యర్థాలు సంచరించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
పోలవరానికి అంతర్జాతీయ నిపుణులు.. సాంకేతిక సవాళ్లను అధిగమించే ప్రయత్నం
పోలవరం ప్రాజెక్టులో కీలక సాంకేతిక సవాళ్లను అధిగమించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. -
హైదరాబాద్లో పలుచోట్ల వర్షం.. తడిసి ముద్దయిన జనం
నగరంలోని పలు చోట్ల ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. -
ప్రధాని మోదీతో కలిసి అరకు కాఫీని ఆస్వాదించేందుకు ఎదురు చూస్తున్నా: చంద్రబాబు
ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి మరోసారి అరకు కాఫీ ఆస్వాదించేందుకు ఎదురు చూస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. -
వైకాపా ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల డీఎస్సీ ప్రకటన రద్దు
గత ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల డీఎస్సీ ప్రకటనను రద్దు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
సీఎం చంద్రబాబు అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రా
ముఖ్యమంత్రి చంద్రబాబు అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రాను నియమిస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. -
విభజన హామీల అమలుకు తెలుగురాష్ట్రాలు కలిసి పోరాడాలి: మంత్రి పొన్నం
రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విభజన హామీల అమలు కోసం కలిసి పోరాడాలని తెలంగాణ మంత్రి పొన్న ప్రభాకర్ అన్నారు. -
విశాఖ నుంచే ఉచిత బస్సు పథకం ప్రారంభిస్తాం: రవాణా మంత్రి రామ్ప్రసాద్రెడ్డి
విశాఖ నుంచే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని, త్వరలోనే మహిళలకు తీపి కబురు చెబుతామని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్రెడ్డి తెలిపారు. -
ఇంద్రకీలాద్రిపై తొలిసారి వారాహి ఉత్సవాలు: ఈవో రామారావు
ఇంద్రకీలాద్రిపై తొలిసారి వారాహి ఉత్సవాలను నిర్వహించనున్నారు. జులై 6 నుంచి 15 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయని శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం ఈవో రామారావు తెలిపారు. -
స్మార్ట్ సిటీ మిషన్ గడువు పొడిగించిన కేంద్రం
తెలంగాణలో స్మార్ట్ సిటీ మిషన్ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. -
తితిదే ఈవో ఆగ్రహం.. అందుబాటులోకి గత పాలకమండలి తీర్మానాలు
తితిదే పాలనలో పారదర్శకత తీసుకొచ్చేందుకు ఈవో శ్యామలరావు చర్యలు చేపట్టారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వెంకయ్యనాయుడి వాగ్ధాటి ముందు ఎవరూ నిలవలేరు: ప్రధాని మోదీ
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గ్రామస్థాయి నుంచి వచ్చి ఉన్నత స్థానానికి ఎదిగారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. -
డీఎస్ కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుంది: సీఎం రేవంత్రెడ్డి
కాంగ్రెస్ పార్టీకి డి.శ్రీనివాస్ (డీఎస్) ఎంతో సేవ చేశారని.. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) అన్నారు. -
పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ జలవనరుల నిపుణులు పరిశీలించారు. అమెరికా, కెనడా నుంచి వచ్చిన నలుగురు నిపుణులు.. ఆదివారం ఉదయం ప్రాజెక్టు వద్దకు చేరుకుని అక్కడి పరిసరాలను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. -
బొటానికల్ గార్డెన్లో రామోజీరావు సంస్మరణ సభ
కొండాపూర్ బొటానికల్ గార్డెన్లో రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ప్రపంచకప్ పూనకాలు.. సచివాలయం వద్ద సంబరాలు ఇవీ..
హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై పెద్ద ఎత్తున చేరుకున్న క్రికెట్ అభిమానులు కేరింతలు కొట్టారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/06/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రభుత్వ మద్యంలో ‘కిక్’ లేకపోవడంతోనే.. మంత్రి వ్యాఖ్యలపై దుమారం!
-
టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్.. హాట్స్టార్లో వ్యూయర్షిప్ ఎంతంటే?
-
పిఠాపురంలో పవన్ పర్యటన.. అభిమానుల భారీ ఏర్పాట్లు
-
జలపాతం సందర్శనకు వెళ్లి.. ఒకే కుటుంబంలో అయిదుగురు గల్లంతు!
-
మోదీ బర్త్డే వేళ ‘సుభద్ర యోజన’ ప్రారంభం: ఒడిశా సీఎం
-
అర్జునుడిగా నేను.. ప్రభాస్ కర్ణుడు.. అలాగే చూడండి: విజయ్ దేవరకొండ