- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. రామోజీరావు సంస్మరణ సభ..
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత దివంగత రామోజీరావు (Ramoji Rao) సంస్మరణ సభకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేసింది. రామోజీరావు సంస్మరణ సభకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ప్రత్యక్షప్రసారం కోసం క్లిక్ చేయండి
2. ఫిరాయింపులపై మాట్లాడే నైతికత కేసీఆర్కు లేదు: సీఎం రేవంత్రెడ్డి
దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడారు. ‘‘పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతికత కేసీఆర్కు లేదు. దానికి పునాది వేసింది కేసీఆరే. గతంలో 61 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆయన లాక్కున్నారు. ఆ విషయం ఆయనకు గుర్తులేదా?’’ అని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. కక్ష సాధింపు ఉంటే.. ఇంతకాలం ఆగుతామా?: ఏపీ హోంమంత్రి అనిత
‘రెడ్ బుక్’ కక్ష సాధింపు చర్యలకు కాదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన అధికారులపై చట్టపరంగా చర్యలుంటాయని చెప్పారు. తమకు కక్ష సాధింపు ఉంటే.. ఇంతకాలం ఆగుతామా?అని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. సీఎస్ నీరభ్కుమార్ ప్రసాద్ పదవీకాలం పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ సీఎస్ నీరభ్కుమార్ ప్రసాద్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. జులై 1 నుంచి డిసెంబర్ 31 వరకు సర్వీసును పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం సీఎస్గా నీరభ్కుమార్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డికి షాక్
వైకాపా నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గట్టి షాక్ తగిలింది. సొంత నియోజవర్గం పుంగనూరులో మున్సిపల్ ఛైర్మన్ అలీంబాషాతో పాటు 11 మంది కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. స్థానిక తెదేపా ఇన్ఛార్జ్ చల్లా బాబు ఇంటి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఈ మేరకు వెల్లడించారు. త్వరలో వారంతా తెదేపాలో చేరనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. నీట్ పేపర్ లీక్ కేసులో అరెస్టులు మొదలుపెట్టిన సీబీఐ
నీట్-యూజీ 2024 పరీక్ష పేపర్ లీక్ కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. దీనికి సంబంధించి అరెస్టులు మొదలుపెట్టింది. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న మనీశ్ ప్రకాశ్, అశుతోష్ను బిహార్లోని పట్నాలో అదుపులోకి తీసుకొంది. ఈ కేసులో లీకైన పేపర్ను పొందిన విద్యార్థులను మనీశ్ తన కారులోనే తరలించినట్లు గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. రెండేళ్ల తర్వాత దేశంలో తగ్గిన గృహ విక్రయాలు
దేశంలో గృహ విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే 8 శాతం విక్రయాలు క్షీణించాయి. ఇళ్ల విక్రయాల్లో తగ్గుదల నమోదుకావడం రెండేళ్లలో ఇదే తొలిసారి అని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అన్రాక్ తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. దేశవ్యాప్తంగా బుల్లెట్ రైళ్లు.. సాధ్యాసాధ్యాలపై త్వరలో అధ్యయనం..!
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేడు పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో బుల్లెట్ రైళ్ల గురించి ప్రస్తావించారు. ‘‘నా ప్రభుత్వం దేశవ్యాప్తంగా బుల్లెట్ రైల్ కారిడార్లను విస్తరించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేపట్టనుంది. తూర్పు, దక్షిణ, ఉత్తర ప్రాంతాల్లో ఇవి జరగనున్నాయి’’ అని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. సూచీల రికార్డుల పరుగు.. సెన్సెక్స్@ 79000.. నిఫ్టీ@ 24000
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల ర్యాలీ కొనసాగుతోంది. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు తర్వాత పుంజుకొని సరికొత్త రికార్డులను తిరగరాశాయి. వరుసగా కొత్త జీవనకాల గరిష్ఠాలను నెలకొల్పుతూ వస్తున్న సూచీలు.. మరో కీలక మైలురాయిని అధిగమించాయి. సెన్సెక్స్ 79 వేలు, నిఫ్టీ 24 వేల పాయింట్ల మార్కును దాటాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. అందరి దృష్టి రెండో సెమీఫైనల్పైనే .. వాతావరణం లేటెస్ట్ అప్డేట్
టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్-2లో భారత్-ఇంగ్లాండ్ పోటీపడనున్నాయి. మరికొన్ని గంటల్లో ప్రారంభమయ్యే ఈ మ్యాచ్కు వర్షం గండం పొంచి ఉండటం మరింత ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటివరకు వాతావరణం పొడిగానే ఉన్నా మ్యాచ్ ప్రారంభమయ్యేసరికి చిరుజల్లులు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు మాజీ మంత్రి జగదీశ్రెడ్డి లేఖ
భారాస హయాంలో నిర్మించిన విద్యుత్ ప్లాంట్లు, విద్యుత్ కొనుగోళ్ల విషయంపై విచారణ జరుపుతోన్న జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు మాజీ మంత్రి జగదీశ్రెడ్డి లేఖ రాశారు. -
ఎస్సీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు మరోసారి అవకాశం
తెలంగాణలోని ఎస్సీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు మరోసారి అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. -
విజయవాడ-జగదల్పూర్ హైవేలో మార్పులు కోరాం: మంత్రి తుమ్మల
విజయవాడ-జగదల్పూర్ హైవే విషయంలో కొన్ని మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీలో రసాభాస
ఖైరతాబాద్ మండల కార్యాలయంలో బోరబండ, రెహమత్నగర్ డివిజన్లకు చెందిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ శనివారం జరిగింది. -
పీసీ ఘోష్ కమిషన్ విచారణ గడువు పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ గడువును మరో రెండు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ గెజిట్ జారీ
అమరావతి ప్రాంతంలో చేపట్టనున్న ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ గెజిట్ జారీ చేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న పవన్ కల్యాణ్..
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్కల్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. -
చంద్రబాబు కార్యసాధకుడు.. అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తారు: సుమన్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యసాధకుడు అని ప్రముఖ సినీ నటుడు సుమన్ కొనియాడారు. -
ఏయూలో జరిగిన అవినీతిపై న్యాయవిచారణ చేయిస్తాం: సి.ఎం.రమేశ్
వీసీ ప్రసాదరెడ్డి రాజీనామాతో ఆంధ్రా వర్సిటీలో విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు. విశ్వవిద్యాలయానికి పూర్వ విద్యార్థులు భారీగా చేరుకుంటున్నారు. -
జీఏడీకి రిపోర్టు చేయండి.. ముగ్గురు అఖిల భారత సర్వీసు అధికారులకు ఏపీ ప్రభుత్వ ఆదేశాలు
ముగ్గురు అఖిల భారత సర్వీసు అధికారులను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. -
పింఛన్దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్దారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
డీఎస్ మృతిపట్ల తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం
కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్లో డీఎస్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. -
ఊదమంటే.. బ్రీత్ ఎనలైజర్ లాక్కెళ్లాడు!
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసుల ఏమరుపాటును అదనుగా తీసుకున్న ఓ వాహనదారుడు బ్రీత్ ఎనలైజర్ను లాక్కుని వెళ్లాడు. -
కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. -
లింకు నొక్కారో.. ఖాతా ఖాళీ
పీఎంకిసాన్ పథకంలో భాగంగా.. కేంద్ర ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకుని డబ్బులు వచ్చాయా లేదా తెలుసుకోవచ్చని సైబర్ నేరగాళ్లు తప్పుడు లింకులు పంపుతున్నారు. -
యూజీసీ నెట్-2024 పరీక్ష కొత్త తేదీలను ప్రకటించిన ఎన్టీఏ
యూజీసీ నెట్ పరీక్ష కొత్త తేదీలను జాతీయ పరీక్ష సంస్థ (NTA) ప్రకటించింది. ఈ సారి పెన్ను పేపర్ విధానంలో కాకుండా కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. -
విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి
బాగా చదువుకున్నవారు రాజకీయాల్లోకి రావాలని తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, ప్రముఖ నటుడు విజయ్ కోరారు. మంచి నాయకులు కావాలా, వద్దా అనేది విద్యార్థులే నిర్ణయించుకోవాలని సూచించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
భారత బ్యాటర్లు షంసీని టార్గెట్ చేస్తే చాలు: ఉతప్ప
-
వామ్మో.. ఇదేం మోసం.. ‘డేటింగ్ యాప్’ మాయలో సివిల్స్ అభ్యర్థి
-
మా బావ ప్రభాస్కు అభినందనలు: మోహన్బాబు ట్వీట్ వైరల్
-
హైదరాబాద్తో సమానంగా వరంగల్ అభివృద్ధి: సీఎం రేవంత్
-
‘ఈనాడు’ అంటే ప్రజలకు అంత నమ్మకం: పరుచూరి గోపాలకృష్ణ
-
దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టు.. రెండో రోజు ముగిసిన ఆట