- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ గవర్నర్
ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu)ను తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ కలిశారు. ఉండవల్లిలోని ఆయన నివాసానికి వచ్చి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు, పెండింగ్ అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. పూర్తి కథనం
2. నేడు పోలవరంపై శ్వేతపత్రం.. విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరంపై ఏపీ ప్రభుత్వం నేడు శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఏడు ప్రభుత్వశాఖల్లో స్థితిగతులపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం పోలవరంపై సీఎం చంద్రబాబు (Chandrababu) శ్వేతపత్రం విడుదల చేసి వివరాలను వెల్లడించనున్నారు. పూర్తి కథనం
3. ఓటీటీలోకి కాజల్ ‘సత్యభామ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
కాజల్ అగర్వాల్ (kajal aggarwal) పోలీసు ఆఫీసర్గా నటించిన చిత్రం ‘సత్యభామ’ (Satyabhama). సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో రూపొందిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చి మెప్పించింది. ఇప్పుడీ సినిమా సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది. పూర్తి కథనం
4. దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టు.. భారత ఓపెనర్లు అదుర్స్
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక తొలి టెస్టు మ్యాచ్లో భారత (IND w Vs SA w) అమ్మాయిలు శుభారంభం చేశారు. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టు తొలి రోజు లంచ్ బ్రేక్ సమయానికి వికెట్ నష్టపోకుండా 130 పరుగులు చేసింది. పూర్తి కథనం
5. రోహిత్ శర్మ.. తొలి కెప్టెన్గా రికార్డు
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే సారథిగా 5000+ పరుగులు చేసిన అతడు.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్గా నిలిచాడు. పూర్తి కథనం
6. ఆరంభంలోనే రికార్డు గరిష్ఠాలకు సూచీలు.. నిఫ్టీ @ 24,120
అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో రెండు ప్రధాన సూచీలు ఆరంభంలోనే రికార్డు గరిష్ఠాలను తాకాయి. ఉదయం 9:29 గంటల సమయంలో సెన్సెక్స్ 253 పాయింట్ల లాభంతో 79,496 వద్ద ట్రేడవుతోంది. పూర్తి కథనం
7. ‘నీట్’పై చర్చకు విపక్షాల పట్టు.. లోక్సభ సోమవారానికి వాయిదా
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ‘నీట్ పేపర్ లీక్ (NEET Paper Leak)’ వ్యవహారం దుమారం రేపుతోంది. దీనిపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో లోక్సభ (Lok Sabha), రాజ్యసభల్లో శుక్రవారం గందరగోళ వాతావరణం నెలకొంది. పూర్తి కథనం
8. దిల్లీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాలు జల దిగ్బంధం..!
దేశ రాజధాని దిల్లీలో భారీ వర్షాలు (Delhi rainfall) కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లోకి పెద్ద మొత్తంలో వరదనీరు వచ్చి చేరింది. గత 24 గంటల్లో సఫ్దార్జంగ్లో 228.1 మిల్లీమీటర్ల వాన పడింది. నిన్న రాత్రి కేవలం 3 గంటల వ్యవధిలో 148.5 మి.మీ. కురిసింది. పూర్తి కథనం
9. భూ కుంభకోణం కేసు.. మాజీ సీఎం హేమంత్ సోరెన్కు బెయిల్
భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఝార్ఖండ్ (Jharkhand) మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren)కు ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు రాష్ట్ర హైకోర్టు శుక్రవారం బెయిల్ (Bail) మంజూరుచేసింది. పూర్తి కథనం
10. స్త్రీ, పురుషులిద్దరూ సమానమే కానీ.. : లింగ సమానత్వంపై సుధామూర్తి ఏమన్నారంటే..?
ఇన్ఫోసిస్ (Infosys) సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి, వితరణశీలిగా పేరుగాంచిన సుధామూర్తి (Sudha Murty) లింగ సమానత్వంపై తన అభిప్రాయం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు. పూర్తి కథనం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జులై 4న దిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జులై 4న దిల్లీకి వెళ్లనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన హస్తిన పర్యటనకు వెళ్తున్నారు. -
ఏఎన్యూ వీసీ రాజీనామా.. వర్సిటీలో సంబరాలు
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్యూ) వీసీ రాజశేఖర్ ఎట్టకేలకు పదవి నుంచి తప్పుకొన్నారు. -
గవర్నర్ సీపీ రాధాకృష్ణన్తో సీఎం రేవంత్రెడ్డి భేటీ
రాజ్భవన్లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్తో సీఎం రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న వివిధ బిల్లులపై గవర్నర్తో చర్చించారు. -
ప్రొద్దుటూరులో పింఛను డబ్బు మాయం.. ఘటనపై పోలీసుల అనుమానం!
వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఏడో వార్డు సచివాలయం పరిధిలో పింఛను డబ్బు మాయమైంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీలో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం
ఏపీలో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి 7వ తేదీ వరకు ప్రాసెసింగ్ ఫీజు, రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. -
కేసీఆర్కు హైకోర్టులో చుక్కెదురు
భారాస అధినేత కేసీఆర్కు హైకోర్టులో చుక్కెదురైంది. విద్యుత్ కమిషన్ ఏర్పాటును రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం కొట్టేసింది. -
మొరాయించిన శ్రీశైలం దేవస్థానం వెబ్సైట్.. నిలిచిన ఆన్లైన్ టికెట్ల జారీ
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం వెబ్సైట్ మొరాయించింది. ఆదివారం సాయంత్రం నుంచి ఆలయ వెబ్సైట్ పనిచేయడం లేదు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం: సీఎం చంద్రబాబు
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమమని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
ఏపీలో పింఛన్ల పండుగ.. లబ్ధిదారుకు స్వయంగా అందజేసిన సీఎం చంద్రబాబు
ఏపీలో ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.7,000 పింఛను మొత్తాన్ని అర్హులకు అందిస్తోంది. -
ఈ ఊరు.. వైద్యుల పుట్టినిల్లు..!
ఏళ్ల కిందట ఆ గ్రామం కూడా ఓ మారుమూల పల్లెటూరే. వ్యవసాయం చేసుకుని.. కూలీ పనులకు వెళ్లి కుటుంబాలను పోషించుకునేవారు. కష్టాన్నే నమ్ముకుని జీవించేవారు. -
అంటకాగారు... ఆస్తులు అంటగట్టారు!
జిల్లా పరిషత్ కార్యనిర్వహణాధికారి (సీఈవో) సుధాకర్రెడ్డి గత అయిదేళ్లుగా వైకాపాతో అంటకాగుతూ ప్రభుత్వ ఆస్తులను, ప్రజాధనాన్ని ఆ పార్టీ నేతలకు ధారాదత్తం చేసేశారు. -
దాహం తీరాలంటే.. సరిహద్దు దాటాల్సిందే
వేసవిలో ఏటా తాగునీటి సమస్యలు తలెత్తడం సర్వసాధారణం. కానీ వర్షాకాలం మొదలైనా.. పల్లెలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. పశ్చిమ ప్రాంతంలో గుక్కెడు నీటి కోసం గ్రామీణులు అల్లాడుతున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.