- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. ‘గేమ్ ఛేంజర్’ అప్డేట్ ఇచ్చిన శంకర్.. ఎన్ని రోజులు షూటింగ్ ఉందంటే!
రామ్చరణ్ - శంకర్ల (Shankar) కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). ఈ చిత్రం నుంచి అప్డేట్ వచ్చి చాలా రోజులవుతోంది. తాజాగా దర్శకుడు శంకర్ దీనిపై అప్డేట్ ఇచ్చారు. ‘ఇండియన్ 2’ ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఇంటర్య్వూలో ‘గేమ్ ఛేంజర్’ గురించి మాట్లాడారు. పూర్తి కథనం
2. ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్.. ప్రసాద్ ఐమాక్స్ వద్ద ఫ్యాన్స్ సందడి
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) రిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని ప్రసాద్ ఐమాక్స్ వద్ద సందడి నెలకొంది. సినిమా చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పూర్తి కథనం
3. వినుకొండలో చెట్టును ఢీకొట్టిన కారు.. ముగ్గురి మృతి
పల్నాడు జిల్లా వినుకొండ సమీపంలోని కొత్తపాలెం వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అనంతపురం-గుంటూరు జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఇన్నోవా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. పూర్తి కథనం
4. ఇది సమష్టి విజయం.. ఫైనల్ కోసం భయం లేదు: మార్క్రమ్
టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024) చరిత్రలో తొలిసారి దక్షిణాఫ్రికా (South Africa) ఫైనల్కు చేరింది. సెమీఫైనల్ మ్యాచ్లో ప్రత్యర్థి అఫ్గానిస్థాన్ను (Afghanistan) చిత్తుచిత్తుగా ఓడించింది. 57 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి ఛేదించింది. పూర్తి కథనం
5. మన్యం జిల్లాలో ఆగని ఏనుగుల మృత్యుఘోష
విద్యుదాఘాతానికి గురై కొన్ని.. అనారోగ్యంతో మరికొన్ని.. ఆహారం దొరక్క ఇంకొన్ని.. ఇలా కారణం ఏదైనా పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల మృత్యుఘోష కొనసాగుతోంది. ఏళ్లు గడుస్తున్నా ఏనుగుల సంరక్షణపై కేంద్రం ప్రతిపాదనలు ఆచరణలోకి రాకపోవడంపై జంతుప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి కథనం
6. అందరి దృష్టీ రెండో సెమీఫైనల్పైనే .. వాతావరణం లేటెస్ట్ అప్డేట్
టీ20 ప్రపంచకప్ (T20 Worldcup 2024) సెమీఫైనల్-1లో విజయం సాధించిన దక్షిణాఫ్రికా (SouthAfrica) ఫైనల్లోకి అడుగుపెట్టింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టీ ఇవాళ రాత్రి 8 గంటలకు (భారత్ కాలమానం ప్రకారం) భారత్-ఇంగ్లాండ్ల మధ్య జరిగే సెమీఫైనల్-2పైనే ఉంది. పూర్తి కథనం
7. కేరళలో భారీ వర్షం.. ఇళ్లల్లోకి దూసుకొచ్చిన సముద్రం
కేరళలో కురుస్తున్న భారీ వర్షాల ధాటికి సముద్రం ముందుకు వచ్చింది. అలల తాకిడికి తీర ప్రాంతాల్లోని పలు నివాసాలు నీట మునిగాయి.
8. ఇండియా సిమెంట్స్లో అల్ట్రాటెక్కు 23% వాటా.. ఒప్పంద విలువ ₹1,885 కోట్లు
భారత సిమెంట్ తయారీ పరిశ్రమలో మరో కీలక ఒప్పందం ఖరారైంది. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఇండియా సిమెంట్స్ లిమిటెడ్లో (India Cements Ltd) 23 శాతం వాటాలు కొనుగోలు చేయనున్నట్లు అల్ట్రాటెక్ సిమెంట్ (UltraTech Cement) గురువారం ప్రకటించింది. ఈ కొనుగోలు ఒప్పందం విలువ రూ.1,885 కోట్లని వెల్లడించింది. పూర్తి కథనం
9. విరాట్ - రోహిత్లకు ముప్పు పొంచి ఉందిలా..!
టీమ్ఇండియా బ్యాటింగ్కు వారు వెన్నెముక. వారిలో ఒక్కరు చెలరేగినా ప్రత్యర్థి జట్లు గెలుపుపై ఆశలు వదలుకోవాల్సిందే. ఏ బౌలర్పైన అయినా గురిపెట్టారో అతడు కెరీర్ చరమాంకానికి చేరాల్సిందే. వారే రోహిత్ - విరాట్ (Virat & Rohit). వీరిద్దరూ పొట్టి ప్రపంచకప్ (ICC Mens T20 World Cup) టీమ్ ఇండియా ఓపెనర్లుగా వస్తున్నారు. పూర్తి కథనం
10. పాక్ ఎన్నికలపై దర్యాప్తునకు అమెరికా ప్రతినిధుల సభ తీర్మానం
పాకిస్థాన్లో జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికలపై (Pak Elections) సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ అమెరికా ప్రతినిధుల సభ తీర్మానం చేసింది. దీన్ని రెండు ప్రధాన పార్టీలు దాదాపు ఏకగ్రీవంగా ఆమోదించాయి. పూర్తి కథనం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీలో రసాభాస
ఖైరతాబాద్ మండల కార్యాలయంలో బోరబండ, రెహమత్నగర్ డివిజన్లకు చెందిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ శనివారం జరిగింది. -
పీసీ ఘోష్ కమిషన్ విచారణ గడువు పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ గడువును మరో రెండు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ గెజిట్ జారీ
అమరావతి ప్రాంతంలో చేపట్టనున్న ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ గెజిట్ జారీ చేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న పవన్ కల్యాణ్..
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్కల్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. -
చంద్రబాబు కార్యసాధకుడు.. అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తారు: సుమన్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యసాధకుడు అని ప్రముఖ సినీ నటుడు సుమన్ కొనియాడారు. -
ఏయూలో జరిగిన అవినీతిపై న్యాయవిచారణ చేయిస్తాం: సి.ఎం.రమేశ్
వీసీ ప్రసాదరెడ్డి రాజీనామాతో ఆంధ్రా వర్సిటీలో విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు. విశ్వవిద్యాలయానికి పూర్వ విద్యార్థులు భారీగా చేరుకుంటున్నారు. -
జీఏడీకి రిపోర్టు చేయండి.. ముగ్గురు అఖిల భారత సర్వీసు అధికారులకు ఏపీ ప్రభుత్వ ఆదేశాలు
ముగ్గురు అఖిల భారత సర్వీసు అధికారులను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. -
పింఛన్దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్దారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
డీఎస్ మృతిపట్ల తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం
కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్లో డీఎస్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. -
ఊదమంటే.. బ్రీత్ ఎనలైజర్ లాక్కెళ్లాడు!
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసుల ఏమరుపాటును అదనుగా తీసుకున్న ఓ వాహనదారుడు బ్రీత్ ఎనలైజర్ను లాక్కుని వెళ్లాడు. -
కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. -
లింకు నొక్కారో.. ఖాతా ఖాళీ
పీఎంకిసాన్ పథకంలో భాగంగా.. కేంద్ర ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకుని డబ్బులు వచ్చాయా లేదా తెలుసుకోవచ్చని సైబర్ నేరగాళ్లు తప్పుడు లింకులు పంపుతున్నారు. -
యూజీసీ నెట్-2024 పరీక్ష కొత్త తేదీలను ప్రకటించిన ఎన్టీఏ
యూజీసీ నెట్ పరీక్ష కొత్త తేదీలను జాతీయ పరీక్ష సంస్థ (NTA) ప్రకటించింది. ఈ సారి పెన్ను పేపర్ విధానంలో కాకుండా కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. -
విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి
బాగా చదువుకున్నవారు రాజకీయాల్లోకి రావాలని తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, ప్రముఖ నటుడు విజయ్ కోరారు. మంచి నాయకులు కావాలా, వద్దా అనేది విద్యార్థులే నిర్ణయించుకోవాలని సూచించారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/06/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రసాయన పరిశ్రమలో పేలిన రియాక్టర్.. వాహనాలు దగ్ధం
-
‘కల్కి’ పార్ట్-2 రిలీజ్ ఎప్పుడంటే? ఆసక్తికర విషయాలు చెప్పిన అశ్వనీదత్
-
‘ఐవీఎఫ్తో కవలలకు జన్మనిచ్చా’: వ్యక్తిగత విషయం వెల్లడించిన ఈశా అంబానీ
-
పులివెందుల కౌన్సిలర్ల అసమ్మతి.. పార్టీలోనే ఉండాలని ఎంపీ అవినాశ్ సూచన
-
రోహిత్ శర్మ ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు: జస్ప్రీత్ బుమ్రా
-
కేంద్రానికి నీతీశ్ కుమార్ మెలిక.. ‘ప్రత్యేక హోదా’ ఇవ్వాలంటూ తీర్మానం