- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. కుప్పంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబు
కుప్పం పట్టణం: ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) కుప్పం పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న ప్రజలు.. తమ సమస్యలను సీఎంకు వివరించారు. పూర్తి కథనం
2. శంషాబాద్లో చిరుత సంచారం.. ఆచూకీ కోసం 20 కెమెరాలతో నిఘా
హైదరాబాద్: శంషాబాద్లో చిరుత సంచారం కలకలం సృష్టించింది. దీంతో ఘాన్సీమియాగూడలో అటవీ శాఖ అధికారులు గాలిస్తున్నారు. చిరుత ఆచూకీ కోసం 20 కెమెరాలతో పాటు రెండు బోన్లను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల్లో అడవి పిల్లి కదలికలు కనిపించాయి.పూర్తి కథనం
3. ఎమ్మెల్సీ జీవన్రెడ్డికి బుజ్జగింపులు.. దిల్లీ నుంచి పిలుపు
హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డికి ఆ పార్టీ నేతల బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు ఆయనతో మాట్లాడారు. తాజగా దిల్లీకి రావాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ నుంచి పిలుపు వచ్చింది.పూర్తి కథనం
4. జూడాల సమ్మెకు తాత్కాలిక బ్రేక్
హైదరాబాద్: సమ్మెను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు (జూడా) ప్రకటించారు. డీఎంఈ, ఆరోగ్య శాఖ అధికారులతో మంగళవారం అర్ధరాత్రి వరకు వారు చర్చలు జరిపారు. ఈక్రమంలో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో జూడాల వసతి భవనాల ఏర్పాటుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది.పూర్తి కథనం
5. దిల్లీ మద్యం కుంభకోణం.. సీబీఐ కస్టడీలోకి సీఎం కేజ్రీవాల్
దిల్లీ: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను (Arvind Kejriwal) అరెస్టు చేసేందుకు కేంద్ర దర్యాప్తు బృందానికి కోర్టు బుధవారం అనుమతించింది. దీనిపై న్యాయమూర్తి అమితాబ్ రావత్ ఆదేశాలు జారీ చేసిన వెంటనే సీబీఐ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.పూర్తి కథనం
6. అబ్దుల్ కలాం ఫోన్ చేస్తే రాంగ్ నంబర్ అని చెప్పా: సుధామూర్తి
ఇన్ఫోసిస్ (Infosys) సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణిగానే కాక.. రచయిత్రి, వితరణశీలిగా ఎంతోమందికి సుపరిచితురాలు సుధామూర్తి (Sudha Murty). తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం నుంచి తనకు ఓసారి ఫోన్ వచ్చిందని తెలిపారు. పూర్తి కథనం
7. వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజేకు విముక్తి.. సొంత దేశం ఆస్ట్రేలియాకు పయనం
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు (Julian Assange) విముక్తి లభించింది. గూఢచర్యం ఆరోపణలను ఎదుర్కొంటూ ఇన్నాళ్లూ బ్రిటన్లో తలదాచుకున్న ఆయనను విడిచిపెట్టాలని అమెరికా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దీంతో ప్రత్యేక విమానంలో ఆయన తన సొంత దేశం ఆస్ట్రేలియాకు చేరుకోనున్నారు.పూర్తి కథనం
8. సెక్షన్ 80సి పరిమితి ఈసారైనా పెరిగేనా?.. చివరిసారి ఎప్పుడు సవరించారు?
ఆదాయపు పన్ను (Income tax) చెల్లింపుదారులకు సెక్షన్ 80సి (80C) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బడ్జెట్ వచ్చిన (Budget 2024) ప్రతిసారీ వేతన జీవులు ఆశగా ఎదురుచూసే వాటిలో శ్లాబుల సవరణ ఒకటైతే.. రెండోది సెక్షన్ 80సి రెండోది. కేంద్రం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది.పూర్తి కథనం
9. ‘ఫేక్ ఇన్జూరీ’ ఆరోపణలు.. గుల్బాదిన్పై చర్యలు ఉంటాయా? ఐసీసీ రూల్స్ ఏంటంటే?
టీ20 ప్రపంచకప్లో (T20 World Cup 2024) అఫ్గానిస్థాన్ తొలిసారి సెమీస్కు దూసుకొచ్చింది. సూపర్-8 స్టేజ్లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ను ఓడించి నాకౌట్ బెర్తును ఖాయం చేసుకుంది. అయితే, బంగ్లాదేశ్తో పోరు సందర్భంగా అఫ్గాన్ ఆటగాడు గుల్బాదిన్ నైబ్ (Gulbadin Naib) తొడ కండరాలు తిమ్మిరి ఎక్కినట్లు ఒక్కసారిగా కింద పడిపోయాడు. పూర్తి కథనం
10. అఫ్గాన్ సెమీస్కు రిజర్వ్ డే.. భారత్కు మాత్రం లేదు.. ఎందుకలా..?
ఈసారి పొట్టి ప్రపంచకప్ (T20 World Cup)లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. మొదటి సెమీస్కు రిజర్వ్డే ఉండగా.. రెండో దానికి ఆ సౌకర్యం లేదు. దీంతో అదేంటీ అందరికీ ఒక రూల్.. టీమ్ ఇండియాకు మరో రూలా అని ఫ్యాన్స్ చర్చించుకొంటున్నారు.పూర్తి కథనం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీలో రసాభాస
ఖైరతాబాద్ మండల కార్యాలయంలో బోరబండ, రెహమత్నగర్ డివిజన్లకు చెందిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ శనివారం జరిగింది. -
పీసీ ఘోష్ కమిషన్ విచారణ గడువు పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ గడువును మరో రెండు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ గెజిట్ జారీ
అమరావతి ప్రాంతంలో చేపట్టనున్న ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ గెజిట్ జారీ చేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న పవన్ కల్యాణ్..
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్కల్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. -
చంద్రబాబు కార్యసాధకుడు.. అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తారు: సుమన్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యసాధకుడు అని ప్రముఖ సినీ నటుడు సుమన్ కొనియాడారు. -
ఏయూలో జరిగిన అవినీతిపై న్యాయవిచారణ చేయిస్తాం: సి.ఎం.రమేశ్
వీసీ ప్రసాదరెడ్డి రాజీనామాతో ఆంధ్రా వర్సిటీలో విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు. విశ్వవిద్యాలయానికి పూర్వ విద్యార్థులు భారీగా చేరుకుంటున్నారు. -
జీఏడీకి రిపోర్టు చేయండి.. ముగ్గురు అఖిల భారత సర్వీసు అధికారులకు ఏపీ ప్రభుత్వ ఆదేశాలు
ముగ్గురు అఖిల భారత సర్వీసు అధికారులను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. -
పింఛన్దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్దారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
డీఎస్ మృతిపట్ల తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం
కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్లో డీఎస్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. -
ఊదమంటే.. బ్రీత్ ఎనలైజర్ లాక్కెళ్లాడు!
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసుల ఏమరుపాటును అదనుగా తీసుకున్న ఓ వాహనదారుడు బ్రీత్ ఎనలైజర్ను లాక్కుని వెళ్లాడు. -
కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. -
లింకు నొక్కారో.. ఖాతా ఖాళీ
పీఎంకిసాన్ పథకంలో భాగంగా.. కేంద్ర ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకుని డబ్బులు వచ్చాయా లేదా తెలుసుకోవచ్చని సైబర్ నేరగాళ్లు తప్పుడు లింకులు పంపుతున్నారు. -
యూజీసీ నెట్-2024 పరీక్ష కొత్త తేదీలను ప్రకటించిన ఎన్టీఏ
యూజీసీ నెట్ పరీక్ష కొత్త తేదీలను జాతీయ పరీక్ష సంస్థ (NTA) ప్రకటించింది. ఈ సారి పెన్ను పేపర్ విధానంలో కాకుండా కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. -
విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి
బాగా చదువుకున్నవారు రాజకీయాల్లోకి రావాలని తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, ప్రముఖ నటుడు విజయ్ కోరారు. మంచి నాయకులు కావాలా, వద్దా అనేది విద్యార్థులే నిర్ణయించుకోవాలని సూచించారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/06/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
క్రెడిట్ కార్డు రూల్స్లో మార్పులు.. ఈ జాబితాలో మీ బ్యాంక్ ఉందా?
-
రసాయన పరిశ్రమలో పేలిన రియాక్టర్.. వాహనాలు దగ్ధం
-
‘కల్కి’ పార్ట్-2 రిలీజ్ ఎప్పుడంటే? ఆసక్తికర విషయాలు చెప్పిన అశ్వనీదత్
-
‘ఐవీఎఫ్తో కవలలకు జన్మనిచ్చా’: వ్యక్తిగత విషయం వెల్లడించిన ఈశా అంబానీ
-
పులివెందుల కౌన్సిలర్ల అసమ్మతి.. పార్టీలోనే ఉండాలని ఎంపీ అవినాశ్ సూచన
-
రోహిత్ శర్మ ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు: జస్ప్రీత్ బుమ్రా