- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. కరకట్టపై దస్త్రాల దహనం.. విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశం
అమరావతి: కృష్ణా నది కరకట్టపై దస్త్రాలను తగులబెట్టిన అంశంలో పూర్తిస్థాయి విచారణకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రాత్రి వేళ రహస్యంగా ప్రభుత్వ వాహనంలో వచ్చి కరకట్టపై బస్తాలను దించి తగులబెట్టడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. పూర్తి కథనం
2. మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న నారా లోకేశ్
దుగ్గిరాల: మంత్రి నారా లోకేశ్ గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో పర్యటించారు. కంఠంరాజు కొండూరులోని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. వేద పండితులు ఆశీర్వచనాలిచ్చారు.పూర్తి కథనం
3. వైకాపా కార్యాలయాల కూల్చివేతలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
అమరావతి: రాష్ట్రంలో వైకాపా కార్యాలయాల కూల్చివేతల అంశంలో దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కూల్చివేతల్లో చట్టనిబంధనలు పాటించాలని ఆదేశించింది. ప్రతిదశలో వైకాపా తరఫున వాదనలు వినిపించేందుకు అవకాశమివ్వాలని పేర్కొంది.పూర్తి కథనం
4. ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
దిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రానికి ఆర్థికసాయం, ఇతర అంశాలపై సుమారు అరగంటపాటు ప్రధానితో చర్చించారు. అంతకుముందు రాష్ట్రానికి చెందిన ఎన్డీయే ఎంపీలతో కలిసి కేంద్రమంత్రి పీయూష్ గోయల్ను చంద్రబాబు కలిశారు.పూర్తి కథనం
5. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి భేటీ
దిల్లీ: తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి దిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్షాతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సీఎం వెంట ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉన్నారు.పూర్తి కథనం
6. ద్వితీయ శ్రేణినగరాల్లోనూ ఐటీ విస్తరిస్తాం: మంత్రి శ్రీధర్బాబు
హనుమకొండ: రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ విస్తరించాలన్నదే తమ సంకల్పమని తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. హనుమకొండలో రాక్స్ ఐటీ పార్కును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఐటీ పరిశ్రమకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. విదేశాల్లోని తెలంగాణ వాసులు రాష్ట్రానికి వచ్చి ఐటీ కార్యాలయాలు స్థాపించాలని కోరారు. పూర్తి కథనం
7. ఇంకా పరారీలోనే భోలే బాబా.. ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు
లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్ (Uttar Pradesh)లోని హాథ్రస్లో భోలే బాబా (Bhole Baba) సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి అరెస్టులు చోటుచేసుకోకపోవడం గమనార్హం. పూర్తి కథనం
8. వాయు కాలుష్యంతో భారత్లో ఏటా 33 వేల మరణాలు: లాన్సెట్
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో ప్రతీ సంవత్సరం 11.5 శాతం మరణాలు (దాదాపు 12,000 మంది) వాయు కాలుష్యం (Air Pollution) కారణంగా సంభవించి ఉండొచ్చని ప్రముఖ వైద్య పరిశోధన మాసపత్రిక లాన్సెట్లో ప్రచురితమైన ఓ నివేదిక అంచనా వేసింది. కాలుష్యం కారణంగా దేశంలో అత్యధిక మరణాలు సంభవిస్తుంది ఈ మహానగరంలోనేనని తెలిపింది.పూర్తి కథనం
9. సందేహం అక్కర్లేదు.. నేనే అధ్యక్ష అభ్యర్థిని: బైడెన్
వాషింగ్టన్: డెమోక్రాటిక్ పార్టీ తరఫున రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేది తానేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) స్పష్టం చేశారు. పోటీ నుంచి వైదొలగాలని తనపై ఎలాంటి ఒత్తిడి లేదని తెలిపారు. గతవారం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్తో (Donald Trump) జరిగిన సంవాదంలో బైడెన్ తడబడిన విషయం తెలిసిందే. పూర్తి కథనం
10. రిషి సునాక్కు మళ్లీ విజయం దక్కేనా? బ్రిటన్లో మొదలైన ఓటింగ్
లండన్: బ్రిటన్లో సార్వత్రిక సమరం (UK Parliament Elections) మొదలైంది. స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 7 గంటలకు పార్లమెంట్ ఎన్నికలకు ఓటింగ్ ప్రారంభమైంది. కొత్త ప్రధానిని ఎన్నుకునేందుకు పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో రిషి సునాక్ (Rishi Sunak) నేతృత్వంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీ, కెయిర్ స్టార్మర్ ఆధ్వర్యంలోని లేబర్ పార్టీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది.పూర్తి కథనం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సికింద్రాబాద్‑గోవా బై-వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు.. ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన కిషన్రెడ్డి
సికింద్రాబాద్‑గోవా మధ్య కొత్త బై-వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు నడపనున్నారు. -
ఎంఎస్ ధోనీ ‘100’ అడుగుల కటౌట్..
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బర్త్డే ఆదివారం. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా నందిగామ మండలం అంబారుపేట వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పక్కన ధోనీ ‘100’ అడుగుల కటౌట్ను అభిమానులు ఏర్పాటు చేశారు. -
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. మరో ముగ్గురి అరెస్టు
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మరో ముగ్గురిని అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో జింకా సత్యం, లంకా అబ్బినాయుడు, తియ్యగూర గోపిరెడ్డి ఉన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గుంతకల్లు రైల్వే DRM ఆఫీస్లో ముగిసిన సోదాలు.. సీబీఐ అదుపులో 8 మంది
గుంతకల్లు రైల్వే డీఆర్ఎం కార్యాలయం వివిధ విభాగాల్లో సీబీఐ సోదాలు చేసింది. రైల్వే డీఆర్ఎం వినీత్సింగ్ నివాసంలో తనిఖీలు పూర్తయ్యాయి. -
మిర్యాలగూడ స్టేషన్లో నిలిచిన ఫలక్నుమా సూపర్ఫాస్ట్ రైలు
హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఫలక్నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ రైల్వేస్టేషన్లో నిలిపివేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మా ఎమ్మెల్యే చెప్పారు.. నేనే పనులు చేస్తా..!
ప్రభుత్వం మారినా.. జలవనరుల శాఖలో గుత్తేదారుల తీరు మారలేదు. గత వైకాపా హయాంలో చక్రం తిప్పినవారే తాజా టెండర్లలో జోక్యం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రి పేరు చెప్పి సిండికేట్కు ప్రయత్నిస్తున్నారు. -
సత్యదేవుని చెంత సరిదిద్దడం సవాలే
ఎంతో ప్రముఖమైన..నిత్యం వేలాదిమంది భక్తులు దర్శించుకునే సత్యదేవుని ఆలయానికి సంబంధించి పనులంటే ఎంత ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి.. ఎంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలి.. -
మహానందిలో చిరుత సంచారం
మహానందిలో మళ్లీ చిరుతపులి సంచరించింది. మనుషుల ప్రాణాలు పోయేంత వరకు చిరుతను పట్టుకోరా..?అంటూ మహానంది ప్రజలు అటవీశాఖ తీరుతెన్నులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
సమంతకు క్షమాపణలు చెప్పిన డాక్టర్.. కానీ..
-
సికింద్రాబాద్‑గోవా బైవీక్లీ ఎక్స్ప్రెస్ రైలు.. ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన కిషన్రెడ్డి
-
నటుడు రాజ్ తరుణ్ వ్యవహారంలో మరో ట్విస్ట్
-
అస్సాం అతలాకుతలం.. ఉప్పొంగుతున్న నదులు
-
జియో నుంచి కొత్తగా 5జీ డేటా బూస్టర్ ప్లాన్స్
-
పంజాబ్ నేషనల్ బ్యాంక్కు ఆర్బీఐ జరిమానా