- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. మంత్రి నారా లోకేశ్ ‘ప్రజాదర్బార్’కు అనూహ్య స్పందన.. భారీగా తరలివచ్చిన ప్రజలు
అమరావతి: మంత్రి నారా లోకేశ్ నిర్వహిస్తున్న ‘ప్రజాదర్బార్’కు మంచి స్పందన లభిస్తోంది. బుధవారం ఉదయం నుంచే ఉండవల్లి నివాసం వద్ద వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, యువత, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు బారులు తీరారు. లోకేశ్ ప్రతి ఒక్కరి వద్ద వినతి పత్రాలు స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని వారికి భరోసా ఇచ్చారు. పూర్తి కథనం
2. పట్టిసీమను జగన్ ఒట్టిసీమ అన్నారు.. ఇప్పుడదే బంగారమైంది: మంత్రి నిమ్మల
కొయ్యలగూడెం గ్రామీణం: దేశాన్ని కరవు రహితంగా మార్చాలంటే నదుల అనుసంధానమే మార్గమని ఏపీ జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది సీఎం చంద్రబాబేనని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుతోనే నదుల అనుసంధానం సాకారమన్నారు.పూర్తి కథనం
3. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై కేసు: కేటీఆర్
భారాస ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై కేసు నమోదు చేయడంపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేస్తున్నందుకే కేసు నమోదు చేశారని విమర్శించారు. ఇలాంటి బెదిరింపులకు భారాస నేతలు భయపడేది లేదన్నారు.పూర్తి కథనం
4. కొత్త చట్టం కింద భారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై కేసు
కరీంనగర్: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై కరీంనగర్ ఒకటో ఠాణాలో కేసు నమోదైంది. మంగళవారం నిర్వహించిన జిల్లా పరిషత్ సమావేశంలో అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే ఫిర్యాదుతో కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టం కింద కేసు నమోదు చేశారు. భారత న్యాయ సంహిత సెక్షన్ 122, 126(2) కింద పోలీసులు కేసు ఫైల్ చేశారు.పూర్తి కథనం
5. నీట్ వివాదం.. నటుడు విజయ్ కీలక వ్యాఖ్యలు
చెన్నై: దేశ వ్యాప్తంగా వైద్య సీట్ల భర్తీ కోసం నిర్వహించే నీట్యూజీ-2024 (NEET UG-2024) పరీక్ష నిర్వహణపై దేశవ్యాప్తంగా గందరగోళం నెలకొంది. అదే సమయంలో పేపర్ లీక్ ఘటనలు వెలుగులోకి రావడం దుమారం రేపింది. దీనిపై చర్చ జరపాలని పార్లమెంట్లో విపక్షాలు పట్టుబడుతున్నాయి.పూర్తి కథనం
6. హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. భోలే బాబా ఎక్కడ..?
లఖ్నవూ: ఉత్తరప్రదేశ్ (Uttarpradesh)లోని హాథ్రస్లో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమం పలు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. బాబా పాద ధూళి కోసం జనం ఒక్కసారిగా ఎగబడటంతో భారీ తొక్కిసలాట (Hathras stampede) చోటుచేసుకుంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 121కి చేరింది. కాగా.. ఈ విషాదం తర్వాత భోలే బాబా ఆచూకీ తెలియరావట్లేదు.పూర్తి కథనం
7. ఉద్యోగులకు జీతాలు పెంచారని.. యజమానులకు జైలు
సైన్యం పాలనలో మయన్మార్ (Myanmar) ప్రజలు తీవ్రంగా సతమతమవుతున్నారు. సైన్యం కఠిన చట్టాల కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఉద్యోగులకు జీతాలు పెంచారన్న (Wage Hike) కారణంతో కొంతమంది దుకాణ యజమానులను అక్కడి సైనిక ప్రభుత్వం జైలుకు పంపించింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న వేళ సిబ్బందికి వేతనాలను పెంచడం నేరంగా పరిగణించింది.పూర్తి కథనం
8. బైడెన్ డిమెన్షియాను దాచిపెట్టారు..కమలా హ్యారిస్ ఆయన స్థానాన్ని భర్తీ చేయొచ్చు..!
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ప్రారంభమైన దగ్గరి నుంచి అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఆరోగ్యమే హాట్ టాపిక్గా మారింది. ప్రత్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విమర్శల్లో ఈ విషయమే ఎక్కువగా వినిపిస్తోంది. దీనికితోడు ఇద్దరిమధ్య ఇటీవల జరిగిన ప్రత్యక్ష చర్చలో బైడెన్ తడబాటుకు గురికావడం సొంతపక్షం డెమోక్రాటిక్ నేతల్లో ఆందోళనకు దారితీసింది.పూర్తి కథనం
9. బెంబేలెత్తించిన బెరిల్.. మొత్తం ద్వీపం ధ్వంసం!
కరీబియన్ దీవుల్లో భీకర ‘బెరిల్’ హరికేన్ (Hurricane Beryl) భారీ విధ్వంసమే సృష్టించింది. దాదాపు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు అనేక దీవుల్లో తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టానికి దారితీశాయి. 20 ఏళ్ల క్రితం వచ్చిన ‘ఐవాన్’ తర్వాత.. అంతటి భారీ హరికేన్ ఇదేనని స్థానిక అధికారిక యంత్రాంగం వెల్లడించింది.పూర్తి కథనం
10. ప్రధాన బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఇవే..
ఎన్ని పెట్టుబడి సాధనాలు ఉన్నా ఎటువంటి రిస్క్ లేకుండా రాబడి వస్తుందని చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్ల (FD)పైనే మక్కువ చూపుతారు. ప్రస్తుతం ఆర్బీఐ రెపో రేట్లు పెంచిన నేపథ్యంలో బ్యాంకులు ఎఫ్డీలపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. అయితే, బ్యాంకుల్లో ఎవరైనా ఎఫ్డీలు చేసే ముందు వడ్డీ రేట్లను సరిపోల్చుకోవడం ముఖ్యం. పూర్తి కథనం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం: రేవంత్రెడ్డి
అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
పోలీస్ కస్టడీకి పిన్నెల్లి.. అనుమతించిన కోర్టు
ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్టయి నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసు కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
పరిశ్రమల ఏర్పాటే లక్ష్యం.. త్వరలో నూతన ఐటీ పాలసీ: మంత్రి లోకేశ్
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలతో పాటు కొత్తగా రావడానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం పెంచే చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. -
హైదరాబాద్లో పలు చోట్ల వర్షం.. స్తంభించిన ట్రాఫిక్
నగరంలోని పలు చోట్ల శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. -
ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారంలో పెద్ద తలకాయలను పట్టుకోవాలి: డిప్యూటీ సీఎం పవన్
అరుదైన ఎర్రచందనాన్ని విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న వ్యవహారంలో పెద్ద తలకాయలను పట్టుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విభజన సమస్యలే అజెండా.. చంద్రబాబు, రేవంత్రెడ్డి భేటీకి ప్రజాభవన్లో ఏర్పాట్లు
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. -
తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో)గా సుదర్శన్రెడ్డి
తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో)గా సుదర్శన్రెడ్డి నియమితులయ్యారు. -
హైదరాబాద్ నుంచి విదేశాలకు పెద్దఎత్తున ఫార్మా ఎగుమతులు: డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్ నుంచి పెద్దఎత్తున విదేశాలకు ఫార్మా ఎగుమతులు జరుగుతున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
అమరావతి నిర్మాణానికి తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విరాళం
విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అమరావతి నిర్మాణానికి విరాళం అందజేశారు. ఎంపీగా అందుకున్న తొలి జీతం రూ.1.57 లక్షల చెక్కును ఏపీ సీఎం చంద్రబాబుకు అందించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
అన్నతోడు.. అరాచకమే చూడు
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో రెండు ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల ఆర్థిక వనరులను గత జగన్ పాలనలో పూర్తిగా నిర్వీర్యం చేశారు. -
తీరంలో ఘోరం!
ఇక్కడ జరిగిన అక్రమ నిర్మాణాలు, ఇతర ఉల్లంఘనలపై ఫిబ్రవరి నెలలోనే నివేదిక ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని హైకోర్టుఆదేశించింది. ఏప్రిల్ నెలలో మరోసారి కేసు విచారణకు వచ్చిన సమయంలో తీసుకున్న చర్యల మీద నివేదిక కోరింది. -
స్తంభం ఎక్కితేనే కొలువు నిలిచేది
వైకాపా హయాంలో అక్రమాలకు కేంద్ర బిందువుగా మారిన రెస్కో మారింది. ఛైర్మన్, అతని అనుచరులు, పార్టీ కార్యకర్తలే అర్హతలుగా భావించి అక్రమంగా చాలా మందికి కొలువులు ఇచ్చేశారు -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టీమ్ ఇండియాకు మహారాష్ట్ర ప్రభుత్వం బొనాంజా
-
ఎంటర్టైన్మెంట్ ప్లాన్లు తగ్గించేసిన జియో.. ప్రస్తుతం ఉన్నవి ఇవే!
-
అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం: రేవంత్రెడ్డి
-
పోలీస్ కస్టడీకి పిన్నెల్లి.. అనుమతించిన కోర్టు
-
జూన్లో 42 లక్షల డీమ్యాట్ ఖాతాలు.. మొత్తం ఎన్ని?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM