- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. ప్రజా సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ప్రత్యేక వేదిక: చంద్రబాబు
ప్రజా సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తానని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్తానని ఇటీవల హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఎన్టీఆర్ భవన్కు వెళ్లారు. అక్కడే ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. పూర్తి కథనం
2. హైదరాబాద్తో సమానంగా వరంగల్ అభివృద్ధి: సీఎం రేవంత్
వరంగల్ అభివృద్ధికి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, హైదరాబాద్తో సమానంగా వరంగల్ను అభివృద్ధి చేయాలని అధికారులకు సీఎం రేవంత్రెడ్డి సూచించారు. వరంగల్ పర్యటనలో ఉన్న ఆయన నగర అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పూర్తి కథనం
3. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసును మళ్లీ విచారించండి: ముప్పాళ్ల సుబ్బారావు
దళిత యువకుడు, డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసును తిరిగి విచారించాలని, విధి నిర్వహణలో అలసత్వాన్ని ప్రదర్శించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఏపీ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పూర్తి కథనం
4. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. పోక్సో కేసు నమోదు
బాపట్ల జిల్లాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటన కలకలం రేపింది. నిజాంపట్నం మండలంలో 16 ఏళ్ల బాలికపై ఐదుగురు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. వేమూరు మండలానికి చెందిన బాలిక.. శుక్రవారం తన అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. పూర్తి కథనం
5. దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టు.. రెండో రోజు ముగిసిన ఆట
దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టు మ్యాచ్లో భారత అమ్మాయిల జట్టు భారీ విజయం దిశగా సాగుతోంది. ఓవర్ నైట్ 525/4 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. 603/6 వద్ద డిక్లేర్డ్ చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ను ఆరంభించింది. పూర్తి కథనం
6. ఎస్బీఐ ఛైర్మన్గా చల్లా శ్రీనివాసులు.. ప్రతిపాదించిన ఎఫ్ఎస్ఐబీ
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ (SBI) తదుపరి ఛైర్మన్గా చల్లా శ్రీనివాసులు శెట్టిని నియమించాలని కేంద్ర పరిధిలోని స్వయంప్రతిపత్త సంస్థ అయిన ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూషన్స్ బ్యూరో (FSIB) ప్రతిపాదించింది. పూర్తి కథనం
7. సీబీఐ జ్యుడీషియల్ కస్టడీకి కేజ్రీవాల్.. అనుమతించిన కోర్టు
మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆప్ జాతీయ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను 14 రోజుల పాటు సీబీఐ జ్యుడీషియల్ కస్టడీకి అనుమతిస్తూ దిల్లీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పూర్తి కథనం
8. ‘దీనికి నెహ్రూను నిందించొద్దు ప్లీజ్’.. భాజపా పోస్ట్ వైరల్
భారీ వర్షాల కారణంగా దిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-1 పైకప్పులో కొంతభాగం శుక్రవారం కూలిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన 24 గంటల్లోనే గుజరాత్లోని రాజ్కోట్ విమానాశ్రయం (Rajkot Airport)లో పైకప్పుగా ఏర్పాటు చేసిన టెంట్ ఊడిపడిపోయింది. పూర్తి కథనం
9. అంతరిక్ష కేంద్రాన్ని తొలగించేందుకు రూ.7వేల కోట్లు.. మస్క్కు నాసా కాంట్రాక్ట్
భూ ఉపరితలానికి కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని (International Space Station) త్వరలోనే తొలగించనున్నారు. ఈ దశాబ్దం చివరికల్లా ఐఎస్ఎస్ను కూల్చివేయనున్నారు. పూర్తి కథనం
10. సభాపతిగా హుందాగా పని చేస్తా: అయ్యన్నపాత్రుడు
అతి చిన్న వయసులో ఎన్టీఆర్ తనకు మంత్రి పదవి ఇచ్చారని, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీకర్ పదవితో గౌరవించారని అయ్యన్నపాత్రుడు అన్నారు. చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. సభాపతిగా హుందాగా పని చేస్తానని తెలిపారు. పూర్తి కథనం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
పోలవరానికి అంతర్జాతీయ నిపుణులు.. సాంకేతిక సవాళ్లను అధిగమించే ప్రయత్నం
పోలవరం ప్రాజెక్టులో కీలక సాంకేతిక సవాళ్లను అధిగమించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. -
హైదరాబాద్లో పలుచోట్ల వర్షం.. తడిసి ముద్దయిన జనం
నగరంలోని పలు చోట్ల ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. -
ప్రధాని మోదీతో కలిసి అరకు కాఫీని ఆస్వాదించేందుకు ఎదురు చూస్తున్నా: చంద్రబాబు
ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి మరోసారి అరకు కాఫీ ఆస్వాదించేందుకు ఎదురు చూస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. -
వైకాపా ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల డీఎస్సీ ప్రకటన రద్దు
గత ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల డీఎస్సీ ప్రకటనను రద్దు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
సీఎం చంద్రబాబు అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రా
ముఖ్యమంత్రి చంద్రబాబు అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రాను నియమిస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. -
విభజన హామీల అమలుకు తెలుగురాష్ట్రాలు కలిసి పోరాడాలి: మంత్రి పొన్నం
రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విభజన హామీల అమలు కోసం కలిసి పోరాడాలని తెలంగాణ మంత్రి పొన్న ప్రభాకర్ అన్నారు. -
విశాఖ నుంచే ఉచిత బస్సు పథకం ప్రారంభిస్తాం: రవాణా మంత్రి రామ్ప్రసాద్రెడ్డి
విశాఖ నుంచే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని, త్వరలోనే మహిళలకు తీపి కబురు చెబుతామని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్రెడ్డి తెలిపారు. -
ఇంద్రకీలాద్రిపై తొలిసారి వారాహి ఉత్సవాలు: ఈవో రామారావు
ఇంద్రకీలాద్రిపై తొలిసారి వారాహి ఉత్సవాలను నిర్వహించనున్నారు. జులై 6 నుంచి 15 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయని శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం ఈవో రామారావు తెలిపారు. -
స్మార్ట్ సిటీ మిషన్ గడువు పొడిగించిన కేంద్రం
తెలంగాణలో స్మార్ట్ సిటీ మిషన్ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. -
తితిదే ఈవో ఆగ్రహం.. అందుబాటులోకి గత పాలకమండలి తీర్మానాలు
తితిదే పాలనలో పారదర్శకత తీసుకొచ్చేందుకు ఈవో శ్యామలరావు చర్యలు చేపట్టారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వెంకయ్యనాయుడి వాగ్ధాటి ముందు ఎవరూ నిలవలేరు: ప్రధాని మోదీ
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గ్రామస్థాయి నుంచి వచ్చి ఉన్నత స్థానానికి ఎదిగారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. -
డీఎస్ కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుంది: సీఎం రేవంత్రెడ్డి
కాంగ్రెస్ పార్టీకి డి.శ్రీనివాస్ (డీఎస్) ఎంతో సేవ చేశారని.. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) అన్నారు. -
పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ జలవనరుల నిపుణులు పరిశీలించారు. అమెరికా, కెనడా నుంచి వచ్చిన నలుగురు నిపుణులు.. ఆదివారం ఉదయం ప్రాజెక్టు వద్దకు చేరుకుని అక్కడి పరిసరాలను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. -
బొటానికల్ గార్డెన్లో రామోజీరావు సంస్మరణ సభ
కొండాపూర్ బొటానికల్ గార్డెన్లో రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ప్రపంచకప్ పూనకాలు.. సచివాలయం వద్ద సంబరాలు ఇవీ..
హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై పెద్ద ఎత్తున చేరుకున్న క్రికెట్ అభిమానులు కేరింతలు కొట్టారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/06/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోలవరానికి అంతర్జాతీయ నిపుణులు.. సాంకేతిక సవాళ్లను అధిగమించే ప్రయత్నం
-
టీమ్ఇండియాకు రూ.125 కోట్ల బహుమతి ప్రకటించిన బీసీసీఐ
-
ఆ పార్టీ ఎంపీకే ‘డిప్యూటీ’ ఇవ్వండి.. టీఎంసీ విజ్ఞప్తి
-
భారత్లో చదువు కంటే వివాహాలపైనే ఖర్చెక్కువ: జెఫరీస్
-
దీదీ.. ఈ ఘోరం మీకు కనిపించలేదా?ఇదేనా మీ పాలన?