- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. హైదరాబాద్లో చంద్రబాబుకు ఘనస్వాగతం.. భారీగా తరలివచ్చిన తెదేపా శ్రేణులు
ఏపీ సీఎం చంద్రబాబుకు హైదరాబాద్లో తెదేపా శ్రేణుల నుంచి ఘనస్వాగతం లభించింది. దిల్లీ పర్యటన ముగించుకుని బేగంపేట విమనాశ్రయానికి చేరుకున్న ఆయనకు తెలంగాణ తెదేపా నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. పూర్తి కథనం
2. ఎమ్మెల్సీలుగా సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఇద్దరి నుంచి మాత్రమే నామినేషన్లు రావడంతో ఎన్నిక ఏకగ్రీవమైందని రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. పూర్తి కథనం
3. హైదరాబాద్లో పలు చోట్ల వర్షం.. స్తంభించిన ట్రాఫిక్
హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. చాదర్ఘాట్, మలక్పేట్, సైదాబాద్, చంపాపేట్, కర్మన్ఘాట్, దిల్సుఖ్నగర్, సరూర్నగర్, చైతన్యపురి, కొత్తపేట తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. పూర్తి కథనం
4. ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారంలో పెద్ద తలకాయలను పట్టుకోవాలి: డిప్యూటీ సీఎం పవన్
అరుదైన ఎర్రచందనాన్ని విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న వ్యవహారంలో పెద్ద తలకాయలను పట్టుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. కడప జిల్లా పోట్లదుర్తి జగనన్న కాలనీలో ఎర్రచందనం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి కథనం
5. ఎంపీలుగా ప్రమాణం చేసిన అమృత్పాల్ సింగ్, ఇంజినీర్ రషీద్
ఖలిస్థాన్ సానుభూతిపరుడు, పంజాబ్లోని ఖడూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికైన అమృత్పాల్ సింగ్(Amritpal Singh), ఉగ్రనిధుల కేసు నిందితుడు ఇంజినీర్ రషీద్(Engineer Rashid) శుక్రవారం ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేశారు. పూర్తి కథనం
6. ఆధారాలుంటే.. నన్ను అరెస్టు చేయండి: తేజస్వీ యాదవ్ సవాల్
నీట్-యూజీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం (NEET Row)లో తనపై నిందలు వేసేందుకు నీతీశ్ (Nitish kumar) సర్కార్ ప్రయత్నిస్తోందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) అన్నారు. నీట్ అంశంపై తనకు వ్యతిరేకంగా ఆధారాలు ఉంటే అరెస్టు చేసుకోవాలని ఎన్డీయే ప్రభుత్వానికి సవాల్ విసిరారు. పూర్తి కథనం
7. ఆ ప్రశ్నాపత్రాలు ఇస్తామంటే నమ్మొద్దు - ఎన్బీఈ హెచ్చరిక
విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసిన విద్యార్థులు భారత్లో సేవలందించేందుకు అవసరమయ్యే ‘ఎఫ్ఎంజీఈ’ అర్హత పరీక్ష జులై 6న నిర్వహించనున్నారు. అయితే, ఇందుకు సంబంధించి ప్రశ్నాపత్రాన్ని అందజేస్తామని సోషల్ మీడియాలో వస్తోన్న ప్రచారాన్ని నమ్మవద్దని నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ వెల్లడించింది. పూర్తి కథనం
8. నిర్వాహకులదే తప్పిదంగా కనిపిస్తోంది.. హాథ్రస్ ఘటనపై సిట్ చీఫ్
ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట (Hathras Stampede) ఘటన 121 మందిని బలిగొంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తన విచారణను వేగవంతం చేసింది. పూర్తి కథనం
9. బ్రిటన్ ఎన్నికల్లో భారత సంతతి హవా.. 26 మంది గెలుపు!
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో (UK Elections) భాగంగా అక్కడి పార్లమెంటు దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్లో భారత సంతతి హవా కొనసాగింది. దాదాపు 26 మంది భారత మూలాలున్న అభ్యర్థులు అక్కడి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. పూర్తి కథనం
10. యూకే నూతన ప్రధానిగా కీర్ స్టార్మర్.. కింగ్ ఛార్లెస్-3 ఆమోదం
పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘనవిజయంతో.. యూకే తదుపరి ప్రధానిగా కీర్ స్టార్మర్ నియమితులయ్యారు. కింగ్ ఛార్లెస్-3 ఆయన నియామకాన్ని ఆమోదించారు. ఫలితాల అనంతరం స్టార్మర్.. బకింగ్హామ్ ప్యాలెస్లో రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. పూర్తి కథనం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
6 సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించిన సీఎం రేవంత్రెడ్డి
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తితిదే పరిపాలనా భవనంలో సోదాలు.. కొనసాగుతున్న విజిలెన్స్ విచారణ
గత ఐదేళ్లలో తితిదేలో చోటు చేసుకున్న అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ కొనసాగుతోంది. -
ఆధార్ ఫొటోకి మోడల్గా మారి ఫోజులిచ్చిన చిన్నారి.. వీడియో వైరల్
ఆధార్ కేంద్రానికి ఫొటో దిగడానికి వచ్చిన ఓ పాప వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అవుతోంది. -
ఎన్టీఆర్ జిల్లాలో బాయిలర్ పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా
ఎన్టీఆర్ జిల్లాలోని అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమలో బాయిలర్ పేలిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. -
వైభవంగా పూరీ జగన్నాథుని రథయాత్ర.. హాజరైన రాష్ట్రపతి
పూరీ జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్ర భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఆదివారం సాయంత్రం వైభవంగా ప్రారంభమైంది. -
అలాచేసిన వారు విజయ తీరాలకు చేరతారు: సీఎం రేవంత్
టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కు అర్హత సాధించిన అభ్యర్థులకు సీఎం అభినందనలు తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
సీఎం చంద్రబాబు ఇంటిచుట్టూ పీఎస్ఆర్ ఆంజనేయులు చక్కర్లు
ఏపీ సీఎం చంద్రబాబును కలిసేందుకు ఆ రాష్ట్ర మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు యత్నించారు. -
ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమాజంలో మార్పు: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అందరిదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రను ఆయన ప్రారంభించారు. అనంతరం స్వామి వారికి హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోల్కొండలో ఆషాఢం బోనాల సందడి
గోల్కొండలోని జగదాంబికా అమ్మవారి ఆలయం వద్ద బోనాల సందడి నెలకొంది. మహిళలు పెద్దఎత్తున బోనాలతో అక్కడికి చేరుకున్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వాస్తవాన్ని గుర్తించండి.. రాహుల్కు కేంద్రమంత్రి సింధియా చురక!
-
వరుణుడి ఆటంకం.. భారత్- దక్షిణాఫ్రికా రెండో టీ20 రద్దు
-
6 సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించిన సీఎం రేవంత్రెడ్డి
-
ఆర్మ్స్ట్రాంగ్ హత్య కేసు సీబీఐకి అప్పగించాలి: మాయావతి
-
ఆ ఆపరేషన్ కారణంగానే సినిమాలకు విరామం: నభా నటేశ్
-
పిడుగు పాటుకు 10మంది మృత్యువాత