- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. టీపీసీసీ అధ్యక్షుడి నియామకం తాత్కాలికంగా వాయిదా
తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడి నియామకం తాత్కాలికంగా వాయిదా పడింది. కాంగ్రెస్ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోడంతో ఎంపిక ప్రక్రియను ఏఐసీసీ వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఈ విషయమై వారం రోజుల్లో మరోసారి చర్చించాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు. పూర్తి కథనం
2. బాధితులకు న్యాయం చేయలేనప్పుడు పదవి శాశ్వతం కాదు: ఎమ్మెల్యే కొలికపూడి
బాధితులకు సత్వర న్యాయం పేరుతో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రదర్శించిన అత్యుత్సాహం ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. కంభంపాడులో వైకాపా నేత కాలసాని చెన్నారావు చేపట్టిన అక్రమ భవన నిర్మాణాన్ని ఎమ్మెల్యే దగ్గరుండి కొంత మేర కూల్చివేయించారు. పూర్తి కథనం
3. హామీల అమలుపై కాంగ్రెస్ నేతల కాలయాపన: రఘునందన్రావు
అధికారంలోకి వచ్చి ఏడు నెలలు పూర్తవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని మెదక్ ఎంపీ రఘునందన్రావు విమర్శించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ నేతలు కమిషన్లు వేస్తూ కాలయాపన చేస్తున్నారు. పూర్తి కథనం
4. ఉచిత ఇసుక పంపిణీకి విధివిధానాలు తయారు చేస్తున్నాం: మంత్రి కొల్లు రవీంద్ర
ఏపీలో మళ్లీ ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టడం శుభపరిణామని గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గత అయిదేళ్లూ ఇసుకను అడ్డుపెట్టుకుని వైకాపా నేతలు దోచుకున్నారని మండిపడ్డారు. బుధవారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తి కథనం
5. అలా కూర్చొని.. ఇలా రికార్డులు నెలకొల్పి: ప్రభాస్పై నాగ్ అశ్విన్ పోస్ట్
బాక్సాఫీస్ వద్ద ‘కల్కి 2898 ఏడీ’ హవా కొనసాగుతోంది. కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. వాటన్నింటికీ హీరో ప్రభాస్ (Prabhas) కీలకమని దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin)కొనియాడారు. పూర్తి కథనం
6. ‘భారతీయుడు2’లో నటించడానికి ఏకైక కారణమిదే: కమల్ హాసన్
కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భారతీయుడు 2’ (Indian 2). వీళ్లిద్దరి కాంబినేషన్లోనే వచ్చిన హిట్ సినిమా ‘భారతీయుడు’కు సీక్వెల్గా రానుంది. జులై 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కమల్ హాసన్ పార్ట్3 గురించి చూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు. పూర్తి కథనం
7. జింబాబ్వే పర్యటనకు భారత్.. గత హీరోలు ఎవరంటే?
భారత యువ జట్టు జింబాబ్వేతో ఐదు టీ20ల(ZIM vs IND) సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. ఇప్పుడంటే జింబాబ్వే గొప్ప ప్రదర్శన చేయడం లేదు కానీ గతంలో ‘పసికూన’గా ఉంటూనే అద్భుతాలు సృష్టించిన చరిత్ర ఉంది. అంతర్జాతీయ స్థాయి ప్లేయర్లతో బలమైన జట్లకూ గట్టిపోటీనిచ్చేది. జింబాబ్వే-భారత్ ఇప్పటి వరకు మూడు ద్వైపాక్షిక సిరీసుల్లో తలపడ్డాయి. పూర్తి కథనం
8. సీఎంఎఫ్ బ్రాండ్ అంబాసిడర్గా రష్మిక
ప్రముఖ టెక్ కంపెనీ నథింగ్ తన సబ్ బ్రాండ్ సీఎంఎఫ్ (CMF)కు సినీనటి రష్మిక (Rashmika mandanna)ను ప్రచారకర్తగా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని నథింగ్ ఓ ప్రకటనలో తెలిపింది. రష్మికను సీఎంఎఫ్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం పట్ల నథింగ్ ఇండియా ప్రెసిడెంట్ విశాల్ భోలా ఆనందం వ్యక్తం చేశారు. పూర్తి కథనం
9. వందేభారత్లో వర్షపు నీరు లీకేజీ.. వీడియో వైరల్!
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన సెమీహైస్పీడ్ వందే భారత్ (Vande Bharat)లోని సౌకర్యాలపై తరచూ ఫిర్యాదు వస్తున్నాయి. టిక్కెట్ ధర ఎక్కువైనా ప్రయాణంలో సౌకర్యాల దృష్ట్యా చాలామంది ఈ ప్రీమియం రైలునే ఎంచుకుంటున్నా.. కొన్ని సందర్భాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూర్తి కథనం
10. ఝార్ఖండ్ సీఎం చంపాయీ సోరెన్ రాజీనామా
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి చంపాయీ సోరెన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ రాధాకృష్ణన్కు అందించారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జనవరి 31న ఈడీ అధికారులు అప్పటి సీఎం హేమంత్ సోరెన్ను అరెస్టు చేయడంతో చంపాయీ సోరెన్ ఆ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. పూర్తి కథనం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీస్ కస్టడీకి పిన్నెల్లి.. అనుమతించిన కోర్టు
ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్టయి నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసు కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
పరిశ్రమల ఏర్పాటే లక్ష్యం.. త్వరలో నూతన ఐటీ పాలసీ: మంత్రి లోకేశ్
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలతో పాటు కొత్తగా రావడానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం పెంచే చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. -
హైదరాబాద్లో పలు చోట్ల వర్షం.. స్తంభించిన ట్రాఫిక్
నగరంలోని పలు చోట్ల శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. -
ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారంలో పెద్ద తలకాయలను పట్టుకోవాలి: డిప్యూటీ సీఎం పవన్
అరుదైన ఎర్రచందనాన్ని విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న వ్యవహారంలో పెద్ద తలకాయలను పట్టుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విభజన సమస్యలే అజెండా.. చంద్రబాబు, రేవంత్రెడ్డి భేటీకి ప్రజాభవన్లో ఏర్పాట్లు
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. -
తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో)గా సుదర్శన్రెడ్డి
తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో)గా సుదర్శన్రెడ్డి నియమితులయ్యారు. -
హైదరాబాద్ నుంచి విదేశాలకు పెద్దఎత్తున ఫార్మా ఎగుమతులు: డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్ నుంచి పెద్దఎత్తున విదేశాలకు ఫార్మా ఎగుమతులు జరుగుతున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
అమరావతి నిర్మాణానికి తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విరాళం
విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అమరావతి నిర్మాణానికి విరాళం అందజేశారు. ఎంపీగా అందుకున్న తొలి జీతం రూ.1.57 లక్షల చెక్కును ఏపీ సీఎం చంద్రబాబుకు అందించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
అన్నతోడు.. అరాచకమే చూడు
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో రెండు ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల ఆర్థిక వనరులను గత జగన్ పాలనలో పూర్తిగా నిర్వీర్యం చేశారు. -
తీరంలో ఘోరం!
ఇక్కడ జరిగిన అక్రమ నిర్మాణాలు, ఇతర ఉల్లంఘనలపై ఫిబ్రవరి నెలలోనే నివేదిక ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని హైకోర్టుఆదేశించింది. ఏప్రిల్ నెలలో మరోసారి కేసు విచారణకు వచ్చిన సమయంలో తీసుకున్న చర్యల మీద నివేదిక కోరింది. -
స్తంభం ఎక్కితేనే కొలువు నిలిచేది
వైకాపా హయాంలో అక్రమాలకు కేంద్ర బిందువుగా మారిన రెస్కో మారింది. ఛైర్మన్, అతని అనుచరులు, పార్టీ కార్యకర్తలే అర్హతలుగా భావించి అక్రమంగా చాలా మందికి కొలువులు ఇచ్చేశారు -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
పోలీస్ కస్టడీకి పిన్నెల్లి.. అనుమతించిన కోర్టు
-
జూన్లో 42 లక్షల డీమ్యాట్ ఖాతాలు.. మొత్తం ఎన్ని?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ముగిసిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్.. భారత్ లక్ష్యం 190
-
పరిశ్రమల ఏర్పాటే లక్ష్యం.. త్వరలో నూతన ఐటీ పాలసీ: మంత్రి లోకేశ్
-
బిహార్లో 16మంది ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు