Ponnam Prabhakar: విభజన హామీల అమలుకు తెలుగురాష్ట్రాలు కలిసి పోరాడాలి: మంత్రి పొన్నం

రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విభజన హామీల అమలు కోసం కలిసి పోరాడాలని తెలంగాణ మంత్రి పొన్న ప్రభాకర్‌ అన్నారు.

Published : 30 Jun 2024 16:26 IST

తిరుమల: రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విభజన హామీల అమలు కోసం కలిసి పోరాడాలని తెలంగాణ మంత్రి పొన్న ప్రభాకర్‌ అన్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. శ్రీవారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున పవన్‌ కల్యాణ్‌కు కొండగట్టులో స్వాగతం పలికామని చెప్పారు. గతంలో తిరుమలలో తెలంగాణ భక్తులు ఇబ్బందులు పడ్డారని, ఇకపై అలాంటి పరిస్థితులు రాకుండా చూడాలని తితిదేని కోరారు. గతంలో మాదిరాగానే తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖపై దర్శనం కల్పించే విధానం మళ్లీ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని