Governor Radhakrishnan: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ గవర్నర్‌

ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu)ను తెలంగాణ గవర్నర్‌ రాధాకృష్ణన్‌ కలిశారు.

Updated : 28 Jun 2024 13:51 IST

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu)ను తెలంగాణ గవర్నర్‌ రాధాకృష్ణన్‌ కలిశారు. ఉండవల్లిలోని ఆయన నివాసానికి వచ్చి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు, పెండింగ్‌ అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అంతకుముందు గవర్నర్‌కు మంత్రి నారా లోకేశ్‌ స్వాగతం పలికారు. మంగళగిరి చేనేత శాలువాతో ఆయన్ను సత్కరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని