- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Junior doctors protest: జూడాల సమ్మె తాత్కాలిక విరమణ.. రెండు జీవోలు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
జూనియర్ డాక్టర్లకు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం రెండు జీవోలను జారీ చేసింది. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల జూడాల వసతిగృహాల నిర్మాణానికి జీవో విడుదల చేసింది.
హైదరాబాద్: జూనియర్ డాక్టర్లకు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం రెండు జీవోలను జారీ చేసింది. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల జూడాల వసతిగృహాల నిర్మాణానికి జీవో విడుదల చేసింది. కాకతీయ వైద్య కళాశాలలో రహదారుల పునరుద్ధరణకు నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులతో పాటు కాకతీయ వర్సిటీకి రూ.204.85 కోట్లు కేటాయించింది. ఉస్మానియా వసతి భవనాలు, రోడ్లకు రూ.121.90 కోట్లు, గాంధీ ఆసుపత్రికి 79.50 కోట్లు, కాకతీయ వర్సిటీలో సీసీ రోడ్లకు రూ.2.75 కోట్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది.
మరోవైపు గాంధీ ఆసుపత్రిలో జూడాలు సమావేశమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలల నుంచి హాజరయ్యారు. వైద్యారోగ్యశాఖ మంత్రి, ఉన్నతాధికారులతో మరోసారి సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జూడాలు తమ డిమాండ్లపై అంతర్గత చర్చలు జరుపుతున్నారు.
సమ్మెను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు (జూడా) ప్రకటించిన విషయం తెలిసిందే. డీఎంఈ, ఆరోగ్య శాఖ అధికారులతో మంగళవారం అర్ధరాత్రి వరకు వారు చర్చలు జరిపారు. ఈక్రమంలో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో జూడాల వసతి భవనాల ఏర్పాటుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాకతీయ వర్సిటీలో రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామని తెలిపింది. బుధవారం ఇందుకు సంబంధించి రెండు జీవోలు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. జీవోలు విడుదల కాకపోతే మళ్లీ సమ్మె కొనసాగిస్తామని జూడాలు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం తాజాగా రెండు జీవోలు విడుదల చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛన్దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్దారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
డీఎస్ మృతిపట్ల తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం
కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్లో డీఎస్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. -
ఊదమంటే.. బ్రీత్ ఎనలైజర్ లాక్కెళ్లాడు!
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసుల ఏమరుపాటును అదనుగా తీసుకున్న ఓ వాహనదారుడు బ్రీత్ ఎనలైజర్ను లాక్కుని వెళ్లాడు. -
కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. -
లింకు నొక్కారో.. ఖాతా ఖాళీ
పీఎంకిసాన్ పథకంలో భాగంగా.. కేంద్ర ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకుని డబ్బులు వచ్చాయా లేదా తెలుసుకోవచ్చని సైబర్ నేరగాళ్లు తప్పుడు లింకులు పంపుతున్నారు. -
యూజీసీ నెట్-2024 పరీక్ష కొత్త తేదీలను ప్రకటించిన ఎన్టీఏ
యూజీసీ నెట్ పరీక్ష కొత్త తేదీలను జాతీయ పరీక్ష సంస్థ (NTA) ప్రకటించింది. ఈ సారి పెన్ను పేపర్ విధానంలో కాకుండా కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. -
విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి
బాగా చదువుకున్నవారు రాజకీయాల్లోకి రావాలని తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, ప్రముఖ నటుడు విజయ్ కోరారు. మంచి నాయకులు కావాలా, వద్దా అనేది విద్యార్థులే నిర్ణయించుకోవాలని సూచించారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/06/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు
-
రజనీకాంత్, కమల్ హాసన్, అర్జున్: ‘సినిమాటిక్ యూనివర్స్’పై శంకర్ ఏమన్నారంటే?
-
పింఛన్దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
డీఎస్ మృతిపట్ల తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం
-
వచ్చే వారంలో కొలిక్కి!.. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు