Sridharbabu: ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ విస్తరిస్తాం: మంత్రి శ్రీధర్‌బాబు

ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ విస్తరించాలన్నదే తమ సంకల్పమని తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.

Updated : 04 Jul 2024 19:28 IST

హనుమకొండ: రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ విస్తరించాలన్నదే తమ సంకల్పమని తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. హనుమకొండలో రాక్స్‌ ఐటీ పార్కును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఐటీ పరిశ్రమకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. విదేశాల్లోని తెలంగాణ వాసులు రాష్ట్రానికి వచ్చి ఐటీ కార్యాలయాలు స్థాపించాలని కోరారు. 

‘‘ఎన్నారైలకు ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తాం. మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటాం. పారిశ్రామికంగా హనుమకొండ, వరంగల్‌ అభివృద్ధి చెందుతాయి. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తాం. ప్రైవేటు పరిశ్రమలతో యువతకు ఉపాధి కల్పిస్తాం’’ అని శ్రీధర్‌బాబు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని