Kadapa: ప్రైవేటు పాఠశాలలో స్లాబ్‌ పెచ్చులూడి ఆరుగురు విద్యార్థులకు గాయాలు

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డికి సంబంధించిన ప్రైవేటు పాఠశాలలో స్లాబ్‌ పెచ్చులూడి ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి.

Updated : 02 Jul 2024 16:23 IST

కడప నేరవార్తలు: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డికి సంబంధించిన ప్రైవేటు పాఠశాలలో పైకప్పు పెచ్చులూడి ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిలో ఇద్దరికి బలమైన గాయాలు కాగా.. నగరంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కడప నగరంలోని అక్కయ్యపల్లిలో సాయిబాబా ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి గదిలో మంగళవారం మధ్యాహ్నం స్లాబు  పెచ్చులు ఊడి పడ్డాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విషయం మీడియా దృష్టికి రావడంతో విద్యార్థులను తిరిగి పాఠశాలకు తీసుకెళ్లారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు