- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
RERA: రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలకు ‘రెరా’ షోకాజ్ నోటీసులు
సోనెస్టా ఇన్ఫినిటి, హస్తిన రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు షోకాజ్ నోటీసులు జారీచేసినట్లు ‘రెరా’ అథారిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్: సోనెస్టా ఇన్ఫినిటి, హస్తిన రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు షోకాజ్ నోటీసులు జారీచేసినట్లు ‘రెరా’ అథారిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సోనెస్టా ఇన్ఫినిటీ ప్రమోటర్ గచ్చిబౌలి కేర్ హాస్పిటల్ వెనుక ఉన్న జయభేరి పైన్ కాలనీలో స్కై విల్లాస్ నిర్మాణాలకు ‘రెరా’ రిజిస్ట్రేషన్ పొందకుండా సోషల్ మీడియా ద్వారా బ్రోచర్ విడుదల చేసి ప్రచార కార్యక్రమాలు నిర్వహించినట్లు గుర్తించామని పేర్కొన్నారు. అదే విధంగా హస్తిన రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్స్ ‘బ్రిస్సా’ ప్రాజెక్టు పేరుతో బ్రోచర్ విడుదల చేసి వెబ్సైట్, సోషల్ మీడియా ద్వారా ప్రజలను, కొనుగోలుదారులను ఆకర్షించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించిందని చెప్పారు. ఈ విషయం ‘రెరా’ అథారిటి దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఆయా ప్రాజెక్టులకు షోకాజ్ నోటీసు జారీ చేశామని పేర్కొన్నారు. వారం రోజుల్లోగా ఆ సంస్థలు వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు అథారిటీ తెలిపింది.
‘రెరా’ చట్టంలోని 3(1), 4(1) నిబంధనల ప్రకారం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, ఏజెంట్లు తప్పనిసరిగా తమ ప్రాజెక్టులను ‘రెరా’లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రెరా అథారిటీ తెలిపింది. ఏవైనా ప్రాజెక్టుల్లో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సెక్షన్ 59 ప్రకారం జరిమానా విధించడంతోపాటు క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని తేల్చి చెప్పింది. ఇళ్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసేవారు ‘రెరా’ రిజిస్ట్రేషన్ పూర్తయిన ప్రాజెక్టుల్లో మాత్రమే కొనుగోలు చేయాలని.. ప్రీలాంచ్ ఆఫర్లు, మోసపూరిత ప్రకటనలు నమ్మొద్దని అథారిటీ విజ్ఞప్తి చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు
పోలీసుల అరెస్టు నుంచి తనకు రక్షణ కోరుతూ మాచర్ల వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. -
జూడాల సమ్మె తాత్కాలిక విరమణ.. రెండు జీవోలు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
జూనియర్ డాక్టర్లకు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం రెండు జీవోలను జారీ చేసింది. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల జూడాల వసతిగృహాల నిర్మాణానికి జీవో విడుదల చేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
కుప్పంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) కుప్పం పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. -
శంషాబాద్లో చిరుత సంచారం.. ఆచూకీ కోసం 20 కెమెరాలతో నిఘా
శంషాబాద్లో చిరుత సంచారం కలకలం సృష్టించింది. దీంతో ఘాన్సీమియాగూడలో అటవీ శాఖ అధికారులు గాలిస్తున్నారు. -
నేడే ఏపీ ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను బుధవారం సాయంత్రం 5 గంటలకు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యాలయంలో విడుదల చేయనున్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జూడాల సమ్మెకు తాత్కాలిక బ్రేక్
తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మెను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. డీఎంఈ, ఆరోగ్య శాఖ అధికారులతో మంగళవారం అర్ధరాత్రి వరకు వారు చర్చలు జరిపారు. -
పునఃసృష్టి శిల్పం.. జీవకళ పదిలం..
రామప్ప.. కాకతీయుల కాలం నాటి అత్యద్భుత ఆలయం.. ఎన్నో ప్రత్యేకతలకు నిలయం.. ఆనాటి శిల్పకళా నైపుణ్యానికి ప్రతిబింబం. చారిత్రక, సంస్కృతి సంప్రదాయాలకు నెలవు. రెండు తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు సాధించిన ఏకైక అద్భుతం.. కళాత్మక శిల్పాలతో అలనాటి వైభవాన్ని సగర్వంగా చాటుతోంది. -
రుణమాఫీపై రైతుల్లో ఆందోళన
ఆగస్టు 15 లోపు రైతులకు ఒకే దఫాలో రూ.2 లక్షల వరకు పంటరుణాన్ని మాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటున్నా కటాఫ్ తేదీలపైనే అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. -
ఆశ పడితే ఆగమే..
కూర్చున్న చోటే రూ.లక్షలు సంపాదించాలనే అత్యాశ కొందరిని నిండా ముంచుతోంది. చరవాణులకు సందేశాలు పంపి మీకు కావాల్సినవి ఇదిగో అంటూ ఆశ చూపి చోరులు బ్యాంకు ఖాతాలు ఖాళీ చేయడంతో బాధితుల బతుకులు ఆగమవుతున్నాయి. -
గొర్రెల కాపరులకూ తుపాకులు
రాష్ట్రంలో గొర్రెలు, మేకల దొంగతనాలు ఎక్కువ కావడంతో వాటిని పోషించే వారికి తుపాకీ లైసెన్సులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. -
కండల కోసం ఇంజక్షన్లు
నిబంధనలకు విరుద్ధంగా ఉత్ప్రేరకాలు విక్రయిస్తున్న బండ్లగూడకు చెందిన మహ్మద్ షా ఫహాద్ను అదుపులోకి తీసుకున్నట్టు మంగళవారం సీసీఎస్ డీసీపీ శ్వేత తెలిపారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/06/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పన్ను చెల్లింపుదారుల డబ్బు తింటున్నావంటూ ట్రోల్స్.. హర్భజన్ కౌంటర్
-
అధికారులకు చెంపపెట్టు.. చేయి చేయి కలిపి స్వయంగా రోడ్డు బాగు చేసుకొని!
-
ఐపీ రేటింగ్ అంటే ఏంటి? IP67, IP68ని ఎలా అర్థం చేసుకోవాలి?
-
వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు
-
మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు సరికాదని చెప్పినా భారాస ప్రభుత్వం పట్టించుకోలేదు: కోదండరాం
-
టికెట్ రీషెడ్యూల్ చేయలేదని విమానానికి బాంబు బెదిరింపు