- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Warangal: కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రమేశ్పై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.
హైదరాబాద్: కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రమేశ్పై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. నియామకాలు, బదిలీలు, బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడ్డారని రమేశ్పై ఆరోపణలు ఉన్నాయి. పలువురు కేయూ అధ్యాపకులు కూడా ఆయనపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వానికి అందిన ఫిర్యాదులను విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం.. విజిలెన్స్ డీజీకి పంపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పునఃసృష్టి శిల్పం.. జీవకళ పదిలం..
రామప్ప.. కాకతీయుల కాలం నాటి అత్యద్భుత ఆలయం.. ఎన్నో ప్రత్యేకతలకు నిలయం.. ఆనాటి శిల్పకళా నైపుణ్యానికి ప్రతిబింబం. చారిత్రక, సంస్కృతి సంప్రదాయాలకు నెలవు. రెండు తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు సాధించిన ఏకైక అద్భుతం.. కళాత్మక శిల్పాలతో అలనాటి వైభవాన్ని సగర్వంగా చాటుతోంది. -
రుణమాఫీపై రైతుల్లో ఆందోళన
ఆగస్టు 15 లోపు రైతులకు ఒకే దఫాలో రూ.2 లక్షల వరకు పంటరుణాన్ని మాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటున్నా కటాఫ్ తేదీలపైనే అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. -
కండల కోసం ఇంజక్షన్లు
నిబంధనలకు విరుద్ధంగా మత్తు ఇంజక్షన్లు విక్రయిస్తున్న బండ్లగూడకు చెందిన మహ్మద్ షా ఫహాద్ను అదుపులోకి తీసుకున్నట్టు మంగళవారం సీసీఎస్ డీసీపీ శ్వేత తెలిపారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/06/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.