NTR-Amit Shah: అమిత్‌షాతో భేటీ కానున్న ఎన్టీఆర్‌

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ప్రముఖ సినీనటుడు ఎన్టీఆర్‌ భేటీ కానున్నారు.

Updated : 21 Aug 2022 14:08 IST

హైదరాబాద్‌: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ప్రముఖ సినీనటుడు ఎన్టీఆర్‌ భేటీ కానున్నారు. మునుగోడు పర్యటనలో భాగంగా అమిత్‌షా రాష్ట్రానికి వస్తున్నారు. మునుగోడులో సభ అనంతరం తిరుగు పయనంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి అమిత్‌షా చేరుకోనున్నారు.

ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న నోవాటెల్‌ హోటల్‌లో సాయంత్రం ఆయనతో ఎన్టీఆర్‌ సమావేశం కానున్నారు. అమిత్‌షా-ఎన్టీఆర్‌ భేటీని భాజపా వర్గాలు ధ్రువీకరించాయి. ఏయే అంశాలపై వీరిద్దరూ మాట్లాడుకుంటారు? రాజకీయ పరమైన కారణాలా? ఇతర అంశాలా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అమిత్‌షా-ఎన్టీఆర్‌ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని