Nara Lokesh: మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న నారా లోకేశ్

మంత్రి నారా లోకేశ్‌ గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో పర్యటించారు. కంఠంరాజు కొండూరులోని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.

Updated : 04 Jul 2024 13:51 IST

దుగ్గిరాల: మంత్రి నారా లోకేశ్‌ గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో పర్యటించారు. కంఠంరాజు కొండూరులోని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. వేద పండితులు ఆశీర్వచనాలిచ్చారు.

ఆ తర్వాత అక్కడ నూతనంగా నిర్మిస్తున్న ఆలయ నిర్మాణాలను లోకేశ్‌ పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై ధర్మకర్తలు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్దఎత్తున ప్రజలు వస్తున్న నేపథ్యంలో ఆలయ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. భక్తుల సౌకర్యం కోసం మెరుగైన రోడ్లు, పార్కింగ్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. దేవాలయ పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను లోకేశ్‌ ఆదేశించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని