- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Jupalli: తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం
తెలంగాణ ఎక్సైజ్శాఖ పనితీరుపై మంత్రి జూపల్లి కృష్ణారావు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: తెలంగాణ ఎక్సైజ్శాఖ పనితీరుపై మంత్రి జూపల్లి కృష్ణారావు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన దృష్టికి రాకుండానే పలు నిర్ణయాలు తీసుకోవడం పట్ల మంత్రి అసహనం వ్యక్తం చేశారు. బెవరేజ్ కార్పొరేషన్ తప్పుడు నిర్ణయాల కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని మండిపడ్డారు. కీలక అధికారులు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆదేశించారు. కొందరి సొంత నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలన్నారు. ఏ నిబంధనల ప్రకారం కొత్త నిర్ణయాలు తీసుకున్నారని అధికారులను జూపల్లి ప్రశ్నించారు. విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/06/24)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
ఈ 35 ఫోన్ల మోడల్స్లో వాట్సప్ బంద్.. జాబితాలో మీ మొబైల్ ఉందా?
-
విధుల్లో ఉండగా గుండెపోటు.. బ్యాంకు ఉద్యోగి మృతి!
-
‘కల్కి 2898 ఏడీ’లో ఆ ఇద్దరు హీరోలున్నారు: రివీల్ చేసిన నాగ్ అశ్విన్
-
చిన్న జట్టు పెద్ద ఆట... అప్పుడు కెన్యా.. ఇప్పుడు అఫ్గాన్