- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Gottipati: రామాపురం బీచ్లో వరుస ప్రమాదాలు.. రక్షణ చర్యలపై మంత్రి గొట్టిపాటి సమీక్ష
బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం బీచ్లో వరుస ప్రమాదాలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అమరావతి: బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం బీచ్లో వరుస ప్రమాదాలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూన్ నెలలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. ఆదివారం మధ్యాహ్నం గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ఇద్దరు సముద్రంలో గల్లంతై మృతి చెందారు. ఈ నేపథ్యంలో జిల్లా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమీక్ష నిర్వహించారు. జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడిన ఆయన.. సముద్రతీరంలో వరుస ప్రమాదాలు జరుగుతూ యువకులు చనిపోతుంటే ఎందుకు నష్ట నివారణ చర్యలు చేపట్టట్లేదని అధికారులను నిలదీశారు. తక్షణమే గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచడంతో పాటు ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందుకోసం మెరైన్ పోలీసుల సాయం తీసుకోవాలని సూచించారు.
సమీపంలో రిసార్ట్స్ ఉండటంతో విహార యాత్రకు వచ్చిన యువత ప్రమాదాలకు గురవుతున్నారని మంత్రికి అధికారులు వివరించారు. రిసార్ట్స్ యాజమాన్యం కూడా ప్రమాదాల నివారణకు బాధ్యత తీసుకునేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. పోలీస్, రెవెన్యూ, పర్యాటక ఇతరశాఖల అధికారులతో పాటు రిసార్ట్స్ యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి ప్రమాదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 46.45 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగు అవుతుందని.. పంటల సాగులో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. -
ఉప్పాడ తీరాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడలో మూడోరోజు పర్యటిస్తున్నారు. వాకతిప్ప ఫిషింగ్ హార్బర్ ప్రాంతాన్ని, సూరప్ప తాగునీటి చెరువును ఆయన పరిశీలించారు. -
అది తప్పుడు ప్రచారం.. దాన్ని నమ్మవద్దు: తితిదే
శ్రీవారికి నివేదించే అన్న ప్రసాదాల తయారీలో మార్పులంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని తితిదే తెలిపింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమలకు బస్సుల్లో బయల్దేరిన అమరావతి ప్రాంత రైతులు
తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకునేందుకు రాజధాని అమరావతి ప్రాంత రైతులు బయల్దేరారు. -
మంత్రి నారా లోకేశ్ ‘ప్రజాదర్బార్’కు అనూహ్య స్పందన.. భారీగా తరలివచ్చిన ప్రజలు
మంత్రి నారా లోకేశ్ నిర్వహిస్తున్న “ప్రజాదర్బార్”కు మంచి స్పందన లభిస్తోంది. బుధవారం ఉదయం నుంచే ఉండవల్లి నివాసం వద్ద వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, యువత, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు బారులు తీరారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆరుపలకల దేహం.. స్టెరాయిడ్స్తో ఆగమాగం!
అందమైన దేహం.. ఆకట్టుకునే రూపం ఆతృతలో కొందరు తప్పటడుగులు వేస్తున్నారు. యువకుల ఆసక్తిని అవకాశంగా కొన్ని జిమ్ సెంటర్లు స్టెరాయిడ్స్ను అలవాటు చేస్తున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు
-
‘డిక్టేటర్ ఎవరో ఇప్పుడు చెప్పండి’: మోదీ, రాహుల్ వీడియోలు షేర్ చేసిన భాజపా
-
ఉప్పాడ తీరాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. పోలీసుల అదుపులో ఐదుగురు వైకాపా కార్యకర్తలు
-
అది తప్పుడు ప్రచారం.. దాన్ని నమ్మవద్దు: తితిదే
-
దేశీయ సోషల్ మీడియా ‘కూ’ యాప్ మూత!