Telangana News: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కేఎస్‌ శ్రీనివాసరాజు

తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కేఎస్‌ శ్రీనివాస రాజు నియమితులయ్యారు.

Published : 01 Jul 2024 16:58 IST

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కేఎస్‌ శ్రీనివాసరాజు నియమితులయ్యారు. మౌలిక వసతులు, ప్రాజెక్టుల సలహాదారుగా ఆయన వ్యవహరించనున్నారు. ఈ మేరకు సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 

ఎనిమిది మంది ఐపీఎస్‌ల బదిలీ

రాష్ట్రంలో ఎనిమిది మంది ఐపీఎస్‌లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. వీరిని బదిలీ చేస్తూ సీఎస్‌ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగూడెం ఓఎస్‌డీగా పరితోశ్‌ పంకజ్‌, ములుగు ఓఎస్‌డీగా గీతే మహేష్‌ బాబా సాహెబ్‌, సౌత్‌ ఈస్ట్‌ జోన్‌ డీసీపీగా పాటిల్‌ కాంతిలాల్‌ సుభాష్‌, గవర్నర్‌ ఓఎస్డీగా సిరిశెట్టి సంకీర్త్‌, వేములవాడ ఏఎస్పీగా శేషాద్రిని రెడ్డి, భద్రాచలం ఏఎస్పీగా అంకిత్‌ కుమార్‌, ఏటూరునాగారం ఏఎస్పీగా శివం ఉపాధ్యాయ, భైంసా ఏఎస్పీగా అవినాశ్ కుమార్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని