రూ.52 లక్షల అవినీతి ఆరోపణలు.. కొండగట్టు ఈవోపై సస్పెన్షన్‌ వేటు

జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయ ఈవో వెంకటేశ్‌ సస్పెండ్‌ అయ్యారు.

Published : 23 Mar 2024 23:13 IST

కొండగట్టు: జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయ ఈవో వెంకటేశ్‌ సస్పెండ్‌ అయ్యారు. ఆలయ సిబ్బందిపై వచ్చిన రూ.52 లక్షల అవినీతి ఆరోపణలపై నిర్లక్ష్యం వహించినందుకు ఆయన సస్పెండ్‌ చేస్తూ దేవాదాయ కమిషనర్‌ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. గత కొద్ది రోజులుగా కొండగట్టులో భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకోవడం, రూ.52 లక్షల నిధుల దుర్వినియోగం జరగడంపై రెండు రోజుల క్రితం అడిషనల్‌ డిప్యూటీ కమిషనర్‌ జ్యోతి విచారణ జరిపి ఇచ్చిన నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్‌కు కొండగట్టు ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని