- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Kavitha: దిల్లీ హైకోర్టులో కవితకు నిరాశ.. బెయిల్ పిటిషన్లు తిరస్కరణ
భారాస ఎమ్మెల్సీ కవితకు దిల్లీ హైకోర్టులో నిరాశ ఎదురైంది. దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన ఆమె దాఖలు చేసిన రెండు బెయిల్ పిటిషన్లను దిల్లీ ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది.
దిల్లీ: భారాస ఎమ్మెల్సీ కవితకు దిల్లీ హైకోర్టులో నిరాశ ఎదురైంది. దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన ఆమె బెయిల్ కోరుతూ దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్లను దిల్లీ ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. సీబీఐ, ఈడీ తనపై నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలంటూ ఆమె దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. మద్యం కేసులో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో మార్చి 15న ఈడీ అధికారులు కవితను అరెస్టు చేసి దిల్లీకి తరలించిన విషయం తెలిసిందే. వారం రోజుల ఈడీ కస్టడీ అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి తరలించాక.. ఏప్రిల్లో విచారణ సందర్భంగా సీబీఐ రెండు రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించింది. ఆ తర్వాత ఆమెను అరెస్టు చేసినట్లు ప్రకటించింది. తర్వాత ఆమెను కోర్టులో హాజరు పరచగా.. 14 రోజులు రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం కవిత జ్యుడీషియల్ కస్టడీలో ఉంటున్నారు.
దీంతో తనపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసులపై బెయిల్ కోరుతూ గతంలో రెండు వేర్వేరు పిటిషన్లను దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో కవిత దాఖలు చేయగా.. విచారించిన ఆ న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. దీంతో ట్రయల్ కోర్టు ఉత్తర్వులను ఆమె దిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. కవితను నిరాధార ఆరోపణలతో అరెస్టు చేశారని, ఒక పార్టీకి కీలక నేతగా ఉన్నా ఆమెకు ఎలాంటి అవకాశాలు కల్పించకుండా ఉంచారంటూ ఆరోపిస్తూ ఆమె తరఫు న్యాయవాదులు వాదించారు. ఈడీ, సీబీఐ తరఫున వాదనలు వినిపిస్తూ.. దిల్లీ మద్యం కేసులో కవిత కీలక పాత్రధారి, సూత్రధారి అని కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం దిల్లీ మద్యం కేసు కీలక దశలో కొనసాగుతున్న తరుణంలో ఆమెకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని వాదించారు. అందువల్ల ఎట్టిపరిస్థితుల్లో ఆమెకు బెయిల్ మంజూరు చేయొద్దని కోరారు. సీబీఐ, ఈడీ వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు కవిత పిటిషన్లను తిరస్కరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉచిత ఇసుక పంపిణీకి విధివిధానాలు తయారు చేస్తున్నాం: మంత్రి కొల్లు రవీంద్ర
ఏపీలో మళ్లీ ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టడం శుభపరిణామని గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ప్రపంచంలోనే అతిపెద్ద భూసేకరణ ప్రాజెక్టు అమరావతి: చంద్రబాబు
ప్రపంచంలోనే అతిపెద్ద భూ సేకరణ ప్రాజెక్టు అమరావతి అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. -
ఏపీలో ఈనెల 8 నుంచి ఉచిత ఇసుక విధానం
ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి తేవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. -
నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 46.45 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగు అవుతుందని.. పంటల సాగులో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. -
ఉప్పాడ తీరాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడలో మూడోరోజు పర్యటిస్తున్నారు. వాకతిప్ప ఫిషింగ్ హార్బర్ ప్రాంతాన్ని, సూరప్ప తాగునీటి చెరువును ఆయన పరిశీలించారు. -
అది తప్పుడు ప్రచారం.. దాన్ని నమ్మవద్దు: తితిదే
శ్రీవారికి నివేదించే అన్న ప్రసాదాల తయారీలో మార్పులంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని తితిదే తెలిపింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమలకు బస్సుల్లో బయల్దేరిన అమరావతి ప్రాంత రైతులు
తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకునేందుకు రాజధాని అమరావతి ప్రాంత రైతులు బయల్దేరారు. -
మంత్రి నారా లోకేశ్ ‘ప్రజాదర్బార్’కు అనూహ్య స్పందన.. భారీగా తరలివచ్చిన ప్రజలు
మంత్రి నారా లోకేశ్ నిర్వహిస్తున్న “ప్రజాదర్బార్”కు మంచి స్పందన లభిస్తోంది. బుధవారం ఉదయం నుంచే ఉండవల్లి నివాసం వద్ద వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, యువత, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు బారులు తీరారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆరుపలకల దేహం.. స్టెరాయిడ్స్తో ఆగమాగం!
అందమైన దేహం.. ఆకట్టుకునే రూపం ఆతృతలో కొందరు తప్పటడుగులు వేస్తున్నారు. యువకుల ఆసక్తిని అవకాశంగా కొన్ని జిమ్ సెంటర్లు స్టెరాయిడ్స్ను అలవాటు చేస్తున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పరాగ్ స్పెషల్.. అభిషేక్ ఆనందం.. జింబాబ్వే టూర్ వేళ యువ భారత్ ముచ్చట్లు
-
హామీల అమలుపై కాంగ్రెస్ నేతల కాలయాపన: రఘునందన్రావు
-
ఆ రాష్ట్రంలో కుప్పకూలుతున్న వంతెనలు.. 15 రోజుల్లో ఏడు!
-
సీఎంఎఫ్ బ్రాండ్ అంబాసిడర్గా రష్మిక
-
స్వదేశానికి టీమ్ఇండియా.. ప్రధాని మోదీతో ప్లేయర్ల భేటీ ఎప్పుడంటే?
-
ఉచిత ఇసుక పంపిణీకి విధివిధానాలు తయారు చేస్తున్నాం: మంత్రి కొల్లు రవీంద్ర