Hyderabad News: కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీలో రసాభాస

ఖైరతాబాద్‌ మండల కార్యాలయంలో బోరబండ, రెహమత్‌నగర్‌ డివిజన్లకు చెందిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీ శనివారం జరిగింది.

Updated : 29 Jun 2024 15:06 IST

బోరబండ: ఖైరతాబాద్‌ మండల కార్యాలయంలో బోరబండ, రెహమత్‌నగర్‌ డివిజన్లకు చెందిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, రెహమత్‌నగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ సీఎన్‌ రెడ్డి పాల్గొన్నారు. ముందస్తు అనుమతితో బోరబండ కార్పొరేటర్‌ ఎండీ బాబా ఫసియుద్దీన్‌, సతీమణి హబీబా సుల్తానా, ఖైరతాబాద్‌ మండల తహసీల్దార్‌ ఎండీ నయీముద్దీన్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఏ హోదాతో కార్యక్రమానికి వచ్చారంటూ హబీబాను ఎమ్మెల్యే నిలదీశారు. దీంతో బాబా మద్దతుదారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, భారాస వర్గీయుల మధ్య గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే కార్యక్రమం నుంచి నిష్ర్కమించారు. తహసీల్దార్‌ విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే మళ్లీ వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య చెక్కుల పంపిణీ కార్యక్రమం సజావుగా సాగింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని