- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Andhra news: ఇంటర్ విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
అమరావతి: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాటితోపాటుగా కేజీబీవీలు, ఏపీ మోడల్ స్కూల్స్, ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలు, హైస్కూల్ ప్లస్ విద్యార్థులకు సైతం ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయనుంది. ఇంటర్ మొదటి సంవత్సరంలో 1,08,619 మంది, ద్వితీయ సంవత్సరంలో 92,134 మంది విద్యార్థులకు ప్రభుత్వ నిర్ణయంతో లబ్ధి చేకూరనుంది.
ఈ పథకానికి నోడల్ అధికారిగా సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాఠ్యపుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలు, బ్యాగ్లను తెలుగు అకాడమీ నుంచి సరఫరా చేయించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న పుస్తకాల స్టాక్ను పంపిణీ చేయాల్సిందిగా ఆదేశాలు వెలువరించింది. పంపిణీలో లోటు ఉంటే తక్షణం పుస్తకాల ముద్రణకు అనుమతిచ్చేలా చూడాలని సమగ్ర శిక్ష డైరెక్టర్కు సూచించింది. జులై 15 నాటికి విద్యార్థులందరికీ పుస్తకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
కుప్పంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) కుప్పం పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. -
శంషాబాద్లో చిరుత సంచారం.. ఆచూకీ కోసం 20 కెమెరాలతో నిఘా
శంషాబాద్లో చిరుత సంచారం కలకలం సృష్టించింది. దీంతో ఘాన్సీమియాగూడలో అటవీ శాఖ అధికారులు గాలిస్తున్నారు. -
నేడే ఏపీ ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను బుధవారం సాయంత్రం 5 గంటలకు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యాలయంలో విడుదల చేయనున్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జూడాల సమ్మెకు తాత్కాలిక బ్రేక్
తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మెను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. డీఎంఈ, ఆరోగ్య శాఖ అధికారులతో మంగళవారం అర్ధరాత్రి వరకు వారు చర్చలు జరిపారు. -
పునఃసృష్టి శిల్పం.. జీవకళ పదిలం..
రామప్ప.. కాకతీయుల కాలం నాటి అత్యద్భుత ఆలయం.. ఎన్నో ప్రత్యేకతలకు నిలయం.. ఆనాటి శిల్పకళా నైపుణ్యానికి ప్రతిబింబం. చారిత్రక, సంస్కృతి సంప్రదాయాలకు నెలవు. రెండు తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు సాధించిన ఏకైక అద్భుతం.. కళాత్మక శిల్పాలతో అలనాటి వైభవాన్ని సగర్వంగా చాటుతోంది. -
రుణమాఫీపై రైతుల్లో ఆందోళన
ఆగస్టు 15 లోపు రైతులకు ఒకే దఫాలో రూ.2 లక్షల వరకు పంటరుణాన్ని మాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటున్నా కటాఫ్ తేదీలపైనే అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. -
ఆశ పడితే ఆగమే..
కూర్చున్న చోటే రూ.లక్షలు సంపాదించాలనే అత్యాశ కొందరిని నిండా ముంచుతోంది. చరవాణులకు సందేశాలు పంపి మీకు కావాల్సినవి ఇదిగో అంటూ ఆశ చూపి చోరులు బ్యాంకు ఖాతాలు ఖాళీ చేయడంతో బాధితుల బతుకులు ఆగమవుతున్నాయి. -
గొర్రెల కాపరులకూ తుపాకులు
రాష్ట్రంలో గొర్రెలు, మేకల దొంగతనాలు ఎక్కువ కావడంతో వాటిని పోషించే వారికి తుపాకీ లైసెన్సులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. -
కండల కోసం ఇంజక్షన్లు
నిబంధనలకు విరుద్ధంగా ఉత్ప్రేరకాలు విక్రయిస్తున్న బండ్లగూడకు చెందిన మహ్మద్ షా ఫహాద్ను అదుపులోకి తీసుకున్నట్టు మంగళవారం సీసీఎస్ డీసీపీ శ్వేత తెలిపారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/06/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జగన్ ప్రతిపక్ష నేత కాదు.. వైకాపా ఫ్లోర్ లీడర్ మాత్రమే: మంత్రి పయ్యావుల
-
రోడ్లు సరిగా లేకపోతే.. టోల్ వసూలు చేయొద్దు: గడ్కరీ
-
రోహిత్ ఆ ఒక్క ఇన్నింగ్స్తో.. వారి నోళ్లు మూయించాడు: గిల్క్రిస్ట్
-
కావాలనే అప్పుడు రెమ్యూనరేషన్ పెంచాను: కమల్ హాసన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మీ చిరునవ్వుతో సభలో ఆనందం: ఓం బిర్లాపై మోదీ ప్రశంసలు