Tirumala: తిరుమల ఘాట్‌రోడ్డులో ఏనుగుల కలకలం

తిరుమలలోని ఘాట్‌రోడ్డులో ఏనుగులు కలకలం సృష్టించాయి. అప్రమత్తమైన అటవీ శాఖ సిబ్బంది వాటిని అడవుల్లోకి పంపించారు.

Published : 28 Jun 2024 20:23 IST

తిరుమల: తిరుమలలో గత కొంతకాలంగా పులుల సంచారం భక్తుల్ని భయాందోళనలకు గురిచేయగా.. తాజాగా ఏనుగులు కలకలం సృష్టిస్తున్నాయి. శుక్రవారం తిరుమలలోని మొదటి ఘాట్‌రోడ్డు ఏడో మైలు వద్ద ఏనుగుల గుంపు సంచరించింది. ఏనుగులు రోడ్డుపైకి రావడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన అటవీ శాఖ సిబ్బంది.. వాటిని అడవుల్లోకి పంపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని