- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Electricity bills: ఆ యాప్స్లో కరెంట్ బిల్లులు చెల్లించలేరు.. కారణం ఇదే..!
Electricity bills: ఫోన్పే, అమెజాన్ పే వంటి పేమెంట్స్ యాప్స్ ద్వారా కరెంట్ బిల్లులు చెల్లిస్తున్నారా? అయితే ఈ నెల నుంచి కుదరదు.
Electricity bills | హైదరాబాద్: ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్ను ఉపయోగించి విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారా? అయితే ఈ నెల నుంచి విద్యుత్ బిల్లుల చెల్లింపులు చేయడం సాధ్యపడదు. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల తరహాలోనే ఆయా యాప్స్ ఈ సేవలనూ నిలిపి వేయడమే కారణం. ఈ నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) సోమవారం ఆ మేరకు ప్రకటన చేయగా.. ఆంధ్రప్రదేశ్ తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ సైతం (APEPDCL) తమ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్లోనే బిల్లుల చెల్లింపులు చేయాలని వినియోగదారులకు సూచించింది. ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి జులై 1 నుంచి ఆయా చెల్లింపు సంస్థలు విద్యుత్ బిల్లులు చెల్లింపులను నిలిపివేశాయని రెండు విద్యుత్ పంపిణీ సంస్థలు వెల్లడించాయి.
TGSPDCL, APEPDCL మాత్రమే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర డిస్కమ్లదీ అదే పరిస్థితి. TGNPDCL, APSPDCL, APCPDCL పరిధిలోని బిల్లులు చెల్లించాలని ప్రయత్నించినప్పుడు భారత్ బిల్లు పేమెంట్ సిస్టమ్కు రిజిస్టర్ కాలేదని చూపిస్తోంది. దీనివల్ల పెద్ద సంఖ్యలో వినియోగదారులపై ప్రభావం పడనుంది. దీంతో ఆయా విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలోని వినియోగదారులు డిస్కమ్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ను ఆశ్రయించాల్సిందే.
ఆర్బీఐ ఏం చెప్పింది?
బిల్లు చెల్లింపుల్లో సమర్థత, భద్రతకు పెద్ద పీట వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. బిల్లు చెల్లింపులన్నీ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (BBPS) ద్వారానే జరగాలని నిర్దేశించింది. జులై 1 నుంచి కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. దీనిలో భాగంగా భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ను బిల్లర్లు ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేటు బ్యాంకులకు సంబంధించి హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు ఈ పేమెంట్ సిస్టమ్ను యాక్టివేట్ చేసుకోలేదు. దీంతో ఫోన్ పే, క్రెడ్ వంటి కంపెనీలు కస్టమర్ల క్రెడిట్ కార్డుల బిల్లులను ప్రాసెస్ చేయలేవు. దీనివల్ల ఆయా యాప్స్లో క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపు వీలు పడదు. ఇప్పుడు విద్యుత్ బిల్లుల చెల్లింపుల విషయంలోనూ అదే జరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్లో లైఫ్ ట్యాక్స్ సమస్యను పరిష్కరించండి.. లోకేశ్కు క్యాబ్ డ్రైవర్ల వినతి
ప్రజాదర్బార్లో మంత్రి నారా లోకేశ్ను హైదరాబాద్లో ఉంటున్న ఏపీ క్యాబ్ డ్రైవర్లు కలిశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
ఒక్క సందేశంతో ఫిర్యాదు
కేసు నమోదు చేసినా.. బాధితుల చేతికి ఎఫ్ఐఆర్ వచ్చేందుకు రోజుల తరబడి ఎదురుచూపులు.. కేసు దర్యాప్తు ఏ స్థితిలో ఉందో.. నిందితుల్ని అరెస్టు చేశారో లేదో తెలియని పరిస్థితి.. -
చిన్న మొత్తాలపై.. చిన్నచూపు
సైబర్ నేరాలను కొందరు పోలీసులు చిన్నచూపు చూస్తున్నారు. -
వీడలేమంటూ.. వీడిపోవద్దంటూ..
ఉపాధ్యాయుల బదిలీ ఆ చిన్నారుల్లో వేదన కలిగించింది. కొన్నేళ్లుగా తమకు విద్యాబుద్ధులు చెప్పిన గురువులు వెళ్లిపోతున్నారని తెలిసి కన్నీరు మున్నీరుగా ఏడ్చారు -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
పోలీసులపై మంత్రి భార్య దురుసు ప్రవర్తన.. సీఎం చంద్రబాబు సీరియస్
ఏపీ మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి సతీమణి హరితారెడ్డి పోలీసులతో ప్రవర్తించిన తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ యాప్స్లో కరెంట్ బిల్లులు చెల్లించలేరు.. కారణం ఇదే..!
-
అమెరికాలో బిలియన్ డాలర్ల స్కామ్లో భారతీయులకు జైలు
-
కాకినాడ కలెక్టరేట్లో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష
-
టీ20 ప్రపంచ కప్ ఫైనల్.. అందుకే పిచ్పై ఉన్న మట్టిని తిన్నా: రోహిత్ శర్మ
-
‘రాహుల్ గాంధీలా ప్రవర్తించకండి’.. ఎన్డీయే ఎంపీలకు మోదీ సూచన
-
హైదరాబాద్లో లైఫ్ ట్యాక్స్ సమస్యను పరిష్కరించండి.. లోకేశ్కు క్యాబ్ డ్రైవర్ల వినతి