Pawan Kalyan: ఉప్పాడ తీరాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కాకినాడలో మూడోరోజు పర్యటిస్తున్నారు. వాకతిప్ప ఫిషింగ్‌ హార్బర్‌ ప్రాంతాన్ని, సూరప్ప తాగునీటి చెరువును ఆయన పరిశీలించారు.

Published : 03 Jul 2024 13:43 IST

కాకినాడ: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మూడో రోజు కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. వాకతిప్ప ఫిషింగ్‌ హార్బర్‌, సూరప్ప తాగునీటి చెరువుతో పాటు ఉప్పాడలో కోతకు గురైన తీరప్రాంతాన్ని పవన్‌ పరిశీలించారు. తీర ప్రాంతం కోతకు గురికాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ఆయన చర్చించారు. అంతకు ముందు స్థానిక నేతలు, జనసేన కార్యకర్తలు డిప్యూటీ సీఎంకు ఘనస్వాగతం పలికారు. పలువురు ఆయన వాహనంపై పూలు చల్లి అభిమానం చాటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని