T20 World Cup: ప్రపంచకప్‌ పూనకాలు.. సచివాలయం వద్ద సంబరాలు ఇవీ..

హైదరాబాద్‌లోని ట్యాంక్‌ బండ్‌పై పెద్ద ఎత్తున చేరుకున్న క్రికెట్‌ అభిమానులు కేరింతలు కొట్టారు.

Published : 30 Jun 2024 02:23 IST

హైదరాబాద్‌: భారత్‌ టీ20 ప్రపంచకప్‌ గెలిచి విశ్వవిజేతగా నిలిచిన వేళ దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఎక్కడ చూసినా క్రికెట్‌ అభిమానుల కేరింతలే కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌కు పెద్ద ఎత్తున చేరుకున్న క్రికెట్‌ అభిమానులు బాణసంచా పేలుస్తూ ఘనంగా వేడుకలు నిర్వహించుకున్నారు. సచివాలయం వద్ద జాతీయ జెండా పట్టుకొని, టపాసులు కాలుస్తూ యువత చిందులేస్తూ గడిపారు. భారత్‌ మాతాకీ జై... అని నినాదాలు చేస్తూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. భారీగా అభిమానులు చేరుకోవడంతో ట్యాంక్‌బండ్‌, సచివాలయం పరిసర ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని