Revanth Reddy: డీఎస్‌ కుటుంబానికి కాంగ్రెస్‌ అండగా ఉంటుంది: సీఎం రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్‌ పార్టీకి డి.శ్రీనివాస్‌ (డీఎస్‌) ఎంతో సేవ చేశారని.. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు.

Updated : 30 Jun 2024 12:47 IST

నిజామాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీకి డి.శ్రీనివాస్‌ (డీఎస్‌) ఎంతో సేవ చేశారని.. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. నిజామాబాద్‌లో డీఎస్‌ భౌతికకాయం వద్ద ఆయన నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. 

‘‘డీఎస్‌ మృతి కాంగ్రెస్‌కు తీరని లోటు. 2004, 2009లో పార్టీ అధికారంలోకి వచ్చేందుకు పీసీసీ అధ్యక్షుడిగా ఆయన ఎంతో కృషి చేశారు. విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. కొంతకాలం పార్టీకి దూరమైనా పార్లమెంట్‌లో డీఎస్‌ను సోనియాగాంధీ ఆప్యాయంగా పలకరించేవారు. పదవులపై ఎప్పుడూ ఆశలేదని ఆయన చెప్పేవారు. చనిపోయినప్పుడు కాంగ్రెస్‌ జెండా కప్పాలనేది డీఎస్‌ కోరిక. అందుకే ముఖ్యనాయకులను పంపి ఆ కోరిక తీర్చాం. కుటుంబసభ్యులతో చర్చించి డీఎస్‌ జ్ఞాపకార్థం ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాం’’ అని రేవంత్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని